Sunday 22 May 2016

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

రుకుల పరుగుల జీవితంలో పడి మనిషి తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆకలి తీర్చుకునేందుకు ఏదో ఒకటి తినడం.. సమయానికి నిద్రపోకపోవడం.. మానసిక ప్రశాంతత కోల్పోయి రోగాలు కొనితెచ్చుకోవడం ప్రస్తుతం సాధారమైంది. ఈ నేపథ్యంలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలులాంటి చిరుధాన్యాలు తీసుకోవడంవల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, ఉబకాయం, గుండెపోటులాంటివి దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జొన్నలు
గుండె జబ్బులను అడ్డుకునే శక్తి జొన్నలకు ఉందని వైద్య పరిశోధనల్లో తేలింది. ఇందులో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు, పీచు పదార్థంలాంటి పోషకాలు ఉంటాయి. 349 కేలరీల శక్తి, 10.4 గ్రాముల మాంసకృతులు, 1.6 గ్రాముల పీచు పదార్థం, 0.37 మిల్లీ గ్రాముల రబోప్లెవిన్, 3.1 మిల్లీగ్రాముల నయాసిన్, 25 మిల్లీ గ్రాముల కాల్షియం, 4.1 మిల్లీ గ్రాముల ఐరన్, 1.6 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.
సజ్జలు
వేసవిలో సబ్జా నీరు తాగితే శరీరానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకూ దోహదపడుతుంది. దాహం తీర్చడంతో పాటు ఎండలో శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూస్తుంది. బరువు తగ్గేందుకూ సహకరిస్తుంది. అంతేగాక వాంతులు, అజీర్తిని తొలగించేందుకు, హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా అడ్డుకునేందుకు, గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం నివారణకు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. 67.5 గ్రాముల పిండి పదార్థాలు, 11.6గ్రాముల మాంసకృతులు, 5గ్రాముల కొవ్వుపదార్థాలు, 8 మీల్లీ గ్రాముల ఇనుము, 42 మిల్లీ గ్రాముల కాల్షియం, 296 మిల్లీ గ్రాముల పాస్పరస్, 296 మిల్లా గ్రాముల థయామిన్, 0.25 మిల్లీ గ్రాముల రైబోప్లేవిన్, 2.3 మిల్లీ గ్రాముల నయాసిన్ ఉంటాయి.
కొర్రలు..
కొర్రలు చిన్నారులు, గర్భిణులకు మంచి బలవర్ధకమైన ఆహారం. ఉబకాయంతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 60.9 గ్రాముల పిండి పదార్థాలు, 12.3 గ్రాముల మాంసకృత్తులు, 4.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 2.8 మిల్లీ గ్రాముల ఇనుము, 0.59 మిల్లీ గ్రాముల థయామిన్, 3.2 మిల్లీ గ్రాముల నయాసిన్, 31 మిల్లీ గ్రాముల కాల్షియం, 473 కేలరీల శక్తి ఉంటుంది.
సామలు
సామల్లో 7.7 గ్రాముల ప్రోటీన్లు, 5.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 7.6 గ్రాముల ఫైబర్, 1.5 గ్రాముల మినరల్స్, 9.3 మిల్లీ గ్రాముల ఇనుము, 17 మిల్లీగ్రాముల కాల్షియం, 207 కేలరీల శక్తి ఉంటుంది.
రాగులు..
చిరుధాన్యాలలో రారాజు రాగులు. వీటిని తైదలు అని కూడా అంటారు. చిన్నారులకు రాగులతో కూడిన ఆహారాన్ని అందిస్తే పెరుగుదల అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. బియ్యం, గోధుమలకంటే రాగుల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. బీ కాంప్లెక్స్ అధికంగా ఉండి, చౌకధరల్లో లభిస్తాయి. రాగులను చాలా రకాలుగా వాడాతారు. అందులో అంబలి, సంకటి, చపాతీ, పూరిలాంటివి చేసుకొని తింటారు. 100 గ్రాముల రాగులలో పోషకాలు, 72 గ్రాముల పిండి పదార్థాలు, 7.3 గ్రాముల మాంసకృతులు, 3.9 గ్రాముల ఇనుము, 344 మిల్లీ గ్రాముల కాల్షియమ్, 283 మిల్లీ గ్రాముల ఫాస్పరస్, 0.42 మిల్లీ గ్రాముల థయామిన్, 0.19 మిల్లీ గ్రాముల రైబోప్లేవిన్, 1.1 మిల్లీగ్రాముల నయాసిన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
అరికెలు
అరికెల్లో 8.3 గ్రాముల ప్రోటీన్లు, 3.6 గ్రాముల కొవ్వు పదార్థాలు, 9 గ్రాముల ఫైబర్, 2.6 గ్రాముల మినరల్స్, 05 మిల్లీ గ్రాముల ఇనుము, 27 మిల్లీ గ్రాముల కాల్సియం, 309 కేలరీల శక్తి ఉంటుంది.