Monday 29 October 2012

ఆదివాసీల ఆరాధ్య దైవానికి ఏదీ నివాళి?



అక్టోబర్ 29 కొమురం భీం 72వ వర్ధంతి
- ఇంకా నెరవేరని ఆశయాలు
- ‘జల్.. జంగల్.. జమీన్’ దక్కని అడవిబిడ్డలు
-  కనీస హక్కులను కాలరాస్తున్న పాలకులు
- సమస్యల వలయంలో గిరిజన ప్రాంతాలు
- విజృంభిస్తున్న వ్యాధులు
- రక్తహీనతకు బలవుతున్న ఆదివాసీలు
- రోడ్లు లేవు.. తాగేందుకు నీరూ దిక్కు లేదు
- వీరుడి జిల్లా ఆదిలాబాద్‌లో ఇదీ దుస్థితి..! 
                   1940కి ముందు..! జోడేఘాట్ ప్రాంతం..! జంగ్లాతోళ్లు, మైదానపు తోడేళ్ల కబంధహస్తాల్లో విలవిలలాడిపోతున్న సమయం. అమాయక గిరిపుత్రుల జీవితాలు ఛిద్రమవుతున్న పాశవిక కాలం. ఒక వీరుడు.. జంగు సైరన్ ఊదాడు. ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో అరాచక శక్తులకు ఎదురునిలిచాడు. నిజాం సర్కారుకు ధిక్కార స్వరం వినిపించాడు. ఆ వీరుడు.. కొమురం భీం. ఆదివాసీల ఆరాధ్య దైవం..! అక్టోబర్ 29న కొమురం భీం 72వ వర్ధంతి. ఆనాడు వేటి కోసమైతే భీం పోరాటం సాగించాడో.. నేటికీ ఆదివాసీలు వాటికోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు దాపురించాయి. కొమురం భీం త్యాగం అప్పటి నిజాం సర్కారును కదిలించినా.. ఇప్పటి ప్రభుత్వాలు మాత్రం అడవిబిడ్డలను కనికరించడం లేదు. సమస్యల వలయంలో ఆదివాసీలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తిండిలేక అలమటిస్తున్నారు. రోగాలతో మంచంపడుతున్నారు. గూడెం నుంచి మరో గూడెంకు వెళ్లేందుకు రోడ్డు కూడా దిక్కులేని ప్రాంతాలు కొమురం భీం పుట్టినిల్లు ఆదిలాబాద్ జిల్లాలో అనేకం..! తాగేందుకు నీటి సౌలత్ లేని గిరిజనవాసాలకు లెక్కేలేదు..!           
     గిరిపుత్రుల హక్కుల కోసం ప్రాణాలొదిలిన యోధుడు కొమురం భీం. 1865లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టం తీసుకురావటంతో ఆదివాసీలు ఆస్తిగా ఉన్న అడవులు ప్రభుత్వ ఆస్తిగా మారిపోయాయి. పోడు వ్యవసాయం చేయాలన్నా.. అటవీ ఉత్పత్తులు సేకరించాలన్నా.. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గిరిజనుల గూడేల మీద పడి జంగ్లాతోళ్లు పీక్కుతినేవారు. అది కావాలి.. ఇది కావాలి.. అని హింసించేవారు. గిరిపుత్రుల ఆపతికి చలించిపోయిన కొమురం భీం.. పోరుకు సిద్ధమయ్యాడు. నీరు, అడవి, భూమిపై హక్కులు అడవిబిడ్డలకు దక్కాలని.. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ కేంద్రంగా సమరం సాగించాడు. అది ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం కాలేదు.. అటవీ పుత్రులున్న ప్రతి చోటికి పాకింది. నిజాం పాలకులను కదిలించింది. అరాచక మూకల పనిపట్టింది. కానీ, అదే వీరుడి వారసులు ఇంకా సమస్యల వలయంలోనే చితికిపోతున్నారు. ఆదివాసీల హక్కుల కోసం 1940 సెప్టెంబర్ 1న కొమురం భీం ప్రాణాలొదిలినా.. గిరిపుత్రుల లెక్కల ప్రకారం ఆయన చనిపోయి అక్టోబర్ 29కి 72ఏళ్లు. ఈ సందర్భంగా జోడేఘాట్‌లో అధికారికంగా వర్ధంతి సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
నేటికీ తీరని కష్టాలు 
       ఆదివాసీలకు- అడవులకు మధ్య సంబంధం అతిపురాతనమైనది. తరతరాలుగా ప్రకృతిలో భాగంగా ఉన్న ఆదివాసీలు అడవితో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివాసీల షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో 412 షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. అడవులపై ఉన్న ఆదివాసీల హక్కులు ప్రభుత్వ విధానాల కారణంగా రాయితీలుగా మారిపోయాయి. అటవీ హక్కుల చట్టంతో ఆదివాసీలకు ఒరిగిందేమీలేదు. అడవిలోనే పుట్టి పెరిగిన ఆదివాసీలకు అడవులపై అన్ని హక్కులు ఉండాలి. అడవులను ప్రభుత్వ ఆస్తిగా మార్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు-అడవులకు మధ్య ఆంక్షలను విధిస్తూ ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నాలుచేస్తున్నాయి. ఆదివాసీ అడవిలో పోడు చేసుకోవటం అనాధిగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల 50 వేల ఎకరాల పైచిలుకు అటవీ భూముల్లో ఆదివాసీలు పోడు చేస్తున్నారు. అడవులకు ఆదివాసీలకు మధ్య అడ్డుకట్ట వేసేందుకే అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. హక్కు పత్రాల పేరుతో సుమారు 35 వేల 935 మంది ఆదివాసీలకు కాగితాలను సర్కారు అందించింది. దీని వల్ల ఆదివాసీలకు ఒరిగింది శూన్యమే.. పంట రుణాలు, రాయితీ విత్తనాలకు కూడా ఈ హక్కు పత్రాలు పనికి రావటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్, కొలాంగూడ, శివగూడ, పట్నాపూర్, బాబేఝరి, మహరాజ్‌గూడ, లైన్‌గూడ, చాల్‌బరిడి, కోపుగూడలాంటి పన్నెండు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. పైగ్రామాలకు కనీసం రోడ్డు కూడా లేదు. మండల కేంద్రమైన కెరమెరికి వారు రావాలంటే 21 కిలోమీటర్లు కాలిబాటే శరణ్యం. జోడేఘాట్ ప్రాంత గ్రామాలైన పాతగూడ, కోపుగూడ, లైన్‌గూడ తదితర గ్రామాల్లో 51 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా లేదు. భూమి సమస్య పరిష్కారం కాలేదు. 1/70 యాక్ట్‌ను ప్రభుత్వం అమలుచేయక దానిని ఒక పరిహాసంగా, ప్రహసనంగా మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ యాక్ట్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూములు ఎవరికి విక్రయించరాదు. వాటిని ఎవరూ కొనడానికి వీలులేదు. కానీ అమ్ముకుంటున్నారు.. కొనేస్తున్నారు. ప్రభుత్వమే దీనికి ముందు నిలబడి ఆ భూములను స్వాధీనం చేయించి మరీ ధారాదత్తం చేస్తున్నది. దీనికి ఉదాహరణగా తిర్యాణి, తాండూరు లాంటి మండలాలను తీసుకోవచ్చు. 
రోగాల కుంపటి 
    పౌష్ఠికాహార లోపంతోనే రక్తహీనత వస్తుంది. రక్తం తగ్గడానికి ప్రధానకారణం ఆకలికి తగిన తిండి ఉండకపోవడం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు రక్తహీనత, డయేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. తిండిలేక అలమటిస్తున్నారు. రక్తహీనతతో ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే మొత్తం జిల్లాలో 48 మంది చనిపోయారు. కెరమెరి మండలం సకరాంగూడ గ్రామానికి చెందిన గనలపాడు నాగిని(28) అనే మహిళ ఇంటి వద్ద ప్రసవం అనంతరం ఆస్పవూతికి తీసుకురాగానే మరణించింది... ఆమెకు 5.5 గ్రాముల రక్తం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రక్తహీనతే ఆమెను చంపేసిందని తేల్చారు. జిల్లాలో ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ తరఫున వైద్యులు కొన్ని గిరిజన గ్రామాల్లో 3000 మందికి రక్తపరీక్ష జరిపితే అందులో 1300 మందికి రక్తహీనత ఉన్నట్లు, అది కూడా కనీసం 11 నుంచి 13 గ్రాములుండాల్సిన రక్తం.. 4 నుంచి 7 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వం పౌష్టికాహార పంపిణీకి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కనీసం గర్భిణులకు కూడా అది అందడం లేదు. ప్రతిసారీ మరణాలు సంభవించినప్పుడల్లా అవన్నీ సహజమరణాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటిస్తూ పోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో పర్యటించినప్పుడు పౌష్ఠికాహార లోపంతోనే మరణాలు సంభవిస్తున్నాయని, అన్ని ఆకలిచావుల కిందనే లెక్కగడుతున్నామన్నట్లు స్పష్టం చేశాయి. చివరికి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సైతం ఉట్నూర్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ చావులు సంభవించడానికి తమకు ప్రధానంగా ఆకలి మంటలే కారణమని, తెలంగాణ వస్తేనే తమ ఆకలి మంటలు తీరి తమ బతుకులు బాగుపడుతాయని బహిరంగంగా పలు కుటుంబాలు ముందుకు వచ్చి చెప్పాయి.పేరుకే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పాలకులు.. ఆ వీరుడి వారసుల హక్కులను రక్షించలేకపోతున్నారు. గిరిపువూతుల సమస్యలు పరిష్కారమైనప్పుడే ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీంకు నిజమైన నివాళి.
                                                                                         -టీ మీడియా

Saturday 27 October 2012

పల్లెపల్లెకు ఉద్యమం..


