Wednesday 26 December 2012

కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం

* కోటను ముంచిన కులపోరు
* రెడ్డి-వెలమల ఆధిపత్యపోరు
* రెడ్డి సామంత రాజులు యుద్ధానికి దూరం

               కులాధిపత్య పోరు! నేటి రాజకీయాల్లో సర్వసాధారణమైన ఈ జాడ్యమే.. అలనాడు కాకతీయ సామ్రాజ్య పతనానికీ కారణమైందన్న సంగతి చాలా మందికి తెలియదు. స్వామిద్రోహం, నయవంచన.. కలగలిసి రెండు వందల సంవత్సరాల చరిత్ర పరిసమాప్తికి దారితీశాయన్న సంగతీ తెలియదు. గణపతి దేవుడి పాలనలో తమకు లభించిన ప్రాధాన్యం.. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో దక్కకపోవడంపైరెడ్డి కులానికి చెందిన సామంత రాజులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 
                తమకు ప్రాధాన్యం లేకపోవడమే కాక.. సైన్యంలో పద్మనాయకుల (వెలమల)కే ప్రాధాన్యం ఉండడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ సేనలు ఓరుగల్లుపై దండెత్తి వచ్చినప్పుడు రెడ్డి సామంత రాజులు ఈ కారణంతోనే సహాయ నిరాకరణ చేశారు. దీనికితోడు.. కాకతీయ సేనలను న్యాయబద్ధంగా ఎదిరించడం అసాధ్యమని తెలుసుకున్న మహ్మద్ బిన్ తుగ్లక్ రెడ్లు, వెలమల నడుమ వైరాన్ని పావుగా వాడుకున్నాడు. కాకతీయ సైన్యంలోని తేరాల బుచ్చారెడ్డి అనే కమాండర్‌కు 18 లక్షల బంగారు నాణేలు ఇస్తానని ఆశ చూపాడు. అందులో సగం ముందే ఇచ్చాడు. 
                     ఆ సొమ్ము తీసుకున్న బుచ్చారెడ్డి అతని మిత్ర సామంతులు.. సుల్తాన్‌తో యుద్ధంలో తామే ముందుండి పోరాడతామని ప్రతాపరుద్రుణ్ని నమ్మించారు. వారిని నమ్మిన ప్రతాపరుద్రుడు యుద్ధరంగాన ఘోరంగా మోసపోయాడు. పోరు కీలక దశలో ఉన్నప్పుడు.. బుచ్చారెడ్డి తన సైన్యాన్ని యుద్ధరంగానికి దూరంగా తరలించాడు. మరికొందరు రెడ్డి సామంతరాజులు కూడా బుచ్చారెడ్డిని అనుసరించారు. బొబ్బారెడ్డి అనే సామంత రాజు ప్రతాపరుద్రుడి పక్షాన యుద్ధరంగానికి వచ్చినప్పటికీ తన బలగాలను దూరంగా మోహరించాడు. యుద్ధరంగంలో 'తన' అనుకున్న వాళ్ల నుంచే జరుగుతున్న వం చన గురించి ఆలస్యంగా తెలుసుకున్న ప్రతాపరుద్రుడు.. స్వయంగా గజారూఢుడై యుద్ధరంగంలోకి దిగాడు. 
                ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న తుగ్లక్ ఆయనవైపునకు పెద్ద ఎత్తున బలగాలను నడిపించాడు. ప్రతాపరుద్రుడి బలగాలను హతమార్చి ఆయన్ను బందీగా పట్టుకున్నాడు. సమీపంలోనే తన బలగంతో మాటువేసి ఉన్న బొబ్బారెడ్డి.. ఆ సమయంలో తన బలపరాక్రమాలు ప్రదర్శించి రాజు మెప్పు పొందాలనుకున్నాడుగానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇక, ప్రతాపరుద్రుడి సైన్యంలోనే అత్యంత కీలకస్థానంలో ఉన్న పద్మనాయక (వెలమ) సేనాని గన్నయ.. బందీగా ఢిల్లీ చేరాక ఇస్లాం స్వీకరించి మాలిక్ మఖ్‌బూల్‌గా పేరు మార్చుకొన్నాడు. తన కుయుక్తులతో ఏకంగా ఢిల్లీకి వజీరు కాగలిగాడు. అనంతరకాలంలో.. కాకతీయులు పాలించిన ప్రాంతానికి ఇతణ్ని రాజుగా నియమిస్తే ఈ ప్రాంత పద్మనాయకులు తరిమితరిమికొట్టారు. దీంతో మాలిక్ మఖ్‌బూల్ ఢిల్లీకి పరారయ్యాడు.

విశ్వసనీయతే కాకతీయుల విశిష్టత
అధికారం కోసం పాకులాడలేదు
శాసనాల ప్రకారం వారిది విస్తి వంశం
కులం, మతంపైనా భిన్న వాదనలు
రాయగజకేసరి శిల్పాల్లో రుద్రమదేవి రూపం
80వ ఏట వీర మరణం
                                 - చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మాశాస్త్రి

హైదరాబాద్: ప్రజా క్షేమం, సమాజాభివృద్ధే ధ్యేయంగా సాగిన కాకతీయుల పరిపాలన ఘనకీర్తి పొందింది. రెండు వందల ఏళ్ల స్వర్ణయుగానికి సాక్ష్యంగా అనేక శాసనాలు, చెరువులు, వ్యవస్థలు ఇప్పటికీ కంటిముందే నిలుస్తున్నాయి. సంగీత, సాహిత్య, శిల్పకళల్లో కాకతీయులు చేసిన కృషి ఆంధ్ర దేశానికే వన్నె తెచ్చింది. కాకతీయుల చరిత్రపై విశేష అధ్యయనం చేసిన చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'ఆంధ్రజ్యోతి'కి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కళ్యాణి చాళుక్యుల నుంచి రాజ్యం పొందిన కాకతీ రాజులపై ఓ అపవాదు ప్రచారంలో ఉంది. 
        చాళుక్యులపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారని చరిత్రకారులు సమర్థిస్తూ వచ్చారు. కానీ శాసనాల ఆధారంగా చూస్తే కళ్యాణి చాళుక్యులపై కాకతీయులు తిరుగుబాటు చేసినట్లు ఎక్కడా కనబడదు. కళ్యాణి చాళుక్యులు రాజ్యం కోల్పోయిన తర్వాత కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో తలదాచుకున్నారు. వారు తిరిగి వస్తే వారికి రాజ్యం అప్పజెప్పటానికి కూడా కాకతీయులు చాలాకాలం ఎదురుచూశారు. ఇక కళ్యాణి చాళుక్యులు తిరిగి వచ్చే అవకాశం లేదని తేలిన తర్వాతే 1158లో రుద్రుడు తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. అధికారం కోసం కాకుండా విశ్వసనీయతతో మెలగడం కాకతీయుల విశిష్టత. 
            నిజానికి కాకతీయులు విస్తి వంశీయులు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయం ద్వారా వచ్చిన మొత్తాన్ని కర్ణాటక రాజులకు అందించే వారినే 'విస్తి'లు అనేవారు. అందుకే కాకతీయుల శాసనాలలో తాము విస్తి వంశీయులమని, చతుర్థ వంశీయులమని పేర్కొన్నారు. అందుకే కాకతీయుల తొలి శాసనాలు కన్నడ భాషలో ఉన్నాయి. క్రమంగా వీరు రాష్ట్రకూట రాజుల దగ్గర సేనానులుగా మారారు. ఇక వీరి మతానికి సంబంధించి కూడా అనేక అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కాని కొన్ని ఆధారాల ప్రకారం వీరిని జైనులుగా కూడా భావిస్తున్నారు. 
             'కాకండి' అనే జైన దేవత పేరు మీద వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందన్న వాదన ఉంది. దీనితో పాటుగా వీరు కర్ణాటకలో 'కాకతీ' అనే గ్రామానికి చెందిన వారనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక కాకతీయుల కాలంలో కర్ణాటకలో రెడ్డి కాపులు ఉండేవారు. తొలి కాకతీయులు ఏ కులం వారో చెప్పడానికి ఇప్పటివరకు చరిత్రకారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక రుద్రమదేవి తప్పితే కాకతీయరాజులెవరూ తమ విగ్రహాలను చెక్కించుకోలేదు. శాసనాల ఆధారంగానే రుద్రమ దేవి రూపాన్ని అధ్యయనకారులు తెలుసుకోగలిగారు. రుద్రమదేవికి రాయగజకేసరి అనే బిరుదు ఉంది. 

               ఏనుగుల్లాంటి శత్రువులను జయించిన సింహాల వంటి రాజు అని దాని అర్థం. వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయంలో 'రాయగజకేసరి' పేరిట కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలలో ఒక ఏనుగు, దానిపై ఒక సింహం, దానిపై ఒక యువతి కూర్చుని ఉంటుంది. యాదవ రాజును జయించిన తర్వాత రుద్రమదేవి ఈ శిల్పాలను చెక్కించింది. ఈ శిల్పంపై ఉన్నది రుద్రమదేవే! అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర పురావస్తుశాఖ వద్ద ఈ తరహా శిల్పాలు నాలుగైదు ఉన్నాయి. వాటిపై పరిశోధన చేస్తే రుద్రమదేవి రూపాన్ని అంచనా వేసే అవకాశాలున్నాయి. త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. 
               ఆ సమయానికి ఆమెకు దాదాపు 80 ఏళ్లు. ఆమెను యుద్ధానికి మల్లికార్జునుడు అనే సేనాని తీసుకువెళ్లాడు. అంబదేవుడి దాడిలో సేనాని కూడా చనిపోయాడు. ఇది 1289లో జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 11వ రోజున మల్లికార్జునుడి కుమారుడు చెందుబట్ల శాసనం వేయించాడు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో ఆ శాసనంలో స్పష్టంగా ఉంది. ఇక ప్రతాపరుద్రుడిది ఆత్మహత్య అనటానికి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహ్మదీయ సేనల చేతిలో బందీకావటం ఇష్టం లేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనితల్లిరెడ్డి వేయించిన శాసనం చెబుతోంది. ఈ శాసనంలో 'స్వేచ్ఛఐవ' అని ఉంటుంది. అంటే ఆత్మహుతి చేసుకున్నాడని అర్థం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజులకు ఆం«ద్రుల చరిత్రలో దక్కాల్సినంత స్థానం దక్కలేదన్న వాదన చరిత్రకారుల్లో వినిపిస్తోంది.                                                                                                                                                                      - ఆంధ్రజ్యోతి
  
                                                                                                                                                                              

Friday 21 December 2012

కాకతీయ వైభవం..


