Friday 1 February 2013

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: శరద్ పవార్

             మొన్న లాలూ, నిన్న మాయ, నేడు పవార్ ఇలా యు పీ ఎ లో తెలంగాణా పై మద్దతు పెరుగుతూనే ఉంది, కాని కాంగ్రెస్ మాత్రం నిర్ణయాన్ని దాటవేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది..
ముంబై: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని, సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపారు. జనవరి 31న  ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాను ప్రధానికి సూచించినట్టు పవార్ స్పష్టం చేశారు.అయితే, తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయిందని, అనుకూలమైన సమయం కోసమే ఎదురు చూస్తున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తనతో అన్నారని పవార్ వెల్లడించారు. 
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే: పవార్
                  హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమేనని ఎన్సీపీ నేత శరద్‌పవార్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ అంశంపై ప్రదానితో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అయితే, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానికి నిర్మించుకునే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవాలని ఆయన ప్రధానికి సూచించినట్టు తెలిపారు.