బస్సు యాత్రకు సిద్ధమవుతున్నగులాబీ శ్రేణులు
- ఉద్యమ సెగను పెంచాలని నిర్ణయం
- వ్యూహరచనలో కేసీఆర్
- రూట్‌మ్యాప్‌పై కొనసాగుతున్న కసరత్తులు 
హైదరాబాద్, అక్టోబర్ 26 (): ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేలా.. కేంద్రానికి ఉద్యమ సత్తా చూపాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. పల్లెపల్లెకు వెళ్లి క్షేత్రస్థాయి ఉద్యమాలకు ప్రజలను సమాయత్తం చేసేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులోభాగంగా తెలంగాణవ్యాప్తంగా బస్సు యాత్ర లు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్రీకృతం చేసుకొని అన్ని మండలాలు, ముఖ్య గ్రామాల్లో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. యాత్ర కొనసాగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కరీంనగర్‌లో నవంబర్ 5, 6 తేదీల్లో పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గం, శాసనసభాపక్షం, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా.. కేంద్రంపై అన్ని దిక్కులనుంచి ఒత్తిడి తెస్తున్న టీఆర్‌ఎస్, క్షేత్ర స్థాయిలోనూ ఉద్యమ సెగను మరింత పెంచేలా కార్యక్షికమాలు రూపొందిస్తున్నది. మండల స్థాయి నుంచి కేడర్‌కు శిక్షణ కార్యక్షికమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. 
కేంద్రం కదలికలను బట్టి ఉద్యమం.. 
ఢిల్లీలో నెల రోజులుపాటు కాంగ్రెస్ అధిష్ఠానం దూతలతో కేసీఆర్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. పలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నందునే.. కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయాలు వెలువడలేదని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ కదలికలను బట్టి ఉద్యమ పంథాను ఖరారు చేయాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో టీఆర్‌ఎస్ తన బలాన్ని మరింత చాటుకునేందుకు కరీంనగర్ సమావేశం అనంతరం భారీ ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-టీ మీడియా

Friday 19 October 2012

తెలంగాణపై పైత్యం ముదిరితే కెమెరామెన్ గంగతో రాంబాబు

- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై విషంగక్కిన పూరీ జగన్నాథ్

                 కాల్పనిక కథలతో రంగుల చిత్రాలు సృష్టించుకునే ఓ దర్శకుడు.. ప్రత్యేక ఆకాంక్షతో సాగుతున్న విశిష్ట ఉద్యమంపై తన మనసులో ఉన్న ద్వేషాన్నంతా వెండి తెరపై కక్కేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రాన్ని కుంభకోణాల మయంగా మార్చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రాజకీయ నేతను భుజాలపై ఎత్తుకుని మోసేస్తే ఎలా ఉంటుంది? అచ్చం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలా!! ఈ సినిమాలో సమకాలీన రాజకీయాల ప్రస్తావనే ఉండదని సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు చెప్పిన దీని దర్శకుడు పూరీ జగన్నాథ్.. అవే రాజకీయ పరిణామాలను తన కథకు ఆసరా చేసుకున్నారు. అంతవరకూ అభ్యంతరం లేదు! అయితే.. తన కథకు మసాలా జోడించడం కోసం.. పైత్యం ముదిరిందన్నట్లు ఏకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై నిప్పులుగక్కడం.. విపక్ష నాయకుడిని, ఆయన కొడుకును దుష్టపాత్రల్లో చూపించి.. పరోక్షంగా ఉద్యమ నేతలపై విషం చిమ్మడం అంతర్లీనంగా అర్థమవుతుంది! తను చేస్తున్న దాడి ప్రేక్షకుడికి తెలియకుండా చూసే తాపత్రయంలో పార్టీలను, పార్టీల నేతలను కలగాపులగం చేసేసి.. విమర్శల నుంచి బయటపడిపోవచ్చని చేసిన ప్రయత్నం స్పష్టంగా గోచరిస్తుంది!!తెలంగాణ ఉద్యమంపై పూరీ జగన్నాథ్ కక్కిన విషమే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం. ఇందులో సమకాలీన రాజకీయాంశాలు ఉండవని, ఓ రాజకీయ నాయకుడికి, మీడియా రిపోర్టర్‌కు మధ్య జరిగే పోరాటమే ఇతివృత్తమని విడుదలకు కొద్దిరోజుల ముందు ఇంటర్వ్యూల్లో చెప్పారు చిత్ర దర్శకుడు. బడా రాజకీయ నాయకుడు సృష్టించే ఓ పెద్ద సమస్య నుంచి రాష్ట్రాన్ని సదరు రిపోర్టర్ కాపాడటమే కథని తెలిపారు.
  అయితే ‘కె.గం.రాం’ సినిమా చూసిన ఎవరికైనా పూరీ ఈ సినిమాను ఎవరిని లక్ష్యంగా చేసుకొని తీశారో ఇట్టే అర్థమైపోతుంది.రాజశేఖర్‌డ్డి మరణం తర్వాత ఆయన జీవితగాథ ఆధారంగా ఓ సినిమా తీస్తానని పూరీ ప్రకటించాడు. ఆ సినిమాకు ‘వై.ఎస్.రాజశేఖర్‌డ్డి’ అని పేరు కూడాపెట్టారు. ఏమైందో ఏమో అది తెరకెక్కలేదు. అయితే ఆ ‘మహా’నాయకుడిపై ఉన్న వీర విధేయతను ‘కె.గం.రాం’ చిత్రంలో అన్యాపదేశంగా చాటుకున్నట్లు స్పష్టంగా కనపడిపోయింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంపై తనకున్న ఏహ్యభావాన్ని సినిమాలో దుష్టపావూతల ద్వారా ప్రకటించుకున్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న ఓ పెద్ద సమస్య అంటూ ‘తెలుగు తల్లి’ పార్టీ పేరుతో ఓ పార్టీని, ప్రకాష్‌రాజ్ పాత్రలో దుష్ట ఉద్యమనాయకుడ్ని చూపిస్తూ తెలంగాణ ఉద్యమం పట్ల తనకున్న వ్యతిరేకతను చాటుకున్నాడు దర్శకుడు. మీడియా కథ ముసుగులో తెలంగాణ ఉద్యమంపై చేసిన దాడి ఎలాంటిదో తెలుసుకోవాలంటే స్థూలంగా చిత్ర కథకు వద్దాం. పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల బాధ్యతతో స్పందించి సత్వరమే బాధితులకు న్యాయం చేసే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి రాంబాబు (పవన్‌కల్యాణ్). అతను మెకానిక్. గంగ (తమన్నా) ఓ చానల్‌లో రిపోర్టర్. రాంబాబు చేస్తున్న సామాజిక సేవతో ముచ్చటపడ్డ ఆమె రాంబాబును తన చానల్‌లో రిపోర్టర్‌గా చేర్పిస్తుంది. ఇదిలావుండగా సీఎం చంద్రశేఖర్‌డ్డి (వై.యస్.ఆర్.ను దృష్టిలో పెట్టుకొని సృష్టించిన పాత్ర) జనరంజకంగా పాలిస్తుంటాడు.
              అయన్ని దింపి తన కొడుకు రానాబాబుపకాష్‌రాజ్)ను సీఎంను చేయాలన్నది ప్రతిపక్ష నేత జవహర్‌నాయుడు (కోట శ్రీనివాసరావు) ఆశయం. ఈ క్రమంలో రానాబాబును ఓ కేసులో ఇరికిస్తాడు రాంబాబు. దీంతో మీడియాపై కక్షగట్టిన రానాబాబు అదే మీడియా సహకారంతో సీఎం అవుతానని చాలెంజ్ చేస్తాడు. రానాబాబు సీఎం కాకుండా రాంబాబు ఎలా నిలువరించాడన్నదే మిగతా చిత్రకథ. అనేక అంశాల చుట్టూ కథ తిరిగినా రానాబాబు-రాంబాబు మధ్య పోరాటమే సినిమా ప్రధానాంశం. ఇక్కడే రానాబాబు పాత్రకు ‘ఉద్యమ’ నేపథ్యాన్ని అంటగట్టి కథను నడిపించాడు పూరీ. రానాబాబు తన రాజకీయ ప్రస్థానం కోసం ‘తెలుగుతల్లి’ అనే ఉద్యమ పార్టీని స్థాపిస్తాడు. తన రాష్ట్రంలో తెలుగు ప్రజలు తప్ప మరాఠీ, బెంగాలీ, మలయాళీలు ఎవరూ ఉండకూడదని, వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువుల్ని బహిష్కరించాలని ప్రసంగాలు చేస్తుంటాడు. తెలుగు ప్రజల్ని పక్క రాష్ట్రాల వారు వచ్చి దోచుకుంటున్నారని విమర్శలు చేస్తుంటాడు. రానాబాబు, జవహర్‌నాయుడు పాత్రలను పూరీ ఏ దృష్టికోణంలో సృష్టించాడో కాస్త జ్ఞానం ఉన్న చిన్నపిల్లాడికైనా తెలిసిపోతుంది. 
        తెలంగాణ ఉద్యమం అని నేరుగా ప్రస్తావించే సాహసం చేయలేకపోయిన పూరీ.. ‘తెలుగు తల్లి పార్టీ, తెలుగు ఉద్యమం అంటూ సినిమా కథలో ఆ అంశాల్ని చొప్పించాడు. ఇక ఇందులో ప్రకాష్‌రాజ్‌ను ప్రశ్నిస్తూ కథానాయకుడు సంధించే డైలాగులు ఎవరి గురించో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. అందులో కొన్ని సంభాషణలివి.. ‘పక్క రాష్ట్రాల తల్లులంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయగీతం పాడే హక్కు ఎక్కడిది’, ‘నిన్ను, నీ బాబుని ఢిల్లీ గెస్ట్‌హౌజ్ నుంచి తీసుకొచ్చి బట్టలూడదీసి కొడితే ఎలా ఉంటుందో రాష్ట్రం అలా ఉందిరా’ అంటూ కథానాయకుడు పలికే సంభాషణల వెనక ఆంతర్యం పసిగట్టడం కష్టంగా అనిపించదు. సామాజిక సందేశం ఉంది కాబట్టే పవన్ ఈ సినిమాకు అంగీకరించారని పూరీ ఓ సందర్భంలో చెప్పారు. 
         అసలు వీరిదృష్టిలో సామాజిక సందేశం అంటే ఏమిటి? కల్పిత పాత్రలు సృష్టించి, ప్రజల ఆకాంక్షల నుంచి ఉద్భవించిన ఓ మహోద్యమాన్ని, ఉద్యమ నాయకుల్ని టార్గెట్ చేయడమేనా? నాలుగు కోట్ల ప్రజల సామూహిక స్వప్నమైన మహత్తర భావనకు వక్రభాష్యాలు చెబుతూ దుష్ట పాత్రల ద్వారా అపహాస్యంచేయడమేనా? సినిమా ముసుగులో కోట్ల మంది ప్రజల మనోభావాల్ని కించపరచడమేనా సామాజిక సందేశమంటే? చక్కటి సాహిత్య అభినివేశం కలిగి, సమాజం పట్ల గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా పరిక్షిశమలో గుర్తింపు వున్న పూరీ ఓ ప్రజా ఉద్యమాన్ని అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం? తనదైన శైలిలో రెండు ఐటమ్‌పాటలు, నాలుగు సెట్‌సాంగ్‌లు, నాలుగు పోరాట దృశ్యాలతో సినిమాను నడిపించిన పూరీ.. ఉద్యమాన్ని అవహేళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సినిమా చూసిన సగటు తెలంగాణవాది మదిలో ఉద్భవించే ప్రశ్నలివి. సిగ్గుచేటైన మరో విషయం ఏమిటంటే.. ‘వీర తెలంగాణ’, ‘పోరు తెలంగాణ’ చిత్రాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మానవీయకోణంలో వెండితెర దృశ్యమానం చేసిన అభ్యుదయ చిత్రాల రూపకర్త ఆర్ నారాయణ మూర్తికి ఈ చిత్రాన్ని అంకితమివ్వడం!