                                    
 ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం విశిష్టమైంది. అందుకు కారణం వారు అనుసరించిన ఉదార విధానాలు, చేసిన కళాసేవ. 
                                                              - ఆచార్య పోలవరపు హైమవతి
               అసలు కాకతీయులు అనగానే గభాలున గుర్తొచ్చేది వారి నీటి పారుదల విధానం. ఆలయాల నిర్మాణం కంటే చెరువుల నిర్మాణంపైనే వారు ఎక్కువ ఖర్చు చేశారు. దీక్షతో నిర్వహించారు. జలసాధన సంతోషాన్ని శిల్పం ద్వారా ప్రకటించి, ఆ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. వారు నిర్మించిన తటాకాలు నేటికీ వేలాది ఎకరాల సాగుకు ఉపయోగ పడుతున్నాయి. వారి నిర్మాణాలు ముఖ్యంగా ఆలయాలు, అందులోని శిల్పకళా ఖండాలు వారి ఉన్నతాభిరుచిని, నాటి కళాకారుల నైపుణ్యాన్ని, భావ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్తున్నాయి. వారి స్మృతి చిహ్నాలుగా మిగిలిన వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
             కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా సుమారు క్రీ.శ.1000 నుండి 1157 వరకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగాను 1158 నుండి 1323 వరకు స్వతంత్రులుగాను పాలించారు. శాసనాధారాలను బట్టి కాకర్త్య గుండ్యన ఈ వంశ మూల పురుషుడు. ‘కాకతీయ’ అనే పదానికి సంస్కృతీకరణమే ‘కాకర్త్య’.
      కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారిత్రక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సాంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది. 
            జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే ‘జయింప శక్యం కాని వారు’ అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది.
    కాకతీయ వంశానికి సంబంధించి లభ్యమైన శాసనాల్లో మొట్టమొదటిది క్రీ.శ. 956 నాటి మాగల్లు శాసనం. ఈ శాసనాన్ని బట్టి గుండియ రాష్ట్రకూటుడు కాకతీయుల మూల పురుషుడు. గణపతిదేవుని సోదరి మైలమ (ధర్మకీర్తి) తన తల్లి బయ్యలదేవి పుణ్యం కోసం చెరువు తవ్వించి బయ్యవరం గ్రామాన్ని సకల సదుపాయాలతో నిర్మించి శాసనం చేయించింది. దాని ప్రకారం తొలి కాకతీయుల వంశవృక్షం ఇలా ఉంది. దుర్జయ వంశంలో- వెన్ననృపుడు - గుండయ(1)-గుండయ(2)-గుండయ(3)- ఎరియ లేదా ఎర్రనృపుడు- (పిండి) గుండయ(4)-బేత(1)పోల(1)-బేత(2)పోల(2)-రుద్రదేవుడు-గణపతిదేవుడు అనేవారు జన్మించారు.
       క్రీ.శ.973లో రాష్ట్రకూటుల అధికారం పతనమయ్యేవరకు వారికి విధేయుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతం చాలా వరకు పశ్చిమ చాళుక్యుల వశమైంది. ఈ పరిస్థితుల్లో గుండయ పశ్చిమ చాళుక్యుల వైపుగాని తూర్పు చాళుక్యుల వైపుకాని చేరకుండా తటస్థంగా ఉన్నాడు. ఇంతలో ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరవిసీమను ఆక్రమించుకున్నారు. ఆ ఘర్షణలలో గుండయ ముదిగొండ చాళుక్యుల చేతిలో హతమయ్యాడు. అతని సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతనను దగ్గరకు తీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరవిసీమ నుండి హన్మకొండ వరకు కాకతీయాధికారాన్ని నిలిపింది. ఈ విధంగా కాకతీయ యుగంలో స్త్రీల సాధికారతకు బీజం వేసింది కామసానమ్మ. ఆమె భర్త విరియాల ఎర్రభూపతి గొప్ప సేనానాయకుడు.
           కాకతీయ బేతరాజు మొదట వేల్పుకొండ (జఫర్‌గడ్) కేంద్రంగాను, హన్మకొండ వరకు అధికారం విస్తరించిన తర్వాత హన్మకొండ రాజధానిగాను క్రీ.శ.1052 వరకు పాలించాడు. తర్వాత అతని కుమారుడు ప్రోలరాజు క్రీ.శ. 1052 నుండి 1076 వరకు పాలించాడు. తర్వాత రెండో బేతరాజు క్రీ.శ. 1076 నుండి 1108వ సంవత్సరం వరకు పాలించాడు.
       ఇతని కొడుకు దుర్గరాజు క్రీ.శ.1108 నుండి 1117 వరకు పాలించాడు. ఆ తర్వాత ఏ కారణం వల్లో దుర్గరాజును త్రోసిరాజని రెండో ప్రోలరాజు అధికారంలోకి వచ్చాడు. ఈతడే స్వయంభూ ఆలయాన్ని ఏకశిలా నగరంలో మొదటగా నిర్మించాడు. ఏకశిలానగర (కోట నగరం) నిర్మాణానికి దీంతో బీజం పడినట్లైయింది.
రెండో ప్రోలరాజు క్రీ.శ.1117 నుండి 1157 వరకు పాలించాడు. ఈయన గొప్ప వీరుడు. తన ప్రభువైన చాళుక్య రెండో జగదేకమల్లుని అధికారం నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతమంతటా విస్తరింపజేసి అది సుస్థిరమయ్యేందుకు తీవ్ర కృషి చేశాడు. అనేక బావులను, చెరువులను, పంటకాలువలను తవ్వించి ‘దారిద్ర్య  విద్రావణ’ అనే బిరుదును పొందాడు. ‘దరిద్ర్యాన్ని నీరుగార్చి పారదోలిన వాడని’ దీని అర్థం.

స్వతంత్ర పాలకులుగా కాకతీయులు నకీ.శ.1158-1323):

