Tuesday 20 August 2013

సమైక్యమా సిగ్గుపడు


* తెలంగాణవారికి వైద్యం చేసేది లేదంటూ దౌర్జన్యం
* విజయవాడలో భూమికొన్నాడని తరిమేశారు.. భంగపడ్డ వరంగల్
     వాసి 
* గుంటూరులో ఖమ్మం ఏఎన్‌ఎంలకు ఇబ్బందులు
* శ్రీశైలం వెళ్తున్న బస్సును అడ్డుకుని బీభత్సం

 మొన్న గుంటూరులో తెలంగాణ అధికారి హన్మంతునాయక్‌కు ఎదురైన పరాభవం మర్చిపోకముందే.. విశాఖపట్నంలో నిజామాబాద్‌కు చెందిన నవీన్‌పై పడిన దెబ్బలు సలుపుతుండగానే.. తిరుపతిలో తాజాగా కాంగ్రెస్ నేత వీ హన్మంతరావుపై జరిగిన దాడి కళ్లముందు కదలాడుతుండగానే.. 

ఐక్యత ముసుగు వేసుకున్న విద్వేషకారుల ఉన్మత్త చేష్టలు మరికొన్ని వెలుగు చూశాయి! ‘మీరు తెలంగాణోళ్లా? తెలంగాణ అంటేనే మా రాయలసీమవాళ్లకు పరమ అసహ్యం.. మీరే కాదు.. మీ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా.. ఇదే పరిస్థితి తప్పదు! చస్తే చావండి.. అంతేకానీ.. ఇక్కడ మీకు వైద్యం చేసే సమస్యేలేదు!’ అంటూ రాయలసీమలోని కర్నూలు ఆస్పత్రిలో ఒక వైద్యురాలు నవమాసాలు నిండి కాన్పుకోసం వచ్చిన మహిళను గెంటేసింది! తెలంగాణేతరులు తెలంగాణ జిల్లాల్లో భూములు కొనుక్కోవచ్చు. కానీ.. ఒక తెలంగాణ పౌరుడు సీమాంధ్రలో స్థలం కొంటే? ఏం జరుగుతుందో ప్రత్యక్ష సాక్షి.. వరంగల్ జిల్లా డోర్నకల్ వాసి నాగేశ్వరరావు. తెలంగాణ నుంచి వచ్చి.. విజయవాడలో భూమి కొన్నందుకు ఆ కుటుంబాన్ని తన్ని తరిమేశారు ‘సమైక్య’వాదులు! తెల్లారేసరికి ఊరొదిలి వెళ్లకపోతే అంతు చూస్తామని బెదిరించడంతో చేసేదిలేక ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని సొంతూరు చేరుకున్నాడు! శిక్షణ కోసం గుంటూరు వెళ్లిన ఖమ్మం జిల్లా ఏఎన్‌ఎంలను నానా ఇబ్బందులకు గురి చేశారు అక్కడి సీమాంధ్ర సిబ్బంది! ఇక దేవుడి దగ్గరకు వెళ్లాలన్నా వీసా కావాల్సిన పరిస్థితి సృష్టించారు శ్రీశైలం సమీపంలో! ఒక వైపు సమైక్యవాదం అంటూనే..

విద్వేషాగ్నిని చిమ్ముతున్న సీమాంధ్ర ఆందోళనకారుల అసలు స్వరూపాలివి.. వారి చేతిలో అవమానాలకు గురైన తెలంగాణవారి గోసలివి! 