Wednesday 17 October 2012

తెలంగాణ కలాల వెలి..


బ్లాక్‌లిస్టులో నమస్తే తెలంగాణ.. టీన్యూస్, వీ6, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్లు 
ప్రధాని సమావేశం కవరేజికి నిరాకరణ
తెలంగాణ మీడియా కావటమే కారణం
-  జీవ వైవిధ్య సదస్సులో ప్రాంతీయ పక్ష‘వాతం’
-  ప్రాంగణంలోనే బైఠాయించిన జర్నలిస్టులు
-  జాతీయ, అంతర్జాతీయ మీడియా సంఘీభావం
-  పాత్రికేయుల అరెస్టు.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
-  సచివాలయం సీ బ్లాక్ వద్ద జర్నలిస్టుల ధర్నా
-  బలవంతంగా ఈడ్చేసిన పోలీసులు
-  స్టేషన్ వద్దే రాత్రి వరకూ ధర్నా
-   సంఘీభావం తెలిపిన పార్టీల నేతలు
-  ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ప్రదర్శన
         ఘనమైనదిగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశంలో.. పత్రికాస్వామ్యానికిది బ్లాక్‌డే! కలాలు వెలికి గురైన రోజు! పరిపాలన యంత్రాంగం.. చట్టసభలు.. న్యాయ వ్యవస్థ తర్వాత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్న మీడియా వ్యవస్థకు ఘోర అవమానం ఎదురైన రోజు! అందునా ఒక ప్రాంతంపై గుడ్డి వివక్ష ధోరణి.. పైత్యం పరాకాష్టకు చేరుకున్న వైపరీత్యం! సొంత గడ్డపై జరిగిన అంతర్జాతీయ కార్యక్షికమాన్ని కవర్ చేసేందుకు స్థానిక మీడియాకు ప్రాంతీయత కారణంగా ఎదురైన అవాంతరం! ఆ మీడియా తెలంగాణవాదాన్ని వినిపించటమే దోషమైంది! తెలంగాణలోని కష్టాలను అక్షరీకరిస్తుండటం.. ప్రజల కన్నీళ్లను సమాజానికి చూపించటం సర్కారుకు నేరంగా కనిపించింది! నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటేందుకు వెరవని వారి సాహసం ప్రభుత్వాన్ని భయపెట్టింది! ఫలితం.. ప్రధాని పాల్గొన్న జీవ వైవిధ్య సదస్సులో వార్తల సేకరణకు తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరణ! పదహారు రోజులుగా లేనిది కొత్తగా పుట్టుకొచ్చిన అభ్యంతరం! అదేమని అడిగితే అరెస్టులు.. అరెస్టును నిరసిస్తే విరిగిన లాఠీలు! ఇదేం పద్ధతని ప్రశ్నిస్తే.. మాకు సీమాంధ్ర మీడియా చాలనే విధంగా జవాబులు.. సర్కారు శాసించింది.. పోలీసు యంత్రాంగం పాటించింది! ప్రధాని కార్యక్షికమం జరిగే హెచ్‌ఐసీసీలో ప్రవేశానికి జారీ చేసిన పాసుల జాబితాలో నమస్తే తెలంగాణ దినపవూతికతో పాటు.. వీ6, టీ న్యూస్, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టారు. కార్యక్షికమం కవర్ చేయకుండా అడ్డుకున్నారు. ప్రధాని కార్యక్షికమం కోసం మిగతా మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. కానీ.. తెలంగాణ మీడియాగా ప్రజాదరణ పొందిన నమస్తే తెలంగాణ పత్రిక, వీ6, టీ న్యూస్, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్ల ప్రతినిధులకు మాత్రం పాసులు ఇచ్చేది లేదని అధికారులు మొండిచెయ్యి చూపించారు. ప్రత్యేక పాసులు ఉంటే తప్ప తాము ప్రధాని సమావేశం హాలులోకి అనుమతించబోమని సదస్సు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు చూస్తున్న ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులు నిర్వాహకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వృత్తి ధర్మంలో భాగంగానే సమావేశాన్ని కవర్ చేయటానికి వచ్చామని, గడిచిన పదహారు రోజులుగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిర్వాహకులను నిలదీశారు.
           దాంతో వారు డీజీపీ దినేష్‌డ్డి సూచనల మేరకే తాము కొన్ని మీడియా(తెలంగాణ ప్రాంత) సంస్థలకు పాస్‌లు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. విషయం స్పష్టం అవ్వడంతో నిర్వాహకులు, పోలీసుల తీరుకు నిరసనగా నమస్తే తెలంగాణ దినపవూతిక, వీ6, టీ న్యూస్, హెచ్‌ఎంటీవీ, మున్సిఫ్ చానళ్ళకు చెందిన జర్నలిస్టులు జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలోని మీడియా హాల్(నెం.3) ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎన్నడూలేని విధంగా మీడియా ప్రతినిధులు ఆరుబయట నేలపై మౌనంగా కూర్చోవడాన్ని గమనించిన మిగతా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఏం జరిగిందని అరాతీశారు. విషయం తెలుసుకుని, వారు సైతం నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులకు సంఘీభావం తెలియజేశారు. మీడియా హాల్ ముందు పాత్రికేయులు, కెమెరామెన్లు యాభై మందికిపైగా గుమికూడడంతో విధినిర్వహణలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా మీడియా హాలు ముందుకు వచ్చారు. జర్నలిస్టులు నిరసన వ్యక్తంచేస్తున్న విషయాన్ని పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో ఐపీఎస్ స్థాయి అధికారులు వచ్చి విషయం తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని మీడియా సంస్థలకు పాస్‌లు నిరాకరించిన విషయాన్ని సైబరాబాద్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే ప్రధానమంత్రి వచ్చే సమయం ఆసన్నం కావడంతో మీడియా ప్రతినిధుల కదలికలపై పోలీసులు డేగకన్నువేశారు. అంతలో రక్షణశాఖకు చెందిన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి వచ్చిన ప్రధాని.. నేరుగా సభా ప్రాంగణంలోకి వెళ్ళిపోయారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణం నుంచి ప్రధాన మంత్రి వెళ్ళిపోయేంత వరకు మీడియా ప్రతినిధులు తమ నిరసనను కొనసాగించారు. తెలంగాణ మీడియాను బ్లాక్‌లిస్టులో పెట్టారనే విషయం కొద్ది క్షణాల్లోనే బాహ్యవూపపంచానికి తెలియజేయడంతో యావత్ తెలంగాణ మండిపడింది. ప్రభుత్వ చర్యలపై జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్షికమాలు నిర్వహించారు. సీమాంధ్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల చర్యలను తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. దీనికి కారకులైన పోలీసులు వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని, జరిగిన సంఘటనపై సీఎం, డీజీపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు డిమాండ్ చేశారు.