         రెండో ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ. 1158-1195 సంవత్సరాల మధ్యకాలంలో కాకతీయ రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ. 1163 నాటి వేయిస్తంభాల గుడి శాసనం ఇతని విజయాల గురించి వివరిస్తున్నది. కర్ణాటకంలో బిజ్జులుని విజృంభణతో ఆంధ్రదేశంలో తానూ స్వతంవూతించి రాజ్యపు ఎల్లల్ని విస్తరింపజేశాడు. ఇంతవరకు కాకతీయులు తెలంగాణంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాల్లో చేసిన కృషివల్ల వ్యవసాయం మీద ఆధారపడి నడిచిన పరిక్షిశమలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తుల్ని సాధించాయి. వాటికి అంతర్జాతీయంగా గిరాకీ సాధించాలంటే ఓడరేవు పట్టణాలు కావాలి. అందుకోసం సాగరసీమను జయించాలనుకున్నాడు. పల్నాటి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నపుడు నాయకురాలు నాగమ్మకు సైనిక సాయం అందించి బాగా లాభం పొందాడు. అపర కురుక్షేత్ర సంగ్రామంగా పేరు పొందిన పల్నాటి యుద్ధంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా దిగువ నల్గొండ జిల్లా ప్రాంతాల్లో దిగజారిన పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని ఆయా ప్రాంతాలపై కాకతీయాధికారాన్ని స్థాపించాడు. గోదావరీ తీరంపై దాడికి వెళ్లక ముందే సబ్బిసాయిర మండలం (కరీంనగర్) పైకి దేవగిరి పాలకుడు జైతుగి దండెత్తి వచ్చాడని తెలిసి హుటాహుటిన కొంత సైన్యంతో తిరిగి వచ్చాడు. కాని, దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో (1195) లో మరణించాడు.
       ఈయన అరివీర భయంకరుడై తాను రాజ్యానికి రాగానే తిరుగుబాటు చేసిన వారిని కఠినంగా శిక్షించి తెలంగాణం నుండి సాగరసీమలో పశ్చిమ ప్రాంతమంతా తన అధికారాన్ని నెలకొల్పగల్గాడు. సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయ నిర్మాత ఈయనే. అంతేకాదు. తండ్రి తలపెట్టిన కొత్త రాజధాని ప్రణాళిక ప్రకారం అనేక నిర్మాణాలను చేశాడు.
రుద్రదేవునికి సంతానం లేకపోవడం వల్ల తమ్ముడు మహాదేవుని కుమారుడు గణపతిదేవుని దత్తత తీసుకున్నాడు. ఈయన మరణం అనుకోకుండా యుద్ధరంగంలో జరగటం వల్ల మహాదేవుడు క్రీ.శ 1195లో అధికార బాధ్యతలు చేపట్టాడు. రుద్రుని మరణానికి కారణమైన జైత్రపాలునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మహాదేవుడు యాదవ రాజ్యంపై దండెత్తి యుద్ధరంగంలో మరణించాడు. గణపతిదేవుడు యాదవులకు బందీగా చిక్కాడు. ఏ కారణం చేతనో యాదవులు 11 నెలల అనంతరం గణపతిదేవుని చెరనుండి వదిలివేశారు. కాకతీయ రాజ్యంలో రాజు లేకపోయినా సామంతులు, సేనా నాయకులు, మంత్రులు ఒక్క అంగుళం భూభాగం కూడా పోగొట్టకుండా రాజ్యాన్ని కాపాడారు. బహుశా గణపతిదేవునికి యాదవ రాకుమ్తాతో వివాహ ప్రతిపాదనకు అంగీకరించి విడుదల చేయించి ఉంటారు. ఈ వివాహం గురించిన ప్రస్తావన ప్రతాప చరివూతలోను, చింతలూరు శాసనం లోనూ ఉంది.
         ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ ప్రభువులందరిలో గొప్పవాడుగా ఎన్నదగినవాడు గణపతిదేవుడు. గొప్ప ఉదార పాలకుడు. అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలనా పద్ధతులను తీర్చిదిద్దాలనీ, మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని, జానపద, గిరిజన కళలను, సంస్కృతులను ప్రోత్సహించి పండిత పామరవర్గాల మధ్య దూరాన్ని తగ్గించాలని ఇలా ఎన్నో రకాలుగా కృషి చేసి గొప్ప పాలకుడిగా చరివూతలో నిలిచిపోయాడు. ఈయన క్రీ.శ. 1199 నుండి 1259 వరకు అంటే తన పాలనాకాలానికి షష్టిపూర్తి అయ్యేంత వరకు పాలించాడు. తర్వాత రుద్రమదేవికి సలహాదారుగా 1269 వరకూ రాజ్య వ్యవహారాలు చూశాడు.
    తన పెదతండ్రి ఆశయమైన అఖిలాంవూధావని స్థాపనను సాధించాలని తన సైన్యాలను బెజవాడవైపు నడిపించి వెలనాటి పృధ్వీశ్వరుణ్ణి ఓడించాడు. దివిసీమ వైపు నడచి అక్కడ అయ్యపు పినచోడుని ఓడించి అతని కుమ్తాలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి, వారి సోదరుడైన జాయపసేనానిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ రాణులకు కల్గిన సంతానమే ఈ తర్వాత ధరణికోటను పాలించిన గణపాంబ, అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన రుద్రమ. ఆ తర్వాత ఆయన తన సైనిక విజయాలతో ఉత్తరాన బస్తర్ జిల్లా నుండి దక్షిణాన కంచి వరకు, తూర్పున సముద్రం నుండి పశ్చిమాన దాదాపు ఔరంగబాద్ వరకు, ఈశాన్యాన గంజాం జిల్లా వరకు గల తెలుగు వారి అధికారాన్ని నెల కొల్పాడు. రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చింది ఈయనే.
     తిక్కసిద్ధి గణపతిదేవుని సాయం కోరటానికి వచ్చి ముందుగా వెలనాటి యుద్ధంలో గణపతిదేవునికి సాయం చేశాడు. అంతేకాదు, తుదివరకు ఎన్ని సమస్యలు వచ్చినా నెల్లూరు వారికి బాసటగా నిలవటమేకాక అఖిలాంవూధావనిని ఏకచ్ఛవూతాధిపత్యం కిందికి తెచ్చినా శరణు వేడిన నెల్లూరు రాజ్యాన్ని మాత్రం ఆక్రమించలేదు. ఆ తరువాత గోదావరీ పరీవాహక వూపాంతాన్ని కాకతీయ రాజ్యంలో కలపటానికి సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం ఉదయగిరి, గంజాం, బస్తరు, చక్ర కూటం, మంథెన, కాడి, గోగులనాడు, కొలను, మాడియం, ద్రాక్షారామం మొదలైన ప్రాంతాలను కాకతీయ రాజ్యంలో కలపటంలో విజయాన్ని సాధించింది. గోదావరీ తీర ప్రాంతంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమను చాళుక్య యువరాజు వీరభద్రునికిచ్చి వివాహం చేశాడు.
       క్రీ.శ.1248లో తిక్కభూపతి మరణించాడు. మళ్లీ జాతుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. గణపతిదేవుడు ఈసారి కూడా నెల్లూరును ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి తిక్కన సోమయాజి రెండో మనుమసిద్ధి తరుఫున ఓరుగల్లుకు మారువేషంలో వచ్చి గణపతి దేవుని దర్శనభాగ్యం పొంది సమస్యను వివరించాడు. గణపతిదేవుడు రెండో మనుమసిద్ధికి సాయం చేయటానికి సబ్బి మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) పాలించే సామంత భోజుని నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు.
గణపతి దేవుడు దేవగిరి సేనలతో కూడా సత్సంబంధాలను కొనసాగించాడు. ఆయన పాలనా కాలంలో దేవగిరి నుండి ఒక్క దండయాత్ర కూడా రాలేదు. పైగా ఆయన చేసిన యుద్ధాలలో వారి సైన్యం, సైనికాధికారులు పాల్గొని గణపతిదేవుని విజయానికి కృషి చేశారు. 
     గణపతి దేవుడు తన సుదీర్ఘ పాలనా కాలంలో అనేక ఘన విజయాలను సాధించాడు. ఇంతవరకు ఓటమిని చవిచూడలేదు. అందుకు కారణం వినవూమతతో కూడిన ఆయన వ్యక్తిత్వం, ధర్మచింతనతో కూడిన ఆయన కార్యాచరణ ప్రణాళిక. వాటివల్లనే ఆయన తన అనుచరుల సహాయ సహకారాలను పూర్తిగా పొందాడు. కాని చివరి దశలో తాను నమ్మిన దేవగిరి పాలకుల ద్రోహచింత వల్లను, దుర్నీతిని పాటించిన పాండ్యుల కుటిలతంత్రం వల్లను 1262లో ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఓడిపోయింది.
          అప్పటికే అంటే క్రీ.శ.1259లో రుద్రమను పట్టోధృతిగా ప్రకటించడం ఇష్టం లేని యాదవ సైన్యం హృదయ పూర్వకంగా కాకతీయుల సైన్యంతో కలసి నెల్లూరును రక్షించడంలో పాల్గొనలేదు. బహుశా పాండ్యులు, నెల్లూరు, ములికి నాటి ప్రాంతాలలో ఉన్న అసంతృప్తికారుడు అంబదేవుడు కూడా కాకతీయులకు వ్యతిరేకంగా జరిగే కుట్రలో యాదవులను భాగస్వాములు చేశాడు. ఒక విభాగానికి నాయకత్వం వహించి ద్రాక్షారామంలో పాండ్యులపై విజయం సాధించిన గణపతిదేవుడు తన సైన్యంతో నెల్లూరు వైపు నడుస్తున్న సమయంలో అర్థాంతరంగా కాకతీయ సైన్యం కకావికలమైంది. బహుశా యాదవుల, ఇతర కాకతీయ తిరుగుబాటు నాయకుల సైన్యం కాకతీయ సేనలతోనే తలపడడంతో గందరగోళంలో పడి వెనుదిరగక తప్పలేదు. ఎదురు చూడని ఈ పరిణామంతో ఏర్పడిన ఉపవూదవ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించడం అవివేక మౌతుందని గణపతిదేవుడు భావించాడు.
              క్రీ.శ.1262లో ముత్తుకూరు వద్ద జరిగిన ఈ యుద్ధ సన్నివేశంతో గణపతిదేవుడు తానిక క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకోవాలనే ఒక ముఖ్య నిర్ణయం తీసుకుని, పాలనాధికారాలతో పాటు సైనికాధికారాలు కూడా రుద్రమకు ఇచ్చి ‘రుద్రమదేవమహారాజు’ అనే పేరుతో ఆమెకు పట్టాభిషేకం చేశాడు. ఇప్పటివరకు ‘మహామండలేశ్వరులు’గా చెప్పుకున్న కాకతీయ సంప్రదాయాన్ని మార్చి ‘మహారాజుంగారు’ గా రుద్రమను పరిచయం చేయటంలో విశేషం ఉంది. స్త్రీ రాజ్యపాలన చేయడం కొత్త విషయం. అందువల్ల కొందరు (అంబదేవుని వంటివారు) చులకన చేయవచ్చు. శత్రువులు తక్కువ అంచనా వేయవచ్చు. అందువల్ల ఎన్నో రకాలుగా ఆమె సాధికారతను సుస్థిరం చేయాల్సి ఉంది. అందుకే, గణపతిదేవుడు దానికి అవసరమైన దర్పాన్ని కల్పించి, అందుకు తగిన వస్త్రధారణను కూడా సూచించాడు. ఆమె ఎప్పుడూ పురుషవేషంలోనే ఉండి రాజ్యకార్యాలను నిర్వహించేది. అంతేకాదు, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుని రుద్రమకు దత్తత నిప్పించాడు. ఈ విధంగా ఆమె రాజకీయ జీవన బాటను సాధ్యమైనంత వరకు నిష్కంటకం చేసి క్రీ.శ. 1269-70 ప్రాంతంలో కన్నుమూశాడు.
       రుద్రమ అఖిలాంధ్రావనికే పాలకురాలైతే, ఆమె సోదరి కోట రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు సమర్థవంతంగా పాలించి మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల మన్ననలు పొందింది. మోటుపల్లి ఓడరేవు పట్టణం ఆమె రాజ్యంలో ఒక బహుళజాతి పట్టణంగా వెలుగొందింది. వివిధ దేశాలకు, భాషలకు చెందిన వారు ఈ పట్టణంలో నివసించేవారు. ఆమె తన శక్తి సామర్ధ్యాలతో పరిశ్రమలను, వర్తక వాణిజ్యాలను అభివృద్ధి పరచిందనీ, దాతృత్వంతో ప్రజల హృదయాలను చూరగొన్నదని, మర్యాద పూర్వక ప్రవర్తనతో విదేశీయుల మన్ననలను పొందుతున్నదని అభిప్రాయపడ్డారు. మార్కోపోలో వ్రాశాడు.
           స్త్రీ పురుష సమానత్వ సాధనకే గాక వివిధ వర్గాలు సామాజికంగా సమానత్వాన్ని సాధించాలనే తపన గణపతి దేవునిలో కనపడుతుంది. తన సైన్యంలో అన్ని వర్గాల వారికి, కులాల వారికి సమాన అవకాశాలిచ్చాడు.
రుద్రమదేవి (క్రీ.శ.1259 - 1289)
                               