శత్రువుకైనా.. శత్రుదేశ ఉగ్రవాదికైనా మానవత్వంతో చికిత్స చేసే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఒక వైద్యాధికారిణి నోటి నుంచి విద్వేషాగ్ని వెలువడింది. తనకు గతంలో రెండు పురుళ్లు ఇక్కడే పోసిన కృతజ్ఞతాభావంతో మళ్లీ అదే ఆస్పవూతిని నమ్ముకుని వచ్చిన నిండు గర్భిణీని చీదరించుకుని పంపేశారు. ఈ ఘటన జరిగింది కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో! ఈ దారుణ వివక్షను ఎదుర్కొన్నది మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ! నేడో రేపో ప్రసవం అవుతుందన్న పరిస్థితుల్లో అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆమెను అక్కడి మహిళా వైద్యురాలు మెడపట్టి బయటకు గెంటేసిన వైనమిది. తన ఇంటావిడ నిండు గర్భంతో ఉందని, వైద్యం చేయాలని భర్త తిరుమలేష్ మొరపెట్టుకుంటూ కాళ్లావేళ్లా పడినా.. ఆ వైద్యురాలు పట్టించుకోలేదు! నిండు చూలాలు కూడా ప్రాధేయపడినా.. పవిత్ర వృత్తికారిణి మనసు కరుగలేదు. కేవలం అయిజ నుంచి వచ్చామన్న ఒకే ఒక్క సమాధానంతో వారిది తెలంగాణ ప్రాంతమని గుర్తించిన వైద్యురాలు.. తాను ఒక మహిళనేనన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. గద్దించి తరిమేసిన వైనంతో ఆ దంపతు బిక్కచచ్చిపోయారు! చేసేదేమీలేక గద్వాల ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు ఆమెకు అవసరమైన సేవలందిస్తున్నారు.

కాళ్లావేళ్లాపడినా కనికరించలేదు: గర్భిణి గోవిందమ్మ
‘ఇంతకు ముందు అదే ఆస్పత్రిలో నాకు రెండు కాన్పులయ్యాయి. మూడో కాన్పు కూడా అక్కడే చేసుకోవాలనుకున్నాను. అందులో పరిస్థితి కాస్త బేజారుగా ఉంది. అందుకని ఆ ఆస్పత్రినే నమ్ముకున్నా. కానీ అప్పటిలా డాక్టర్లు లేరు. కాన్పు కోసం వెళ్తే.. కనీసం మెట్లు కూడా ఎక్కనివ్వకుండా ఆ ఆడ డాక్టర్ మెడబెట్టి గెంటేసింది. కాళ్లావేళ్లాపడినా.. ‘తెలంగాణ అంటే అసహ్యం. మీకు మేం వైద్యం ఎందుకు అందించాలి?’ అంటూ దారుణంగా మాట్లాడి పంపేసింది. చాలా బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితి ఇలాగే సాగితే చాలా కష్టం’.

వాళ్లది సీమ అహంకారం: గర్భిణీ భర్త తిరుమలేష్
‘నా భార్య గోవిందమ్మను కాన్పు కోసం కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యం అందించాల్సిన అక్కడి వైద్యురాలు రాయలసీమ అహంకారంతో చాలా దురుసుగా ప్రవర్తించారు. మీ రాయలసీమకు చెందిన ఎంతో మంది రోగులకు మా తెలంగాణలోని హైదరాబాద్‌లో చికిత్స చేస్తుంటే.. మీరు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని గట్టిగా అడిగితే ఇంకా దురుసుగా మాట్లాడింది. చేసేదేమీ లేక నా భర్యను గద్వాల ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఇలాంటి పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి’.

ఖమ్మం ఏఎన్‌ఎంలపై సీమాంద్రుల దాష్టీకం
వాళ్లు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏఎన్‌ఎంలు. ఇన్‌సర్వీసులో భాగంగా 42 రోజులపాటు ఎల్‌హెచ్‌వీ శిక్షణ కోసం గుంటూరు వెళ్లారు! ఆగస్టు 5న వెళ్లినవారు.. వచ్చే నెల 14 వరకూ అక్కడే ఉండాల్సి ఉంది! కానీ.. ఈలోపే ఈ నెల 12 నుంచి ఏపీ ఎన్జీవోలు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సమ్మె మొదలు పెట్టారు. అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి వచ్చారన్న పేరుతో వారిని నానా ఇబ్బందులకు గురి చేయడం మొదలైంది. శిక్షణ ఇచ్చే సిబ్బంది.. ఇతర ఏపీ ఎన్జీవోలు దాష్టీకాలకు పాల్పడ్డారు. ఎప్పుడుపడితే అప్పుడు తమ గదులకు కరెంటు సరఫరా నిలిపివేవారని పలువురు ఏఎన్‌ఎంలు వాపోయారు. నీటి సరఫరా కూడా ఆపేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖమ్మం జిల్లా టీజేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్రులు అసహనంతో తెలంగాణ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