సచివాలయం సీ బ్లాక్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
                  ప్రధాని పర్యటన కవరేజ్‌కు వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట పాత్రికేయులు ధర్నా చేశారు. మీడియాను ప్రభుత్వం కావాలనే రెండుగా విడదీయడంపై మండిపడ్డారు. ధర్నా చేస్తున్న టీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు కొద్దిసేపు పెనుగులాట జరిగింది. జర్నలిస్టులను పోలీసులు తోసేశారు. లాకెళ్లి జీపులో పడేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఫోరం జర్నలిస్టు నాయకులు క్రాంతి, పీవీ శ్రీనివాస్, రమేష్ హజారె, సతీష్, కెమెరామెన్ అసోసియేషన్ ప్రతినిధి ప్రకాష్ తదితరులను అరెస్టు చేశారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ జర్నలిస్టులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులకు ప్రాంతీయభేదాన్ని అంటగట్టి కవరేజీకి తిరస్కరించడం పత్రికా రంగానికి బ్లాక్ డే అని జర్నలిస్టులు అభివర్ణించారు. ప్రభుత్వం సీమాంధ్ర పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నదని తేలిపోయిందని జర్నలిస్టు నేతలు ఆరోపించారు. ఇందుకు సీఎం, డీజీపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మన్మోహన్‌సింగ్ కవరేజీని తిరస్కరించడం చరివూతలోనే తొలిసారన్నారు. ఎమ్జన్సీలో కూడా ఇంత ఘోరం జరగలేదని దుయ్యబట్టారు. పత్రికా హక్కులను కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదని, కానీ రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తమ కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కొన్ని చానళ్లను మాత్రమే కార్యక్షికమానికి అనుమతించడం, మిగిలిన చానళ్లను తిరస్కరించడం ద్వారా రాష్ట్ర చరివూతలో కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వానికి ఓ అరుదైన ఘనత దక్కిందన్నారు. మీడియా రంగాన్ని కూడా విభజించి పాలించాలని చూస్తున్న సీమాంధ్ర పెత్తందార్లకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని జర్నలిస్టు నేతలు మండిపడ్డారు.జర్నలిస్టులకు మద్దతుగా ట్యాంక్ బండ్‌పై కొవ్వొత్తులతో ప్రదర్శన జరిగింది.
నేతల సంఘీభావం
              వివక్షను ప్రశ్నించి అరెస్టయిన తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు పార్టీలకతీతంగా సంఘీభావం వ్యక్తమైంది. వివిధ పార్టీల నేతలు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాల నాయకులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పాత్రికేయుల వృత్తిధర్మాన్ని అడ్డుకున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. పాత్రికేయులకు అనుమతి నిరాకరణ, వారిపై దాడికి నైతిక బాధ్యత వహించి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత జర్నలిస్టులపై వివక్షకు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. రాత్రి పది గంటలకు ధర్నాను విరమిస్తున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం కార్యదర్శి క్రాంతి ప్రకటించారు.

Saturday 13 October 2012

జైబోలోతెలంగాణకు 3 నంది అవార్డులు


     తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో నిర్మించిన జైబోలో తెలంగాణ చిత్రం మూడు ‘నందు’లను గెలుచుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా జైబోలో తెలంగాణ సినిమాకు నంది అవార్డు లభించింది. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. జైబోలో సినిమాలో సూపర్ హిట్ అయిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాటను పాడిన గద్దర్‌కు ఉత్తమ గాయకుడుగా నంది అవార్డు లభించింది. ఈ పాటకు చక్రీ సంగీతం సమకూర్చారు. సినిమా ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు పొడుస్తున్న పొద్దుమీద పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. 

Wednesday 10 October 2012

పల్లెటూరి పిల్లగాడ

పల్లెటూరి పిల్లగాడ
పసులగాచే మొనగాడ
పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో
చాలిచాలని చింపులంగి
సగము ఖాళీ చల్లగాలి
గోనెచింపు కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ
దానికి చిల్లులెన్నో లెక్కపెట్టావా
తాటిజెగ్గలా కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ
చేతికర్రే తోడైపోయిందా
గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద
దొడ్డి కీవే దొరవై పోయావా ఓ పాలబుగ్గల జీతగాడ
దొంగ గొడ్ల నడ్డగించేవా
కాలువై కన్నీరుగార
కండ్లపై రెండు చేతులాడ
వెక్కివెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
ఎవ్వరేమన్నారో చెప్పేవా
పెందలాడ అమ్మనీకు
పెట్టలేదా సద్దికూడు
ఆకలిగొని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
అడవి తిరిగి అలసిపోయావా
ఆకుతేల్లు కందిరీగలు
అడవిలో గల కీటకాదులు
నీకేమైన కాటువేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
నిజము దాచక నాతో చెప్పేవా
మాయదారి ఆవుదూడలు
మాటిమాటికి కంచె దుంకీ
పంటచేలూ పాడు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
పాలికాపు నిన్నే కొట్టాడా
నీకు జీతం నెలకు కుంచం
తాలు వరిపిడి కల్తిగాసం
కొలువగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ
తలుచుకుంటే దుఃఖ మొచ్చిందా
పాఠశాల ముందుచేరి
తోటి బాలుర తొంగి చూసి
ఏటికోయీ వెలవెలబోతావు ఓ పాలబుగ్గల జీతగాడ
వెలుగులేని జీవితమంటావా
జనవరి ఇరువదియారు
ప్రజాతంత్ర నినాదాలు
కోటీశ్వరుల నాటక మంటావా ఓపాలబుగ్గల జీతగాడ
అంతా వొట్టి బూటక మంటావా
కష్టజీవుల కడుపునిండ
కనికరించే ఎర్రజెండ
ఎర్రకోటపై ఎగురాలంటావా ఓ పాలబుగ్గల జీతగాడ
దోపిడీదొరల రాజ్యం పోవాలంటావా
                                                            - సుద్దాల హనుమంతు (1946)
ఉద్యమ కళా సందోహం సుద్దాల హనుమంతు