తండ్రికి తగిన తనయగా రుద్రమదేవి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక ప్రసూతి ఆలయం, జ్వరాలయం, విద్యాకేంవూదాలతో గోళకి మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా విశ్వేశ్వర శివాచార్యులకు వెలగపూడితో సహా మందర(డం) గ్రామాన్ని దానం చేసింది. రుద్రమ రాజ్యానికి రావటం ఇష్టం లేని దేవగిరి రాజు మహాదేవుడు తన మేనల్లుడైన హరిహర మురారి దేవుల తరుఫున కాకతీయ రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. వీరు గణపతిదేవునికి మహాదేవుని సోదరి అయిన సోమలదేవి వల్ల కలిగిన సంతానం.
      గణపతి దేవునికి నారాంబ, పేరాంబల వల్ల కల్గిన సంతానం గణపాంబ, రుద్రమలు. వీరి సవతి తమ్ముళ్ళు హరిహర, మురారి దేవులు. వీరిని కాదని క్రీ.శ.1259 లో గణపతి దేవుడు రుద్రమను ‘పట్టోధృతి’ గా ప్రకటించడం మహాదేవునికి మింగుడు పడని విషయమైంది. అప్పటివరకు కాకతీయ సైన్యంలో 60 సంవత్సరాల పాటు ప్రతి యుద్ధంలో కీలకపాత్ర నిర్వహించిన యాదవులు క్రమంగా శత్రుభావాన్ని పెంచుకున్నారు. బహుశా ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఖంగు తినడానికి కారణం యాదవులు అంబదేవునితో కలసి శత్రువులైన పాండ్యులతో కలసి కుట్ర పన్నడమే. అందువల్లే ఇక ఆగకుండా గణపతిదేవుడు వెంటనే 1262లోనే రుద్రమకు సైనికాధికారాలను కూడా అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. విధవను అపశకునంగా భావించే ఉత్తరాది సంస్కృతికి భిన్నంగా దక్షిణాదిన వితంతువులైన స్త్రీలు ప్రశాంతంగా సజ్జీవనం గడుపుతూ సమాజసేవలో సమర్థులుగా తమను తాము నిరూపించుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మధ్య తరగతి నుండి వచ్చిన నాయకురాలు నాగమ్మ పధానిగా), పాలకవర్గం నుండి వచ్చిన కోట గణపాంబ, రుద్రమ, చాగి ముప్పలదేవి, విరియాల సాగసాని, కోట బయ్యలదేవి మొదలైన వారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కూలిపని చేసుకునే ఒంటరి స్త్రీలు కూడా సమాజసేవలో, తటాక నిర్మాణాల్లో ఏ విధంగా పాలు పంచుకున్నదీ బసవపురాణం చెప్తూంది.
          ఏమైతేనేం, రుద్రమ రాజ్యానికి రాగానే యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపైన దండెత్తి రావటంతో రుద్రమ రణరంగంలో వీర విహారం చేసి మహాదేవుని బెడద కోట (బీదర్) వరకు తరిమి కొట్టింది. తాను ఓరుగల్లు కోటలో బంధించిన యాదవ సైనికులను పెద్ద మొత్తంలో (కోటి బంగారు నాణాలు) యుద్ధ నష్టపరిహారం తీసుకుని వదిలి పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రమ ‘రాయగజకేసరి’ బిరుదును ధరించింది. పాలకురాలిగా రుద్రమ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఆమె అత్తింటి వారు నిడదవోలు ప్రాంతంలో స్వతంవూతంగా పాలించడం మొదలు పెట్టారు. వారిని చూసి ఇరుగుపొరుగు గవర్నర్లు కూడా స్వతంవూతంగా శాసనాలు జారీ చేయడం మొదలైంది. ఇదే అదనుగా తూర్పు నుండి కళింగ గంగరాజు భానుదేవుడు గోదావరి తీరంలోకి చొచ్చుకు రావాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ విషమ పరిస్థితుల్లో రుద్రమ విజ్ఞతతో ప్రవర్తించి పరిస్థితులను చక్కదిద్దింది. గాంగులపై విజయాన్ని సాధించటమే గాక తూర్పున గోదావరి తీరాన్ని కాకతీయ రాజ్య సరిహద్దుగా పటిష్టం చేసింది.
                  కడప పాలకుడైన అంబదేవునికి రుద్రమ రాజ్యానికి రావడం ఇష్టం లేదు. అతని పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారు కావటం వల్ల ఆ అభిమానంతో బహుశా రుద్రమ తమ్ముళ్లు హరిహర మురారి దేవుల పక్షపాతిగా ఆమెపట్ల శతృత్వభావం వహించాడు. పాండ్యులను, దేవగిరి పాలకులను కూడా ఆమెకు వ్యతిరేకంగా కూడ గట్టి తిరుగుబాటు చేశాడు. వల్లూరు రాజధానిగా స్వతంత్రతను ప్రకటించాడు. అంబదేవుని ఆగడాలను ఎదుర్కోవడానికి రుద్రమ తన సైన్యాన్ని సిద్ధం చేసింది. ప్రతాపరుద్రుడు వ్యుహరచన చేశాడు. సైన్యం మొత్తం మూడు భాగాలుగా విడిపోయి ముక్కోణంలో శత్రువులను ఎదుర్కొన్నారు. ఒక విభాగానికి ప్రతాపరుద్రుడు రెండో విభాగానికి అడిదం మల్లుసేనాని, మూడో విభాగానికి స్వయంగా రుద్రమ నాయకత్వం వహించారు. దురదు ష్టవశాత్తూ త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యద్దంలో రుద్రమ ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయస్సు అప్పటికీ 80 సంవత్సరాలకు పైబడే ఉంది. క్రీ.శ 1289 నవంబర్‌లో ఆమె సైన్యాధికారి మల్లికార్జున నాయకునితో సహా యుద్ధ రంగంలో ప్రాణాలు విడించిందని నల్గొండ జిల్లా చందుపట్ల శాసనం వల్ల తెలుస్తోంది. ఈ విధంగా మొక్కవోని పట్టుదలతో ఆంధ్రరాజ్య పరిరక్షణ కోసం 80 సంవత్సరాల పైబడిన వృద్ధాప్యంలో కూడా స్వయంగా యుద్ధరంగంలో పోరాడుతూ వీరమరణం పొందిన రుద్రమ చరిత్రపుటల్లో మహిళా శక్తికి ప్రతీకగా నిలచింది.
          నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా ప్రజాపాలనను గాని, అభివృద్ధి కార్యక్షికమాలను గాని రుద్రమ నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లు కోటకు మరమ్మత్తులు చేయించి రాతి కోటకు లోవైపున మెట్లు కట్టించింది. మట్టికోటకు బురుజులను, అగడ్తను నిర్మించి కోటను దుర్భేద్యంగా మార్చింది. రుద్రమ తర్వాత ఆమె దత్తపుత్రుడు (మనుమడు) అయిన ప్రతాపరువూదుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ. 1289లోనే రుద్రమ మరణించినా 1295 వరకు ఇతడు శాసనాల్లో కుమార ప్రతాపరువూదుడిగానే కన్పిస్తాడు. బహుశా రుద్రమ వీరమరణం, దాని తర్వాత ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది, అంబదేవునిపై ప్రతిచర్య తీసుకునే వరకు పట్టాభిషేకాన్ని జరుపుకోరాదని భావించి ఉండవచ్చు. ముందుగా ప్రతాపరుద్రుడు సైనికశక్తిని పటిష్టం చేయటానికి పూనుకున్నాడు. నాయంకర విధానాన్ని రూపొందించి సైనిక వ్యవస్థను క్రమబద్ధీకరించాడు. క్రీ.శ. 1291లో అంబదేవుని త్రిపురాంతకం నుండి పారవూదోలారు. అంబదేవునితో చేతులు కలిపి రుద్రమ వీరమరణానికి కారకులైన పాండ్యులను, దేవగిరి పాలకుల్ని పలుచోట్ల ఓడించి క్రీ.శ. 1294 నాటికి తుంగభద్ర అంతర్వేది ప్రాంతంలోని పటిష్టమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1295 లో కుమార ప్రతాపరువూదుడు ‘వీర ప్రతాపరుద్ర మహారాజుగా’ పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత పాండ్యులను కంచి నుండి పారవూదోలాడు.
ఢిల్లీ సుల్తానుల దాడులు:
    
అల్లా ఉద్దీన్ ఖిల్జీ నుండి మహ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఢిల్లీ సుల్తానులు క్రీ.శ.1303-1323 సంవత్సరాల మధ్య ఏడు సార్లు దండెత్తి రాగా కొన్నిసార్లు కాకతీయులు విజయం సాధించారు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక దక్షిణ దండయాత్రల్లో ఉండడం వల్ల సంధి చేసుకోవలసి వచ్చింది.
పతనం: చివరగా 1323లో ఉల్లూఖాన్ (యువరాజైన మహ్మద్‌బిన్‌తుగ్లక్) నాయకత్వంలో రెండుసార్లు దండెత్తాడు. మొదటిసారి వచ్చిన దండయావూతలో కాకతీయ సైన్యం ఘనవిజయం సాధించింది. విజయ కేతనాలను ఎగురవేసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కోటలో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రతాపరువూదుడు ప్రజలకు పంచిపెట్టాడు. ఇంతలో అనుకోకుండా ముస్లిం సేనలు హఠాత్తుగా వచ్చిపడ్డాయి. చుట్టు పక్కల గ్రామాలను తగులబెట్టారు. మండువేసవి. నీరు కోటలోకి పోకుండా గండ్లు కొట్టారు. కోటను చుట్టుముట్టారు. బొబ్బాడ్డి అనే నాయకుణ్ణి తమవైపుకు తిప్పుకున్నారు. బహుశా లంజపాతరదిబ్బ వద్ద మట్టి కోటకు గండికొట్టారు. కోటలో ప్రవేశించిన పద్మనాయక వీరులు ధైర్యం వీడక పోరాడుతూ ఒక్కొక్కరూ బలైపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, స్త్రీలు హాహాకారాలు వినలేక ప్రతాపరువూదుడు కోట బయటకు వచ్చి లొంగిపోయాడు. ఈసారి ఉల్లూఖాన్ సంధికి అంగికరించలేదు. ప్రతాపరువూదుని ఢిల్లీకి బందీగా పంపుతుండగా అవమానంతో దారిలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చారివూతకాధారాల వల్ల తెలుస్తూంది.
                 ప్రతాపరుద్రుడు ఓడిపోయిన తర్వాత సంధి చేసుకుంటాడని, ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలను, పద్మనాయకుల అసమర్థతను అంగీకరించి తమకు తగిన స్థానాన్ని కల్పిస్తాడని బొబ్బాడ్డి, అతని అనుచరులు ఆశించారు. అనుకోకుండా జరిగిన పరిణామానికి చింతించారు. ఓరుగల్లుకు ‘సుల్తాన్‌పూర్’ అని ఉల్లూఖాన్ నామకరణం చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన నాయకులకు ఉన్నత పదవులిచ్చాడు. ప్రతాపరువూదుని కటక (కోట) పాలకుడైన కన్ను (నాగయగన్నయ) ఉల్లూఖాన్ మన్ననకు పాత్రుడై మతాంతరీకరణ చెందిన మాలిక్ మక్బూల్‌గా ఇక్కడ గవర్నర్‌గా నియమింపబడ్డాడని షామ్సీసిరాజ్ అఫీస్ రచనను బట్టి తెలుస్తూంది. ఈ అంశం కూడా మంత్రుల, సామంతుల ద్రోహచింతన పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామంతుల సైన్యం ఎక్కువై ప్రభువు సైన్యం తక్కువైనపుడు ప్రభువు పని చిక్కుల్లో పడుతుంది. అదే కాకతీయ రాజ్య పతన సమయంలో జరిగింది.
కాకతీయ రాజ్య పతనానికి ఇంకా ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా శ్రమించి సాధించిన తెలుగువారి ఐక్యత దెబ్బతిన్నది. ఆంధ్రదేశం ముక్క చెక్కలైంది. ఓరుగల్లు బావురుమన్నది. దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. పంటలు, పరిక్షిశమలు నాశనమయ్యాయి. శాంతి భద్రతలు కరువై, వర్తక వాణిజ్యాలు అడుగంటాయి.
              మళ్ళీ ఓరుగల్లుపై ఆధిపత్యం కోసం వివిధ రాజ్యాల మధ్య పోరు ప్రారంభమైంది. ఇక్కడ కాకతీయులు సాధించిన జలసమృద్ధి, వ్యవసాయ, వర్తక వాణిజ్యాల అభివృద్ధి తత్ఫలితంగా ఓరుగల్లు రవాణాకు కూడలిగా మారటం వంటివి ఈ ఆకర్షణకు మూల కారణాలు.
కాకతీయాధికారం అంతమైనా, వారి పాలనా ప్రభావం దానిలోని ఉన్నత లక్షణాల వల్ల, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్లనూ, ఆ తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రభువులు, ముఖ్యంగా విజయ నగరాధీశులు, కుతుబ్‌షాహీ సుల్తానులు, కాకతీయ పాలనాంశాలను చాలా వరకు అనుసరించి కొనసాగించారు. విజయ నగరాధీశుల అమర నాయంకర విధానానికి పునాది వేసినవారు కాకతీయులే. 16,17 శతాబ్ధాల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన కుతుబ్‌షాహీల పాలనలో కాకతీయుల పన్నిద్ధరు ‘ఆయగాండ్ర’ పద్ధతి ‘బారాబలవంతుల’ పద్ధతిగా మారి గ్రామ పాలనలో కొనసాగింది. నీటి తీరువాలో కాకతీయులు ప్రవేశపెట్టిన దశబంధ విధానాన్ని, పూడికతీత కార్యక్షికమాలను సుల్తానులు యధాతథంగా కొనసాగించారు. సైనిక వ్యవస్థలో కాకతీయుల లెంకల విధానాన్నే ‘ఖాసాఖైల్’ పద్ధతిగా కొనసాగించారు. అదే విధంగా వ్యవసాయాభివృద్ధిలోను, ఉద్యానవన కృషిలోను కాకతీయుల విధానాలను కుతుబ్‌షాహీలే కాక ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కూడా అనుసరించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ వద్ద ఉపవూపధానిగా ఉన్న మాలిక్ మక్బూల్ (గన్నయ నాయకుడు) దశబంధ విధానాన్ని ఢిల్లీ రాజ్యంలో ప్రవేశపెట్టడమే గాక ఉద్యానవన కృషి ద్వారా రాజ్యపుటాదాయాన్ని పెంచడానికి కృషి చేశాడు. ఈ విధంగా కాకతీయ పాలన సమకాలీన ప్రభువులకు, తదనంతర పాలకులకు సైతం మార్గదర్శకం అయింది.
           ఇప్పటికే చాలా వరకు చెరువులు పూడికలు తీయక కప్పులు, సాసర్ల రూపంలోకి మారాయి. నాడు అతి విశాలంగా, లోతుగా ఉండి సమువూదాలుగా పిలువబడిన బాల సముద్రం వంటి జలశయాలు ఇళ్ల స్థలాలుగా మారి చిరునామా కోల్పోయాయి. ఉన్నవాటిని పరిరక్షించుకోవటం, బాగా పాడైన వాటిని పూడికలు తీయించి వాడకంలోకి తేవటం ప్రస్తుత కర్తవ్యం. అదే మనం ఆనాటి నిర్మాతలకు సమర్పించే నివాళి. అప్పుడే అది మన తరానికి, ముందు తరాలకి వారసత్వంగా వచ్చిన తరగని పెన్నిధి అవుతుంది.
కాకతీయులు గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి, వారు రాష్ట్రకూట వంశస్థులని, మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలన వచ్చిన వారని గుండయ, ఎరియల పేర్ల చివర ఉన్న రాష్ట్రకూట శబ్ధమే ఇందుకు తార్కాణమని కొందరు అభివూపాయపడ్డారు. కానీ, ఇది ఏ మాత్రం సబబు కాదనిపిస్తుంది. ఎందుకంటే, రాష్ట్రకూట శబ్ధం ఇందుకు ముందు చెప్పుకున్నట్లు రట్టడిగా గ్రామాధికారులకు కూడా చాళుక్య శాసనాల్లోనూ ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ, రాష్ట్ర కూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రదేశంలోనే వారున్నారు తప్ప మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న దాఖలాలు లేవు. పైగా వారి పేర్లన్నీ అచ్చతెలుగు దేశీయపదాలే, వ్యవసాయ సంస్కృతికి చెందిన పేర్లు. ‘గుండము’ అంటే ‘లోతైన చెరువు’ అని అర్థం. ‘గుండయ’ పేరు దానికి సంబంధించిందే. చలమయ్య అనే పేరు కూడా నాటికీ నేటికీ ఆంధ్రదేశంలో సాధారణమైన పేరు. అది కూడా నీటి చలమకు సంబంధించిందే. బేతరాజు పేరు భూతక్షిగాహస్వామి (పోతురాజు) నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడిదే. ప్రోలయ నూర్పిడి సమయంలో పూజింపబడే దేవత ప్రోచేరాజుగా పోలరాజు) శివుడు కూడా పూజితుడయ్యాడు. బ(వ)య్యలమ్మ (చదువుల తల్లి), మైలమ (భూదేవి) కుందమ్మ (వ్వ), మేడలమ్మ, రుయ్యమ్మ, ముమ్మడమ్మ (ముగ్గురమ్మల మూలపుటమ్మ) ముప్పమ మొదలైన కాకతీయ కుటుంబీకుల పేర్లు అచ్చ తెలుగు పదాలతో కూడినవి. రుద్రదేవునితోనే సంస్కృత పేర్లతో కాకతీయ ప్రభువులు కనిపిస్తారు.
     తెలంగాణాన్ని హృదయసీమగా చేసుకుని అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన కాకతీయుల సాంస్కృతిక వారసత్వం మహోన్నతమైందిగా ప్రశంసలందుకుంది. దానికి మూల కారణం కాకతీయులు బహుముఖంగా అనుసరించిన ఉదాత్త విధానమే. అన్ని వర్గాలను- స్త్రీలను, పురుషులను, శిష్ఠులను, జానపదులను, పాలకులను, పాలితులను - అందరినీ కలుపుకుపోయే ధోరణే వారి విధానాలకు వెన్నెముక అయింది. పండితులు రూపొందించిన కళారూపాలకు, జానపదులు పొందు పరచుకొన్న కళారూపాలకు సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసి దానిలో వారు విజయాన్ని సాధించారు. అదే వారికి చరివూతలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. 

‘రాయ గజకేసరి’ రుద్రమదేవి
- పి.వి.పరబ్రహ్మ శాస్త్రి

కాకతి రుద్రమదేవి ఒక వీరవనిత. గణపతి దేవుడి కూతురు. క్రీ.శ. 1262లో కాకతీయ రాజ్యానికి ఆమె పాలకురాలైంది. గణపతి దేవుడికి పుత్రులు లేని కారణంగా ఆమెనే పుత్రుడుగా భావించి రాజనీతితోబాటు కత్తి డాలు పట్టి ఆనాటి కదన విద్యలో మేటి యోధురాలుగా తీర్చిదిద్ది, తన రాజ్యానికి వారసురాలుగా ‘రువూదదేవుడ’నే పురుషనామంతో ఆమెను సింహాసనాధిష్ఠితురాలిని చేశాడు. ఇది సహించని కొందరు రాజ్యానికి ఉత్తరం వైపున సేవుణ రాజ్యాధిపతిఅయిన యాదవ మహాదేవరాజును ఓరుగల్లు కోటపై దండెత్తడానికి ప్రోత్సహించారు. అయితే, దేవగిరి యాదవ రాజసైన్యం ఓరుగల్లు కోటను సాధించలేక పోయింది. శత్రుసైన్యాన్ని యాదవుల రాజ్యంలో చేరిన బీదరు కోటను విడిచిపోయేట్లు రుద్రమదేవి తరిమికొట్టి ఆ కోటను తాను ఆక్రమించుకొంది. ఆ కోటకు కాకతి సైన్యాధిపతిని అధ్యక్షుడిగా నియమిస్తూ ఒక శిలాశాసనాన్ని కన్నడభాషలో గద్య పద్యాలతో రాయించి ప్రతిష్టించింది. ఇది రుద్రమదేవి మొదటి మహా విజయం. ఈ నేపథ్యంలోనే తండ్రి బిరుదైన ‘రాయ గజకేసరి’ అనే బిరుదాన్ని తాను కూడా వహించినట్లు స్పష్టమవుతోంది.