             సుద్దాల హనుమంతుగారిదొక ఉద్యమ కళా సాంస్కృతిక యుగం. ఆనాటి కాలంలో అతడొక ప్రజా కళా సంప్రదాయాల కేంద్రంగా నిలిచాడు. ఆ రంగంలో అతడే అని కాదు గానీ, అతనిదైన ఒక ముద్రను, అమోఘమైన ప్రభావాన్ని ఆ రంగం మీద అలవోకగా పడేస్తూ వచ్చాడు.1910కి అటు ఇటుగా గల సంవత్సరాల్లో ప్రపంచమంతటా ఆయా రంగాల్లో రాణించి తమతమ ప్రభావాన్ని పడవేసిన బుద్ధి జీవులు, కవులు, రచయితలు, కళాకారులు జన్మించి ఉన్నారు. పాబ్లోనెరుడా, ఫైజ్ అహ్మద్ ఫైజ్, అలీ సర్దార్ జాఫ్రీ మొదలుకొని ఇక్కడి ప్రాంతాలకు చెందిన శ్రీశ్రీ, మఖ్దూం వంటి వారు జన్మించి ఉన్నారు. 
               అదే వరుసలోనన్నట్టుగా మన సుద్దాల హనుమంతు కూడా 1910లో జన్మించడం గమనించదగ్గ విశేషం.పుట్టింది శ్రామిక వర్గంలో. రంగులు, దారాల ఆధారంగా నేత పనులు నేర్చుకునే క్రమంలోనే జీవితపుదారుల్ని ఒకదాని తరువాత ఒకటిగా ఎన్నుకుంటూ వచ్చాడు. రంగుల రాగాలను, మర్మాలను గుర్తెరిగినట్టుగా ప్రపంచమ్మీది దొంగల హంగులను, క్రౌర్యాలను త్వరలోనే పోల్చుకున్నాడు. వృత్తినే పట్టుకుని తిరగాడలేదు కానీ, మనుషుల ప్రవృత్తులను అంచనా వేసుకుంటూ వచ్చాడు. ఆయా తత్వాలను, భావజాలాలను అధ్యయనం చేశాడు. తొలుత ఆర్య సమాజ ఆలోచనలకు, ఉదార భావాలకు ఆకర్షితుడయ్యాడు. వర్ణాంతర వివాహాలను గౌరవించాడు. ఉచ్ఛ నీచాలుండేది వర్ణాల్లో కాదు వ్యక్తుల(కు) బుద్ధుల్లోనేనని తేల్చుకున్నాడు.
               పరతంత్య్రం నుంచి విముక్తి చెందేందుకని పూనిక వహిస్తున్న వీరుల వెంట తన ప్రయాణమనుకున్నాడు.సత్యాక్షిగహోద్యమాలనాటి ఆదర్శాలని గమనించాడు. ఇంకొంచెం ముందు చూపుతో పర పాలకులకన్నా పరమ క్రూరమైనవి రాచరిక వ్యవస్థలని అర్థం చేసుకున్నాడు. నిజాము నవాబులూ, వారి తాబేదార్లూ, జాగీర్‌దార్లూ, దేశముఖ్‌లూ, దొరలను మించిన దౌర్జన్యకారులను, రాక్షసులను మించిన అపర నరమాంసభక్షకులు ఉండరని తీర్మానించుకున్నాడు. దేశకాల పరిస్థితులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాల విహంగవీక్షణం చేశాడు. అందుకు ఆనాటి ఉద్యమకారుల, సామ్యవాదుల సావాసాలు తోడయ్యాయి. కష్టాలకు, క్రౌర్యాలకు కారణాలు తెలిసి వచ్చాయి.
                  కూడికలక్కడ, తీసివేతలిక్కడ ఎందుకో తేటతెల్లమవుతూ వచ్చాయి. రైతులు- భూమిలేని పేదలు గావించబడిన వైనం తెలియవచ్చింది. నిర్బంధాలు, ఆగడాలకు మూల కారణాలేమిటో గోచరించినై. సంఘం కార్యకలాపాలు తోడైనయి. సాహిత్యానికి దగ్గరయ్యాడు. పాటలల్లడం ప్రారంభించాడు. ఉద్యమ కార్యకర్తగా ఎదిగాడు. కళాకారుడిగా గొప్ప నేర్పును సాధించాడు. ప్రజా కవిగా, అగ్రక్షిశేణి గాయకుడిగా అవతరించాడు. చదివింది రెండో తరగతి వరకే అయినా ఆనతి కాలంలో (మనకందినంతవరకు) వందలాదిగా పాటలు రాయడమే కాదు, పద్యాలు అల్లగల శక్తియుక్తులను కూడా సముపార్జించుకున్నాడు సుద్దాల హనుమంతు. ఊహించినట్లుగానే ఉద్యమ యోధుడిగా తనను తాను మలుచుకొని అనే కళారూపాలను ప్రదర్శించాడు. గొల్ల సుద్దులను ప్రత్యేకంగా తీర్చిదిద్ది వాటికి విశేషాదరణను కల్పించాడు. 
                  ‘వీర తెలంగాణ’ యక్షగానాన్ని తనదైన బాణిలో అనితర సాధ్యంగా రూపొందించి ప్రదర్శనలిచ్చాడు. అతని పాటలకు, ప్రదర్శనలకు జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. సుద్దాల హనుమంతు గురించి అతని మిత్రులు, అనుయాయుల మాటల్లో చెప్పుకోవాలంటే ఆనాటి అనేక విషయాలను గూర్చిన అతని అధ్యయనం, అవగాహనలు గొప్పగా ఉండేవి. అవకాశం దొరికినప్పుడల్లా అతడు సమకాలీన పరిస్థితులు, పరిణామాల ను చర్చిస్తూ వచ్చేవాడు. ఆకలి దప్పులకన్నా అతని ఉద్యమ తీరు తెన్నుల మీద ధ్యాసే ఎక్కువగా ఉండేది. అనేక అంశాలనెప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ వచ్చేవాడు గనుక అర్థంవంతమూ, అవగాహనా పూరితమైన పాటల్ని ఎక్కడికి వెళితే అక్కడ పాడుతూ ప్రదర్శనలిస్తూ వచ్చేవాడు. అతని గాత్రం శ్రావ్యంగానూ జనరంజ కంగానూ ఉండేది. 
                    సుద్దాల హనుమంతు పాటలు అధిక శాతం ద్రోహులకు, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా రణభేరి మోగించినవే. ఇక్కడి ఉప్పు తిని, మదమెక్కిన ఆనాటి నిజాం తొత్తు లైన రజాకార్లనే మత పిచ్చివాదుల దారుణాల్ని దనుమాడినవి ఆయన పాటలు. ఊళ్ల నిండా పోలీస్ క్యాంపులను దింపి వేలాదిగా ప్రజలను జైళ్లల్లో నింపి గోళ్లలో సూదులు గుచ్చిన పైశాచికత్వాన్ని ప్రశ్నించినవి. ప్రజల కాళ్లు, చేతుల్ని కట్టి, మంట మండే గడ్డివాముల్లో పడేసిన యమకింకరుల బాధల్ని ఏకరువు పెట్టినవే.
                 ‘నిజామెవడురా? వాడి తొత్తుల లెక్కేందిరా?’ అని ఎదిరించి నిలిచినవే. నిజాం సర్కారు దారుణాలను ఒక్కటొక్కటిగా మక్కపుట్ట గింజలు వొలిచి చూపినట్లుగా చూపినవే. ‘సాధించి తీరుతాం ప్రజా ప్రభుత్వాన్ని’- అని భరోసా ఇచ్చినవే. ధనికుల దౌర్జన్యా లను ఎదిరించి నిలువమని ధైర్య సాహసాలను రంగరించి పోసినవే. శ్రామిక శక్తే అజేయమైనదని, ‘దెబ్బకు దెబ్బ’ వేసి నిలవాలని పిలుపునిచ్చినవే, చరివూతను మలు పు తిప్పినవే సుద్దాల పాటలు.రైతులను రామ బాణాలుగా గుర్తిస్తూ, రాజ్యమన్నది రైతు కోసమేనని వివరిస్తూ, తమ అధికారాన్ని తమ వశం చేసుకొమ్మని హితోపదేశించినవే సుద్దాల పాటలు. వెట్టి చాకిరీని నిర్మూలించాలని ప్రకటించాయి. అమరవీరులకు జోహర్లర్పిస్తూ వచ్చినవి. ‘‘పల్లె ప్రజలకు ప్రజలే దొరలైతే ఎవడిదో దొర తనమేమిట’’ని ఎదిరించి నిలిచేందుకు జాగేమిటని జాగృత పరుస్తూ వచ్చాడు హన్మంతు.