ఈ విజయ సూచకంగా ఓరుగల్లు కోటలో స్వయంభు దేవాలయానికి ముందు అనేక శిల్పాలతో అలంకరించిన రంగ మండపాన్ని ఆమె నిర్మించారు. దాని చూరుకి నలుమూలల తాను కొత్తగా వహించిన రాయగజకేసరి (శవూతురాజులైన ఏనుగులకు సింహం వంటిది) బిరుదాన్ని శిల్పరూపంలో అంటే ఏనుగు తలమీద విక్రమించిన సింహం, దాని మీద కత్తి, డాలు రెండు చేతులతో పట్టుకొని స్త్రీ యుద్ధం చేస్తూ కూర్చున్నట్లు ఆ శిల్పం మలచబడింది. ప్రస్తుతం ఈ శిల్పాలు ఓరుగల్లు కోటలో రంగ మండప శిథిలాల్లో భాగంగా కనిపిస్తున్నాయి. ఇది రుద్రమదేవి రూపమని చరివూతకారులు భావిస్తున్నారు. 
దేవతా రూపమే అయితే, నాలుగు చేతులుండాలి. ముందు రాక్షసుడు కూడా కనిపించాలి. శిల్పంలో ఆ గుర్తులు లేవు. కనుక, ఈ శిల్పాలు ‘రాయగజ కేసరి’ బిరుదానికి తగినవిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆనాటి శంభునిగుడి నాలుగు తోరణ ద్వారాల నడుమ ఇది ఉన్నట్లు అర్థమవుతోంది. దాని శిథిలాలే ఇప్పుడు మిగిలాయి.

(వ్యాసకర్త కాకతీయుల శాసనాల పరిశీలన ద్వారా ఎన్నో సత్యాలను వెలికి తీశారు. అందులో మీరు చూస్తున్న కాకతి రుద్రమదేవి శిలా చిత్రాన్ని గుర్తించింది కూడా వీరే. అట్లే, బయ్యారం చెరువు శాసనం ఆధారంగా కాకతీయుల మూలాలను వెలికి తీయగలిగారు. అంబదేవునితో జరిగిన యుద్ధంలో చందుపట్ల శాసనం ద్వారా కాకతి రుద్రమదేవి మరణించిన సంవత్సరం క్రీ.శ.1290గా నిర్ధారించటం, రాయగజకేసరి బిరుదు ముద్ర ఆధారంగా కాకతీయులు వేయించిన నాణాలను గుర్తించడం, రుద్రదేవుని హనుమకొండ శాసనాన్ని పునర్వ్యాఖ్యానించడం -ఇలా కాకతీయుల చరిత్ర నిర్మాణంలో పి.వి.పి. గా పేరొందిన వీరి కృషి ప్రసిద్ధం. ‘కాకతీయలు’ పేరిట వారు రచించిన పరిశోధనా గ్రంథం ఓ ప్రామాణిక రచనగా సర్వామోదం పొందింది.

Wednesday 19 December 2012

జనవరిలో తెలంగాణ?...


- ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం!
- నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం
- ప్రకటించడమే తరువాయి?
- ఇకపై పార్టీలో చర్చలుండవు
- రెడిఫ్ సంచలనాత్మక కథనం
న్యూఢిల్లీ: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైందా? జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుందా? అవుననే అంటున్నది రెడిఫ్‌డాట్‌కామ్ వెబ్‌సైట్. ఈ మేరకు ఒక సంచలనాత్మక కథనాన్ని వెబ్‌సైట్ పోస్ట్ చేసింది.
      తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం చేయజాలమని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించిందని రెడిఫ్ తన కథనంలో పేర్కొంది. కాంగ్రెస్‌లోని అత్యున్నత స్థాయి విశ్వసనీయవర్గాలు చెబుతున్నది నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ నెరవేరే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని తెలిపింది. అతి త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకోనున్నట్లు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాలు తమకు తెలిపాయని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఇకపై తెలంగాణ విషయంలో తదుపరి చర్చలు ఉండబోవని తెలిపింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారని, ఒక నిర్ణయానికి వచ్చేశారని రెడిఫ్ కథనం పేర్కొంది. ఈ నిర్ణయం వెలువరించడానికి నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేనప్పటికీ.. వచ్చే ఏడాది జనవరిలో ప్రకటన ఉంటుందని అంటున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకోలేని స్థితిలో తాను ఉన్నానని కాంగ్రెస్ భావిస్తోందని వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐదు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని, ఉద్యమం కోసం ఇప్పటికే వెయ్యి మందికిపైగా యువత ఆత్మబలిదానాలు చేశారని రెడిఫ్ డాట్‌కామ్ తన కథనంలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. ఈ మూడు ప్రాంతాల్లో విస్తీర్ణం రీత్యా తెలంగాణ అతిపెద్దది. మొత్తం 41శాతం భూభాగాన్ని కలిగి ఉంది. 
                  మొత్తం రాష్ట్ర ఆదాయంలో 76 శాతం తెలంగాణ నుంచే వస్తున్నదని రెడిఫ్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న రాజశేఖర్‌డ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని ఆ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. అత్యధిక నిరసనలు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచే వచ్చాయని, ఒక దశలో తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే నడిపారని తెలిపింది. చాలా కాలం ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన శక్తిమేరకు ప్రయత్నించిందని, అయితే పార్టీ నుంచి జగన్‌మోహన్‌డ్డి వెళ్లిపోవడంతో పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించింది. జగన్ ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్సీపీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు షేర్‌ను స్వాహా చేసిందని పేర్కొంది. జగన్ అరెస్టయి జైల్లో ఉన్నప్పటికీ.. పార్టీని ఆయన తల్లి, సోదరి నడిపిస్తున్నారని పేర్కొంది. ప్రత్యేక తెలంగాణకు జగన్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయనకు మద్దతు లభిస్తున్నదని తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందేందుకుగాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఈ దశలో ప్రకటించడం ఉత్తమ నిర్ణయం కాగలదన్న భావనలో కాంగ్రెస్ ఉందని రెడిఫ్ కథనం వ్యాఖ్యానించింది. తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాజధాని హైదరాబాద్ విషయంలో అనేక అంశాలు తలెత్తుతాయని పేర్కొంది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని స్పష్టం చేసి వెబ్‌సైట్.. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌ను వేరు చేసే అవకాశాలు లేవని పేర్కొంది. ఇది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు కనీసం ఐదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.

Monday 17 December 2012

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే..


  ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట్లాడుతున్నారు. అదే విధంగా రాయలసీమకు వెళ్ళి ‘హంద్రీనీవా, సుజల స్రవంతి’ ప్రారంభోత్సవ సభలో రాయలసీమ గడ్డమీద పుట్టి పెరిగినందుకు హంద్రీనీవాను ప్రారంభోత్సవం చేసి ఈ గడ్డ రుణం తీర్చుకున్నానని అన్నారు. అలాగే కోస్తాంధ్ర ప్రాంతానికి పోయి ఎన్ని అవంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును కట్టితీరుతానని ప్రతిజ్ఞ చేశారు. కిరణ్ కుమార్‌డ్డితోపాటు ఉమ్మడి రాష్ర్టంలో ముఖ్యమంత్రులైన సీమాంధ్ర నాయకులు కేవలం తెలంగాణ ప్రాంత నీళ్ళు, నిధులు, భూములు దోచుకోవడమే తమ పరమావధిగా పనిచేశారు, చేస్తున్నారు. ఇంకో తెలంగాణ ప్రాంతం వారు ముఖ్యమంత్రు లు అయ్యింది కొద్దికాలమే. ఆ కాలంలో కూడా తెలంగాణ ప్రాంత వనరుల దోపిడీని అడ్డుకోలేక పోవడంతోపాటు తమ స్వలాభమే ధ్యేయంగా పనిచేశారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరీ వాటి ఉప నదులు తెలంగాణ ప్రాంతంలో పారుతూ జీవన నదులుగా వెలుగొందుతు న్నా తెలంగాణ ప్రజలకు ఒక్కపూట తిండి కూడా లేని పరిస్థితుల్లో పాలమూరు, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వలసపోయి జీవచ్ఛవాలుగా బతుకున్నారు. గుక్కెడు మంచినీళ్ళు దొరకక కృష్ణానది పరివాహాక ప్రాంతంలోని నల్గొండ జిల్లా ప్రజలు ‘ఫ్లోరైడ్ వ్యాధి’తో తల్లడిల్లుతున్నారు. గోదావరి పరివాహాక ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలు మంచినీళ్ళు దొరకక ప్రతి ఏటా వందలాదిగా ‘డయేరియా’ బారిన పడి చనిపోతున్నారు. దేశంలోని మెజారిటీ గ్రామాల్లో చెరువులు కుంటలు, కాలువల పారుదల భూములన్నీ అగ్రవర్ణాలకే చెందినవిగా చరిత్రలో నమోదైనవి. 
       
 అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి వాటి ఉపనదుల పరివాహాక    ప్రాంతంలోని    నదుల  ఒడ్డున సీమాంధ్ర   భూస్వాములు లక్షలాది ఎకరాలను ఆక్రమించుకొని ఆరు దశాబ్దాలుగా ఆ నదుల నీటిని వాడుకుంటున్నారు. అసలే     ప్రాజెక్టులు లేక,      చెరువులు కుంటలు పూడికలు తీయక తెలంగాణ  ప్రాంత నీటివనరులు  పూర్తిగా అడుగంటి పోయిన తరుణంలో     తెలంగాణ   ప్రాంత  రైతాంగం   సాగునీటి కోసం నానాయాతనలు     పడుతుండగా,    నదుల        ఒడ్డున వ్యవసాయ భూములను       ఆక్రమించుకున్న      సీమాంధ్ర భూస్వాములు సకల సంపదలతో తులతూగుతున్నారు. రెండుపంటలు పండించుకుంటున్న కోస్తాంధ్ర ప్రాంతానికి మూడోపంటకు నీరీచ్చెందుకు దక్షిణ తెలంగాణలోని కృష్ణానది    మీద    పులిచింతల ప్రాజెక్టు, గోదావరి నది   మీద పోలవరం ప్రాజెక్టు కట్టి  తెలంగాణ  ప్రాంత   ఆదివాసులను ఆ    ప్రాజెక్టులో ముంచి సీమాంధ్రకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నం తెలంగాణ ప్రజలను కృంగ తీస్తున్నది.  ఈనేపథ్యంలో   మా   రాష్ర్టం  మాకు   కావాలని అడిగినందుకు  నాటి  ముఖ్యమంత్రి బ్రహ్మనందడ్డి 370మంది తెలంగాణ బిడ్డలను కాల్చిచంపారు. కొద్దిమంది   ఆయన   మంత్రివర్గం    నుంచి బయటకి వచ్చినా,  మళ్ళీ తెలంగాణ   ప్రాంత ప్రజలను   వీరు   కూడా మోసగించారు.   అధికారంలో కాంగ్రెస్, తెలుగుదేశం      ఏపార్టీ  ఉన్నా సీమాంధ్ర నుంచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు తెలంగాణకు చెందిన సకల వనరులు దోచుకోవడం తెలంగాణ ప్రాంత ప్రజలను నట్టెట ముంచడం జరిగింది,  జరుగుత్నుది. ఈ దుర్మార్గానికి          వ్యతిరేకంగా పోరాడుతున్న   ప్రజలను     అణచడమే      ధ్యేయంగా        ముందుకు పోతున్నారు. 
          నాగార్జునసాగర్‌ను నందికొండ ఎగువన ఏలేశ్వరం దగ్గర నిర్మించాలని ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి, సీమాంధ్రకు  చెందిన నీటిరంగ నిపుణుడు కె.ఎల్.రావు సహకారంతో సీమాంధ్రకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమల కాలువల ద్వారా 70% కోస్తాంధ్రకు ప్రయోజనం చేకూర్చేందుకు చేసిన కుట్ర ఫలితంగా దక్షిణ తెలంగాణ ఏడారిగా, కోస్తాంధ్ర ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. ఇప్పటికీ కుడి కాలువ ద్వారా పారుతున్న నీటిని లిఫ్ట్‌ల ద్వారా కోస్తాంధ్ర రైతాంగం వినియోగించుకునేందుకు అవుతున్న భారం ప్రభుత్వమే భరిస్తుండగా, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలోని లిఫ్ట్‌ల భారం తెలంగాణ రైతాంగమే భరిస్తున్నదంటే ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ పట్ల ఎంత వివక్షతో ఉన్నారో అర్థం అవుతున్నది. ఈప్రాజెక్టు రిపోర్టులో లేని కృష్ణా జిల్లాను ఈ ప్రాజెక్టు నీటి వాడకంలో చేర్చి ఖమ్మం జిల్లా రైతాంగం నోట్లో మట్టికొట్టారు. ఈ జిల్లాలో పారవలసిన రెండు లక్షల ఎకరాలకు నీరందివ్వకుండా కృష్ణా జిల్లా లోని ‘నూజివీడు ప్రాంతం’ వరకు లక్షా 60వేల ఎకరాలకు నీరందిస్తున్నారు. 
                ఆసియా ఖండానికే వన్నె తెచ్చిన నిజామ్ షుగర్ ఫ్యాక్టరీని కేవలం మూడుకోట్ల రూపాయలకే సీమాంధ్రకు చెందిన గోకరాజు రంగరాజు అనే పెట్టుబడిదారునికి 49% వాటాను అప్పగించారు. ఆఫ్యాక్టరీ యాజమన్యంలో ఉన్న దాదాపు 1,000 ఎకరాల భూమిని ఆయనకు కట్టబెట్టడంతో పాటు దాదాపు 800 కోట్ల విలువ కల్గిన ఫ్యాక్టరీని అతనికి ధారదత్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజల రక్త మాంసలతో అభివృద్ధి చేసిన నిజాం సర్ఫేఖాస్ భూములను ఐ.ఎం,జి అనే సంస్థకు కట్టబెట్టారు. దాదాపు 22 రకాల కుంభకోణాలతో తెలంగాణ భూములను మింగేసిన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు బినామిగా నేడు చంద్రబాబు ఉన్నారు. నామ నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో అత్యంత విలువైన గ్రానైట్‌ను చంద్రబాబు హాయంలోనే వందలాది ఎకరాలు కొట్టివేసి అత్యంత సంపన్న వంతునిగా మారి నేడు చంద్రబాబుకు బినామిగా ఉన్నారు. కుకట్‌పల్లిలోని జెఎన్‌టియు ఎదురుగా ఉన్న విలు భూములను దాదాపు ఒక కిలోమీటరు రోడ్ ఫేస్‌లోని భూమిని దక్కించుకొని నేడు నీతి వచనాలు పలుకుతున్న నామ నాగేశ్వరరావు తెలంగాణ ప్రాంత వ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు. ఒక దశాబ్దకాలంలోని చంద్రబాబు పాలనలో లక్షలాది కోట్ల రూపాయల సంపద సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఖాతాలోకి చేరి పోయింది.బోరింగుల ద్వారా తప్ప, కాలువల ద్వారా, చెరువుల ద్వారా, కుంటల ద్వారా సాగునీరు రాని తెలంగాణ ప్రాంత రైతాంగం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని పోరాడినందుకు బషీర్‌బాగ్ చౌరస్తా సాక్షిగా పదుల సంఖ్యలో ఉద్యమకారులను కాల్చివేశారు. సొంత పార్టీకి చెందిన హన్మకొండ శాసనసభ్యులు దివంగత ప్రణయభాస్కర్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు గురించి శాసనసభలో మాట్లాడినందుకు చంద్రబాబు చేత తీవ్ర బెదిరింపులకు గురయ్యా రు. తెలంగాణ ప్రాంత వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు 2009, డిసెంబర్ 10న తన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకుని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును అడ్డుకున్నాడు. 
              తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలను వంచించారు. అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు. తెలంగాణ ప్రాంత సకల వనరులు తన కుటుంబానికి, సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల రూపాయలు దిగమింగిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంత నీటి వనరులను సీమాంధ్రకు తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక్క పోతిడ్డిపాడు విస్తరణ ద్వారానే దాదాపు 110 టీఎంసీల నీరును రాయలసీమకు తరలించారు. తెలంగాణ ప్రాంతంలోని ఇచ్చంపల్లి, లోయర్ పెనుగంగ, అప్పర్ పెనుగంగ, కాంతాలపల్లి లాంటి ప్రాజెక్టులకు మోక్షమే లేకుండాపోయింది. తూతూ మంత్రంగా మొదలుపెట్టిన దేవాదుల, ఎ.ఎం.ఆర్ ఫేజ్-2, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, భీమా (సంగం బండ), కల్వకుర్తి, ఆర్‌డీఎస్ లాంటి పథకాలు ‘ఎక్కడేసీన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు మీ కోసం వస్తున్నా నన్నా, షర్మిల నేనున్నానంటూ పాదయాత్రలు చేసినా, కిరణ్‌కుమార్‌డ్డి ఇందిరమ్మ పేరుతో పల్లెబాట పట్టినా అన్నీ పదవి కోసం ఆరాటాలే తప్ప మరేమీ కాదు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలో భాగమైన రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన సీమాంధ్ర తత్వాన్ని ఒకరికి మించి మరొకరు చాటుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంలో అందరు ముఖ్యమంత్రుల లాగే కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా భాగమయ్యారు. అందుకే నాటి నీలం సంజీవరెడ్డి నుంచి నేటి కిరణ్ కుమార్‌రెడ్డి దాకా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నడిచినవారే. తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు దోచిపెట్టి, అందులో తమ వాటాను పొందిన వారే. వీరికి వ్యతిరేకంగా మడప తిప్పని పోరాటంతో తెలంగాణ సాధనకు నడుం కట్టాలి. తెలంగాణ ప్రజలు ‘ఎప్పటివరకు ఈ పోరాటం అంటే తెలంగాణ వచ్చేవరకు, తెలంగాణ వనరులపై సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల దోపిడీ ఆగేంతవరకు’ అంటూ తెలంగాణ సమస్త ప్రజానీకం పోరాడాలి.
                                                                               -చిక్కుడు ప్రభాకర్

Saturday 15 December 2012

హైకమాండ్‌కు తెలంగాణ మంత్రుల డెడ్‌లైన్


   తెలంగాణ అంశంపై ఈ ప్రాంత మంత్రులు తమ వాయిస్ పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ఆలోచన ఉండకూడదని అధినేత్రి సోనియాగాంధీకి ఘాటైన లేఖ రాశారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష మీటింగ్‌లో తెలంగాణపై ఖచ్చిమైన, స్ఫష్టమైన నిర్ణయం తీసుకోవాలని సోనియాగాంధీని కోరారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే ప్రభుత్వానికి, అవసరమైతే పార్టీకి సైతం దూరంగా ఉండటానికి వెనకాడమని తెలంగాణ మంత్రులు సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే హైకమాండ్‌కు డెడ్‌లైన్‌గా చెప్పవచ్చు. 
                 ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ బొత్సతో కూడా స్ఫష్టం చేశారు. అఖిలపక్షానికి పార్టీ నుంచి ఒక్కరినే పంపాలని, ఇద్దరిని పంపినా అభిప్రాయం ఒక్కటే ఉండాలని మంత్రులు డిమాండ్ చేశారు. అఖిలపక్షానికి షిండే ఇద్దరిని పిలవడంపై తెలంగాణ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవాళ గాంధీభవన్‌లో మంత్రులు బొత్సను కలసి తమ అభిప్రాయాన్ని, కార్యచరణను ఆయనకు వివరించారు. ఇవాళ సాయంత్రం జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీ మంత్రులు బొత్సను కోరారు.