                 ‘ఎన్నాళ్లని సహించేది కష్టకాల’మని హెచ్చరిక చేస్తూ, రామరాజ్యమంటే ‘క్షామంతో అలమటించడమేనా?’ అని నిలదీస్తూ ఉరుమురిమి ఉద్యమించమని పిలుపునిచ్చినవి అతని పాట లు. అడుగడుగునా సాహసాన్ని నూరి పోసినవి. భయం గియం విడిచి, జయం ప్రజలదని తలిచి, ఎదురించుట పరిష్కారమని చెప్పినవి ఆయన పాటలు.జీవితమంతా ఉద్యమబాటై, సాంస్కృతిక కెరటమై ఎగసినవాడే సుద్దాల హనుమంతు. నమ్మిన సిద్ధాంతానికి ఆసాంతం కట్టుబడి ఉన్నాడు. ఎల్లప్పుడూ అతనిలో ని ఎర్ర రక్తకణాలను కాపాడుకుంటూనే తాజాగా ఉంచుకుంటూనే వచ్చాడు. పాటకు విరామం లేకుండా గాయకుడిగా ఇసుమంతైనా అలసిపోకుండా, ఆడుతూ, పాడు తూ అలరిస్తూ, ఆలోచింపచేస్తూ వచ్చాడు. 
                 తెలంగాణ సాయుధ పోరాటం - సుద్దాల హనుమంతు వంటి జీవితాలు వాస్తవానికి వేరువేరు కాదు. తీరాన్ని వొరిసి పారే నీరులాగా తెలంగాణ ఉద్యమపాటై కళా ప్రదర్శనయై జనం మధ్య ప్రవహించిన వాడే సుద్దాల. ఇటు భూస్వాములు, అటు వీరిని తలదన్నే నిజాం ప్రభువుల నరకపు పాలనా యుగాల్ని చీల్చి చెండాడు తూ వచ్చాడతను. దారుణమైన అర్ధబానిస వ్యవస్థను ఎండగడుతూ, వెట్టి చాకిరీని తుదముట్టించేందుకు ప్రజావళిని సమాయత్తం చేశాడు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్థల ఉమ్మడి వేదికగా ‘ఆంధ్ర మహాసభ’ (భువనగిరి)లో వాలంటీరు గా పాల్గొన్నది మొదలు ఇక ఏనాడూ వెనక్కి తగ్గింది లేదు. పోరు మార్గాన్ని విడిచింది లేదు. నిజాంతో ఇక్కడి భూస్వాములు, దేశముఖ్‌లు, జాగీర్‌దార్లు కుమ్మ క్కై ప్రజల మీద దాష్టీకం సాగించిన తీరు తెన్నులను ఏకి పారేశాడు. లక్షలాది మంది ప్రజల తిరుగుబాటుకూ తన వంతు చైతన్యాన్ని అంకితం గావించాడు హనుమంతు. 
                 ‘బాంచన్ దొర కాల్మొక్త’ అన్నటువంటి సగటు తెలంగాణ రైతే గుత్పల తిరుగుబాటుకు లంకించుకునే సాహసానికి అంకురార్పణ గావించిన వాడయ్యాడు. కడగండ్లు , కన్నీళ్లతో వేసారి జీవచ్ఛవాలౌతున్న వారే తరువాతి కాలంలో కళా సాంసృ్కతిక మ హోజ్వల చైతన్యాన్ని సొంతం చేసుకునేట్టుగా ఆత్మవిశ్వాసాన్ని నూరి పోశాడు. ధైర్య సాహసాలకు దీటైన దర్పణాలుగా తన రచనలు ప్రతిబింబింపజేశాడు. బానిసలకన్నా హీనంగా చూడబడుతున్న నిరుపేదలకు ఎర్రెపూరని కొత్త రక్తాన్ని ఎక్కించి తిరుగుబాటుకు బీజాలు వేశాడు. అతని గొంతుతో అత్యద్భుతంగా ప్రజల గొంతు కలిసి పాడింది. ద్రోహులు, క్రూరులను తరిమికొట్టగా కదలాడి ఈ కళాకారుడు చివరి దాకా పెన్నునూ, గన్నునూ పట్టుకున్న యోధుడయ్యాడు. 
        సుద్దాల హనుమంతు కొన్ని పాటలనైనా ఉదహరించబోయినప్పుడు ‘తెలుగు వీరులు బాలచంద్రులై లేవాలి/ మగువలందరు రుద్రమాంబలై కదలాలి’ అంటూ ‘రణభేరి మ్రోగింది’తో పిలుపు ఇస్తాడు. ‘ఈ నిజాం ఎవడురా?’ అనే పాటలో-‘ఐకమత్యమే బలం/ అందినదే ఆయుధం/చేకొని వేగమే నైజాం/నీచుల పరిమార్పురా’’ అని బాహటంగా కర్తవ్యబోధ చేశాడు.ఆ కాలపు లక్ష్యమేమిటో తేట తెల్లం చేస్తూ ‘ప్రజా ప్రభుత్వం సాధిస్తాం’ అనే గేయంతో ‘.. ఎర్రజెండనీడలో/ ప్రజా రాజ్య స్థాపన చేద్దాం’ అని నినదించినాడు. ‘లక్షలాది బీద ప్రజల పక్షముండరెందుకోయి (ఓ ధనికులారా)’ అని ప్రశ్నిస్తూ ‘లుచ్చాలగుట మానరోయ్’ అని హెచ్చరిక చేశాడు. 
                        ‘పొదుపు పేర జరుగుతున్న/ అదుపులేని దుబారా/అదను ఇదేనని మంత్రుల ఆడంబర జీవితాలు’ అంటూ ‘ఇదే రామ రాజ్యమా’ అనే పాటలో ఆనాడే మంత్రుల తీరును ఎండగట్టాడు. ‘దొరలు- భూస్వాములు’ అనే రచనలో అన్నం పెట్టే రైతుల పాలిటి ఆక్రందనలను వినిపిస్తూ ‘బక్కెడ్ల దరుముచు రైతన్నా దున్నే/దుక్కిడిచి పొమ్మనిరి కూలన్న’ అంటూ ఆక్రోశించినాడు. ద్రోహుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ‘అధికారం నేడే మీరిస్తే/అవినీతికి వారొస్తారండీ’ అంటూ ‘జాగరతోయ్ జాగరత’ అనే పాటలతో కుహకుల నైజాన్ని బయటపెట్టాడు. ‘ఎన్నాళ్లీ కష్టకాలం’ అనే పాటలో రైతు క్షేమమే దేశ క్షేమము/ రైతు లేని దేశమే క్షామము/రైతు దేశమునకు వెన్నెముకరా/ రైతు దేశమున కన్నదాతరా’ అంటూ వినవూమంగా రైతన్నకు కైమోడ్పు చేసినాడు. ‘ఆకలి మంటలు’లో అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ ‘నిరు పేదలదే తుది విజయం’ అని ప్రకటించినప్పుడు మనం లక్ష ఏనుగుల బలాన్ని సొంతం చేసుకున్నంత అనుభూతి చెందుతాం.కేన్సరు వంటి ప్రాణహంతక వ్యాధితో తనకు గల బాధను ఆమరణాంతం పంటి కింద అదిమి పట్టినాడే కానీ, ఏనాడూ కలత చెందలేదు. విషయం బయటికి పొక్కనీయలేదు. సానుభూతి వంటి వాటిని ససేమిరా దరి చేరనీయలేదు. 
                    ‘పేదల కోసం మమేకమైన కృషిలోనే తుది శ్వాస విడువగలగడం కూడా ఆదర్శమ’ని నిరూపించా డు. ఆట-పాటలకు, సృజన సౌశీల్యాలకు ఒక చిరునామా అయ్యాడు. కళా సాధకులకు ఎన్నటికీ మరణం లేదని నిరూపించాడు. ఉద్యమమున్న ప్రతి చోటా అతడున్నాడు. ప్రజల మధ్య, ప్రజా స్పందనలతో మమేకమౌతూ, ఎక్కడో ఒక మూలన కూర్చొని, ఆయా కళా ప్రదర్శనలను వీక్షిస్తూ, కళాకారులను ప్రోత్సహించాడు. మంచితో కరచాలనం చేస్తూ, మరొకింత స్ఫూర్తిని కూడా ప్రోది చేస్తూ వచ్చాడు. నేటికీ ఆయన ‘పాలబుగ్గల పసివాడు’గా చప్పట్లు చరుస్తూనే ఉన్నాడు. అమాయకపు గొర్రె పిల్లలను అదిలిస్తూ, ఆప్యాయపూరిత చైతన్యమంత్రం నూరి పోస్తూనే ఉన్నాడు. కనిపించని పిల్లనగ్రోవిని వినిపిస్తూనే ఉన్నాడు. 
-వేణు సంకోజు