Thursday 13 December 2012

అఖిలపక్షం ఓ చిల్లర నాటకం

- పార్టీకి ఇద్దరిని రమ్మంటారా?
- ఎఫ్‌డీఐ ఓట్ల కోసం వాడుకున్నారు
- టీ ఎంపీల్లారా.. మీ భవిష్యత్తేంటి? 
- తెలంగాణకు సంబంధం లేని సన్నాసుల విగ్రహాపూందుకు?
- ‘తెలంగాణ’లో రంగాడ్డి పేర వర్సిటీ
- రంగాడ్డి పుస్తకావిష్కరణలో కేసీఆర్
- టీఆర్‌ఎస్‌లోకి రావాలని కేవీఆర్ మనవడికి ఆహ్వానం
   ‘కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై ఈనెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం ఓ చిల్లర నాటకం. పార్టీకి ఇద్దరిని రమ్మంటారా? ఇదేనా కాంగ్రెస్ చిత్తశుద్ధి? మేమేమైనా ఎడ్డోళ్లమా? అంత అర్థం కాదా మాకు?’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిసెంబరు  12న   ఇక్కడి గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజీలో జరిగిన కార్యక్షికమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత కొండా వెంకట రంగాడ్డి (కేవీఆర్) స్వీయ చరిత్ర ఉర్దూ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘టీ కాంగ్రెస్ ఎంపీల్లారా! ఢిల్లీలో ఏం పట్టుకొని ఊగులాడుతారు? రండి బయటకు’ అని పిలుపునిచ్చారు.
                      ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా టీ కాంగ్రెస్ ఎంపీల ఓట్ల కోసమే కాంగ్రెస్ అధిష్ఠానం నాటకాలాడిందని ఆరోపించారు. ఆ కుట్రలను ఇప్పటికైనా ఎంపీలు గమనించాలన్నారు. తెలంగాణ తల్లి ఒడిలోకి చేరుతరా? లేదా అధిష్ఠానానికి గులామీ చేస్తారా? తేల్చుకోవాలని టీ కాంగ్రెస్ ఎంపీలకు ఆయన సూచించారు. ఎస్‌ఐ, ఎమ్మార్వో వంటి పోస్టులను గజిటెడ్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అనేక పోస్టులను గజిటెడ్‌గా మారుస్తూ, ఇష్టమొచ్చినట్లు చేస్తూ పోతే ఎలా? అని నిలదీశారు. టీ కాంగ్రెస్ ఎంపీలు వెంటనే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, కేంద్ర హోంమంత్రి షిండేను కలిసి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని సూచించారు. ముందు సీఎంను కలిసి హెచ్చరించాలన్నారు. వచ్చేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలేననన్న కేసీఆర్.. 100 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలతో ఢిల్లీ పీఠాన్ని కమాండ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
          ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగితే నివాళులర్పించే పార్లమెంట్.. తెలంగాణ కోసం వేయి మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మె 42 రోజుల పాటు అపురూపంగా, బ్రహ్మాండంగా జరిగితే ప్రధాన మంత్రికి పట్టదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్ర లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిదీ కాపీ కొడుతున్నడు. గొర్రె పిల్లను పట్టుకొని గొర్రెల బీమా ఫ్రీ అంటడు. దేన్ని పట్టుకున్నా ఫ్రీ అంటడు. సింగపూర్ వెళ్లి రాష్ట్రాన్ని అట్లనే చేస్తానన్నడు. చైనా, అమెరికా వెళితే అలాగే చేస్తానంటడు. చివరికి బాబు ఏమవుతడో’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 
     రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల నుంచి ఆదాయం వస్తోందన్నారు. ఈ శాఖల ద్వారా తెలంగాణ నుంచి రూ. 40వేల కోట్లు ఉంటే, సీమాంధ్ర నుంచి రూ.20వేల కోట్లు మాత్రమే వస్తోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని సన్నాసుల విగ్రహాలు ఇక్కడెందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పగించే విగ్రహాలు చాలా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టని, తెలంగాణ భాషను అవహేళన చేసే తెలుగు తల్లి తమ పాలిట దయ్యమే అవుతుందన్నారు. తెలంగాణ యాసలో తాను మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత ఆంధ్ర యాసలో మాట్లాడేందుకు భయపడుతున్నారని గుర్తు చేశారు. 
            తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేవీ రంగాడ్డి పేరిట యూనివర్సిటీ నెలకొల్పుతామని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలిస్తామని, ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాలను పెడతామని కేసీఆర్ ప్రకటించారు. కేవీఆర్ మనవడు కేవీ విశ్వేశ్వర్‌డ్డిని టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ కోసం పోరాడిన కేవీ రంగాడ్డి మనవడిగా పార్లమెంట్‌లోగాని, అసెంబ్లీలోగాని గళాన్ని విప్పాలని కేసీఆర్ సూచించారు. పెద్ద మనుషుల ఒప్పందం చారివూతక డాక్యుమెంట్ అని, ఆ ఘనత రంగాడ్డిదేనన్నారు. 
              ‘నాకు ఎమ్మెల్యేగా బీ ఫాం ఇచ్చేందుకు నాటి టీడీపీ అధ్యక్షుడు ఎన్‌టీఆర్ ఆఫీసు నుంచి ఫోన్ వస్తే నాచారం స్టూడియోకు వెళ్లినా. అక్కడికెళ్తే తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఇసుక కుప్పల్లో, చెట్ల కింద కూర్చొని ఉన్నారు. దేవుడి గుడి దగ్గర బిచ్చగాళ్లు కూర్చున్నట్లే పరిస్థితి కనిపించింది. నాకు కళ్లు తిరిగినయ్. ఒక టెంట్, కొన్ని కుర్చీలు వేస్తే ఏమవుతది?ఇదీతెలంగాణ నాయకులకు ఆంధ్ర పార్టీలు ఇచ్చే గౌరవం’ అని తన అనుభవాన్ని చెప్పారు.
రాజ్యాంగ విలువలు పతనం : జస్టిస్ సుదర్శన్‌డ్డి
న్యాయ వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌డ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు పతనమైపోయాయని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం ఎన్ని రాష్ట్రాలైనా చేసుకోవచ్చని, కాని రాజ్యాంగానికి గౌరవం లేకుండా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మళ్లీ రాక్షస క్రీడ ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. కన్సెన్సస్, పీపుల్ ఒపీనియన్ వంటి పదాలు రాజ్యాంగంలో లేవన్నారు. ఏవీ విద్యా సంస్థల చైర్మన్ కే ప్రతాప్‌డ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌డ్డి, ప్రొఫెసర్ .రజాక్ ఖురేషీ, విద్యావేత్త మహబూబ్ ఆలం ఖాన్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, కేవీ రాంచందర్‌డ్డి, కేవీ విశ్వేశ్వర్‌డ్డి, ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, మాజీ స్పీకర్ కేతిడ్డి సురేష్‌డ్డి, పీ నర్సాడ్డి, గోపాల్‌డ్డి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు అనుకూలమో.. కాదో ఆ మూడు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో తేల్చేయాలి. తెలంగాణలో పాదయావూతలు చేస్తున్న తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నాయకులు తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా తెలియచేయాలి.
                                                - ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత

పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమో.. వ్యతిరేకమో తేల్చిచెప్పాలి. కప్పదాటు వైఖరిని కనబరుస్తున్న కాంగ్రెస్‌కు ఇకపై తెలంగాణలో మనుగడ ఉండదు. టీడీపీ, వైఎస్సార్సీపీలు తమ పాదయావూతల ద్వారా తెలంగాణకు అనుకూలమని ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని వాటికి కట్టుబడి ఉండాలి. లేనిపక్షంలో క్విట్ తెలంగాణ ఉద్యమం తప్పదు.
                                                        - హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

 అఖిలపక్ష సమావేశానికి వెళ్లే విషయంపై జాతీయ నాయకత్వంతో చర్చిస్తా. 19న నిర్వహించే పార్టీ కోర్‌కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు. గతంలో నిర్వహించిన సమావేశాలకు వెళ్లి అభివూపాయం చెప్పి నా.. ఆ పార్టీ తన నిర్ణయం చెప్పలేదు. ఎఫ్‌డీఐల అమలు విన్యాసాల్లో ఈ అఖిలపక్ష సమావేశం కూడా ఒకటి. 
                                                                 -కిషన్‌డ్డి, బీజేపీ అధ్యక్షుడు

కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు కచ్చితంగా తెలంగాణకు అనుకూలంగా ప్రజల ఆకాంక్షలను తెలియజేయాలి. తెలంగాణలోని ఆయా పార్టీల నేతలు ఒకే అభివూపాయాన్ని చెప్పాలని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి చేయాలి. ఈ విషయంలో ప్రజలలో విశ్వాసం పెంచాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే.
                                               - ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ చైర్మన్

కాంగ్రెస్ మరోసారి తన కపటబుద్ధిని చాటుకుంది. ఆ పార్టీ తెలంగాణ విషయంలో దోకేబాజీ రాజకీ యం చేస్తోంది. అఖిలపక్ష సమావేశానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులు వెళ్లినా.. పార్టీలన్నీ ఏదో ఒకటే అభివూపాయం చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలి.
                                        -నాగం, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు

Wednesday 12 December 2012