Tuesday 9 October 2012

మరో పోరుకు టీ జేఏసీ సన్నద్ధం

* వచ్చే నెల 1న పల్లెపల్లెన   నల్లజెండాలు ఎగురవేయాలి
*  ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఆత్మబలిదానాలు 
* అమరుడు కాకి కుమార్ సంతాప సభలో కోదండరాం 
            తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమానికి రూపకల్పన చేసి, పోరాటానికి సన్నద్ధమవుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగాడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న కాకి కుమార్ ప్రథమ వర్థంతి సందర్భంగా సోమవారం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  కోదండరాం, ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, జేఏసీ తూర్పు డివిజన్ చైర్మన్ చల్మాడ్డి తదితరులు హాజరయ్యారు. కాకి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం మరో పోరాటానికి ప్రణాళికలు రూపొందించేందుకు తెలంగాణవాదులు, జేఏసీ ప్రముఖులతో చర్చిస్తున్నామని తెలిపారు. నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినాన్ని తెలంగాణ జిల్లాల్లోని పల్లెపల్లెలో నిర్వహించి, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని, అదేరోజు తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలతోపాటు  పల్లెపల్లెలో నల్లజెండాలు ఎగురవేయాలని కోరారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్య ధోరణివల్లనే తెలంగాణ ప్రాంతంలో యువకుల ఆత్మబలిదానాలు పెరిగిపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించటంలేదన్నారు. ప్రభుత్వాలు తెలంగాణ విషయం తేల్చకుండా తెగేదాకా లాగుతున్నాయని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని లెక్కచేయకుండా లక్షల మంది తెలంగాణ మార్చ్‌లో పాల్గొన్నారని, కేంద్ర ప్రభుత్వానికి వణుకుపుట్టించారని చెప్పారు. తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాకపోవటంతో నిరాశచెంది కాకి కుమార్ ఆత్మబలిదానం చేసుకున్నాడని, ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణవాదులు మహా ఉద్యమాన్ని నిర్వహించాలని కోరారు.
                        అనంతరం ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న రంగాడ్డి జిల్లాలో వనరులు, భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు దోచుకున్నారని మండిపడ్డారు. ఆంధ్రా పెత్తనం కింద అనేక గ్రామాలు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని భూములు లాక్కున్న ప్రభుత్వం రింగురోడ్లను ఏర్పాటు చేసిందని, భూములు కోల్పోయిన నిర్వాసితులు రింగ్‌రోడ్లు ఎక్కాలంటే పన్ను చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యిమంది వరకు ఆత్మబలిదానం చేసుకున్నా ఈ ప్రభుత్వం కళ్లు తెరవడంలేదని విమర్శించారు. కొన్ని రాజకీయశక్తులు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుతగులుతున్నాయని, తెలంగాణ వ్యతిరేక శక్తులు గ్రామాలకు వస్తే చెప్పులతో సత్కరించాలని పిలుపునిచ్చారు. సకలజనుల సమ్మె జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం రాదని ఆవేదనతో కాకి కుమార్ ఆత్మబలిదానం చేసుకున్నాడన్నారు. యువకుపూవరూ తెలంగాణ కోసం ఆత్మ త్యాగం చేయవద్దని, తెగించి పోరాడాలని సూచించారు. అనంతరం పీడబ్ల్యూవో నాయకురాలు సంధ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. టీ జేఏసీ తూర్పు డివిజన్ చైర్మన్ వెదిరె చల్మారె డ్డి మాట్లాడుతూ.. కాకి కుమార్ ఆకాంక్ష మేరకు నవంబర్ 15న కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. సంతాప సభకు ముందు కుమార్ సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధు సత్యం, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, టీ జేఏసీ నియోజకవర్గం కన్వీనర్ బర్ల జగదీశ్‌యాదవ్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రాంనర్సింహగౌడ్, ఉద్యోగ జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ అశోక్‌కుమార్, టీఎన్‌జీవో కార్యదర్శి వేణు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహ, ఉద్యోగ జేఏసీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నాయకులు అజయ్, సీపీఐ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Saturday 6 October 2012

సదాశివ యాది

sadasivayadi
   నేనప్పుడు అదిలాబాద్‌లో టి.టి.సి. చదువుతున్నాను. 8వ తరగతి నుండే పద్యాలు రాస్తున్న నేను అప్పటికే వివిధ సాహిత్య పత్రికలకు నా పద్యాలు పంపుతుండే వాడిని. వాళ్లు ప్రచురిస్తూ ఉండేవాళ్లు. ఆ మధ్యనే ‘సాహితీ కౌముది’ అనే పత్రికలో నేను అనువదించి పంపిన కబీరు దోహాలు వచ్చాయి. వాటిని ఎప్పటి నుంచో సదాశివ మాస్టారుకు చూపిద్దామని అనుకుంటూ వుండగానే కొన్ని నెలలు గడిచాయి. నా అదృష్టం కొద్ది ఒకనాటి సాయంత్రం నిర్మల్ నుంచి వచ్చిన మడిపల్లి భద్రయ్య గారు ‘‘సదాశివ మాస్టారు దగ్గరికెళ్దాం! పద’’ అంటూ అడక్కుండానే నాదగ్గరికి వచ్చి వరమిచ్చారు. సంతోషంతో, ఒకింత భయంతో వారితో పాటు వెళ్లాను. పత్రికను తీసుకు సాహసం చేయలేకపోయాను. మేం వెళ్లేసరికే అక్కడ కళాక్షిశమం రవీంవూదశర్మ గురూజీ కూడా వున్నారు. సాహిత్యం మీదనో, సంగీతం మీదనో గంభీరమైన చర్చ నడుస్తూ ఉంది. మధ్యలో అంతరాయం కలిగించిన దురదృష్టం మాది. భద్రయ్యగారు నన్ను ఇద్దరికీ పరిచయం చేశారు. నా గురించి అంతకు ముందే విని వుండడం వల్ల మాస్టారు తొందరగానే పోల్చుకున్నారు. అదే వారి మొదటి దర్శనం. ఆ చూపులో ఆత్మీయత, ఆ కళ్లల్లో ప్రేమ, మాటల్లో మానవత్వం. తొలి పరిచయంలోనే మాస్టారు మీద ఎనలేని గౌరవం ఏర్పడింది. తర్వాత దాదాపు రెండు గంటల దాకా వారు ఏవేవో విషయాల మీద విస్తృతంగా మాట్లాడుకున్నారు. 
                  నేనూ, మడిపల్లి భద్రయ్య గారితో పాటే వెళ్లే ప్రయత్నంలో వుండగానే ‘‘అప్పుడప్పుడు కలువు బాబూ!’’ అన్న మాస్టారు పలుకులు వినగానే నా రెండవ దర్శనాన్ని ఖరారు చేసుకున్నాను. ఒక వారం రోజుల తర్వాత అనువాద పద్యాలు వచ్చిన పత్రికను వారి చేతిలో పెట్టాను. అప్పటికీ సాహిత్యంలో ముఖ్యంగా అనువాద పక్రియలో వారి సమగ్ర మూర్తిమత్వాన్ని నేను తెలుసుకోకపోవడం వల్ల నాలో ఎలాంటి గుబులు అప్పుడు కలుగ లేదు. వారు పద్యాలు చదివి చిరునవ్వుతో ఆమోదం తెలపటం నేనేప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. అనువాదం గురించి, పద్యాల గురించి వారు కేవలం నా ఒక్కని కోసమే 60 నిమిషాల కాలాన్ని ఖర్చు చేయడం వారి గొప్పతనమూ, నా అదృష్టమూ. ఆ రోజే సురవరం ప్రతాపడ్డి తనను ‘పద్యాలు రాయటం మానుకొమ్మన్నాడనీ, ఒకవేళ పద్యం రాస్తే ఉత్పల సత్యనారాయణలా, వేముగంటి నరసింహాచార్యలా, బేతవోలు రామవూబహ్మంలా రాయాలని, ఆ రకమైన సాధన చేయాలని’ విలువైన సూచన చేశారు. అది నన్ను నేను నిర్మించుకోవడానికి చాలా దోహదం చేసింది.ఆ తర్వాత ఎన్నోసార్లు ఆయన్ని కలిశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారిప్పుడు లేరు. వారితో గడిపిన ‘యాది’ మాత్రం ఉన్నది. వారిచ్చిన ‘యాది’ కూడా వుంది. వారిచ్చిన సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లటమే వారికి మనమిచ్చే నివాళి.                
                                                                       
- తోకల రాజేశం

Wednesday 3 October 2012

మార్చ్ విజయం!


‘మొదట నిన్ను అసలు పట్టించుకోరు. ఆ తరువాత అవహేళన చేస్తారు. ఆనక నీతో తలపడతారు. అప్పుడు నీదే విజయం’ అన్నాడు మహాత్మా గాంధీ. ఈ సుభాషితం తెలంగాణ ఉద్యమానికి కూడా వర్తిస్తుంది. అందులోనూ ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమానికి వర్తిస్తుంది. హైదరాబాద్ మార్చ్ కార్యక్షికమాన్ని చేపడతామని తెలంగాణ జేఏసీ ఎప్పుడో మూడు నెలల కిందటే ప్రకటించింది. ప్రభుత్వం అసలు పట్టించుకోనేలేదు. తెలంగాణ ఉద్యమకారులు గ్రామ స్థాయిల్లో సన్నాహక కార్యక్షికమాలు మొత్తం పూర్తి చేసుకున్నారు. ప్రజలు ఉద్యమోన్ముఖులై కదులుతున్నారు. ఊరూరా చలో హైదరాబాద్ అంటూ కవాతులు జరిగాయి. ఈ దశలో మార్చ్‌కు అనుమతి లేదు,ఎట్లా వస్తారు అంటూ తృణీకార భావంతో మాట్లాడింది. ఉద్యమాన్ని చులకన చేసింది. ఉద్యమ నాయకులు స్వయంగా వెళ్ళి కోరినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అయినా సరే తెలంగాణ జనం బెదరలేదు. ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోలే దు. నిరసన తెలపడం మా హక్కు అని ఉద్యమకారులు ప్రకటించారు. మా హైదరాబాద్‌లో మేం ప్రదర్శన జరుపుకుంటే అనుమతి నిరాకరించడమేమిటి అని ప్రజలు అవమానంగా భావించారు. దీంతో ప్రభుత్వం ఘర్షణ వైఖరి అవలంబించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు మన ఉనికిని, మన ఆగ్రహాన్ని, మన పోరాటాన్ని కనీసం గుర్తించడానికి నిరాకరించిన ఆవలి పక్షం మన బలాన్ని గుర్తించి ఘర్షణ పడుతున్నదంటే- అది మన బలానికి, ఎదుటి వారి బలహీనతకు నిదర్శనం. మన విజయానికి తొలి సూచిక. ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగిన తరువాత జిల్లాల్లో నిర్బంధకాండ తీవ్రం చేసింది. తెలంగాణవాదులను వేధించడం మొదలు పెట్టింది. దీంతో ఉద్యమకారులు దీన్నొక సవాలుగా తీసుకున్నారు. హైదరాబాద్ మార్చ్‌ను విజయవంతం చేసి తీరుతామని కొన్ని రోజుల నుంచే భారీ ఎత్తున నగరానికి తరలి రావడం మొదలుపెట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం కదులుతున్నారు. దీంతో ప్రభుత్వానికి దగడు పుట్టింది. ఒకవైపు అరెస్టులూ బెదిరింపులు సాగిస్తూనే, మరోవైపు సంప్రదింపులకు దిగింది. చివరకు మార్చ్‌కు అనుమతి ఇస్తున్నామని ఓ మంత్రి ద్వారా ప్రకటించింది. ఉద్యమకారులు ప్రకటించిన విధంగా నెక్లెస్ రోడ్డు కాకుండా మరో చోట అనుమతి ఇస్తామని మొదట సూచించిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు అదే హుస్సేన్ సాగర్ వద్ద మానవ హారానికి అనుమతినిచ్చింది. ఇది ఆంధ్ర పాలకులు దయతలిచి లేదా ప్రజాస్వామిక స్ఫూర్తితో ఇచ్చిన అనుమతి కాదు. తెలంగాణ వాదులు తమ ఆత్మగౌరవంతో దృఢంగా నిలిచి సాధించిన విజయం. మార్చ్ మొదలుకాక ముందే తెలంగాణ వాదులు సాధించిన విజయమిది. 
                  తెలంగాణ ఉద్యమంలో ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమం మొదటిది కాదు, చివరిదీ కాకపోవచ్చు. కానీ మొత్తం తెలంగాణ ఉద్యమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే అభ్యంతరకరంగా ఉన్నది. ముఖ్యమంత్రి మొదలుకొని జిల్లాల్లోని పోలీసుల వరకు వారం రోజులుగా తెలంగాణ ఉద్యమకారులను వెంటబడి వేధిస్తున్నరు. నిజానికి వారు చేసిన నేరం ఏమీ లేదు. మార్చ్ జరగనే లేదు. జనాలు పాల్గొననే లేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. కానీ ఇంకా జరగని మార్చ్‌లో నేరాలకు పాల్పడుతారంటూ అమాయకులను వేధించడం ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుందా? ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని బదనాం చేయడానికి ఎంతకైనా దిగజారుతుందని ఈ మార్చ్ సందర్భంగా మరోసారి వెల్లడైంది.తెలంగాణ ఉద్యమకారులు సెటిలర్స్‌పై దాడులు చేస్తారని సమాచారం అందినట్టు ఒక పోలీసు అధికారి ఆరోపించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలె? తెలంగాణ జిల్లాలలోనే కాదు, హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా సీమాంధ్ర వాసులు చాలా తక్కువ మందే ఉంటారు. స్థానికులకు స్థానబలం ఉంటుంది. ఏదైనా వాడలో తక్కువ మంది ఉన్నా తమ ప్రాంతమనే ధీమా ఉంటుంది. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో సాగుతున్నప్పటికీ ఎక్కడైనా స్థానికేతరులపై దాడులు సాగాయా? మలిదశ తెలంగాణ ఉద్యమం పదేళ్ళకు పైగా సాగుతున్నది. అనేక చోట్ల సీమాంధ్ర ప్రజలు కదలకుండా అవే ఊళ్ళలో, తమ పనులు తాము చేసుకుంటున్నారు తప్ప భయవూభాంతులై వెళ్ళిపోయారా? ఎక్కడి నుంచో వచ్చిన తమను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం తెలంగాణ ప్రజల గొప్పతనమని సెటిలర్స్ స్వయంగా చెబుతున్నారు కదా! ప్రభుత్వం అణచివేతకు పాల్పడాలనుకుంటే, అందుకు సాకులు వెదకడంలో భాగంగా అనేక ఆరోపణలు చేస్తుందనేది తెలిసిందే. కానీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఇంత ఉద్రిక్త తరుణంలో ఇటువంటి బాధ్యతారహిత ఆరోపణలు చేయడం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వం చేసిన ఆరోపణల దుర్భుద్ధి పుట్టి ఎవరైనా ఉద్యమ వ్యతిరేకులు ఇటువంటి చర్యలకు పాల్పడితే రెండు వర్గాల మధ్య అనవసర విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అటువంటి తప్పుడు సమాచారం తమకు అందినా పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలె తప్ప బయటికి వెల్లడించకూడదు. 

              హైదరాబాద్ మార్చ్‌కు ప్రభుత్వం తప్పనిసరై అనుమతి ఇచ్చిందే తప్ప, ఉద్యమకారుల పట్ల ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేదు. కొద్ది రోజులుగా ప్రభుత్వ వ్యవహార సరళి తెలంగాణ వారి మనసును తీవ్రంగా గాయపరిచింది. శాంతియుతంగా చేపట్టే ప్రతి ఉద్యమాన్ని ఆటంక పరుస్తున్నది. రెచ్చగొడుతున్నది. ఉద్యమకారుల గుండెల్లో మంట ఉన్నది. కానీ,వారి కళ్లల్లో తడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంగతి కేంద్రం తేలుస్తుందని ముఖ్యమంత్రి పదేపదే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కొంత జాప్యం జరిగితే జరగవచ్చు. కానీ ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఆధిపత్య వర్గాల కొమ్ముకాస్తూ తెలంగాణ వాదులను వేధించడం మాత్రం సమంజసంగా లేదు. ఉద్యమకారులను అదే పనిగా రెచ్చగొట్టడం వల్ల ఒక్కోసారి పరిస్థితులు అదుపు తప్పవచ్చు. గతంలో మిలియన్ మార్చ్ నాటి మాదిరిగా ఉద్యమ నాయకులను అరెస్టు చేసి, ఉద్యమకారులను రెచ్చగొట్టకుండా ప్రభుత్వం సహనంతో వ్యవహరించాలె.