భూమి కొన్నాడని తరిమేశారు
తెలంగాణేతరులు తెలంగాణ జిల్లాల్లో భూములు కొనుక్కోవచ్చు. కానీ.. ఒక తెలంగాణ పౌరుడు సీమాంవూధలో స్థలం కొంటే? ఏం జరుగుతుందో ప్రత్యక్ష సాక్షి.. వరంగల్ జిల్లా డోర్నకల్ వాసి నాగేశ్వరావు. తెలంగాణ నుంచి వచ్చి.. విజయవాడలో భూమి కొన్నందుకు ఆ కుటుంబాన్ని తన్ని తరిమేశారు ‘సమైక్య’వాదులు. తెల్లారేసరికి ఊరొదిలి వెళ్లకపోతే అంతు చూస్తామని బెదిరించడంతో చేసేది లేక ఆయన తన భార్య, ఇద్దరు పిల్లను కుటుంబాన్ని వెంటపెట్టుకుని సొంతూరు చేరుకున్నాడు. జరిగిన ఘటనపై ఆయనను ఆరా తీస్తే.. సమైక్యాంధ్రుల అరాచకాన్ని ఆయన ఇలా వివరించారు.. ‘నా పేరు లక్కాకుల నాగేశ్వరరావు, మాది డోర్నకల్. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నేను, నా కుటుంబం విజయవాడకు వెళ్లాం. అక్కడ ఓ రెస్టాంట్‌లో పనిచేసేవాడిని. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి (సంధ్య) ఎనిమిదో తరగతి చదువుతోంది. అబ్బాయి కృష్ణసాయి ఏడో తరగతి చదువుతున్నారు. కూలీనాలి చేసుకొనైనా చదివిస్తామనుకున్నాం. వాళ్లను మంచిగా చదివించుకుంటున్నం. సంపాదించిన దాంట్లో కొంత పొదుపుచేసుకొని ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్ (గాజులపేట) దగ్గర నేను, మోహన్‌దాస్ అనే మరో వ్యక్తి కలిసి చాలా రోజుల క్రితమే సెంటుంబావు భూమిని కొనుకున్నాం. అక్కడి దాకా బాగానే ఉంది. మొన్నీ మధ్య తెలంగాణ ఇస్తున్నారని తెలిసినప్పటి నుంచి వాడు (మోహన్‌దాస్) నాపై గొడవలకు దిగుడు మొదలుపెట్టిండు.

తెలంగాణ ఇస్తున్నామని చెప్పినప్పటి నుంచి వారి అరాచకం ఎక్కువైంది. చెప్పరాని బూతులు తిడుతూ ‘అరె తెలంగాణోడా నీకు ఇక్కడ భూమి ఎక్కడిదిరా? ఇక్కడి నుంచి తెల్లారేసరికి పోవాల్సిందే. లేదంటే నీ అంతు చూస్తా. నిన్ను చంపిపారేస్త. ఎవడు అడ్డొస్తడో చూస్తా’ అని నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా ఓ రోజురాత్రి నేను పనిచేసే బార్‌లోకి వచ్చి నాపై పెట్రోల్ పోసి చంపుతానని బెదించాడు. బార్ యజమాని జంపాల సీతారామయ్య ‘బయటికి వెళ్లి తన్నుకోండి’ అంటూ నెట్టేశాడు. బయటికి వచ్చి చెప్పుకునే నాథుడు లేక ఏంచేయాలో తోచక నా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. అంతకుముందు భూతగాదా ఉందని పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లూ పట్టించుకోలేదు. పైపెచ్చు మా కుటుంబం గురించి అన్యాయంగా మాట్లాడారు. పెద్దమనుషుల దగ్గరికి పోతే వాళ్లూ న్యాయం చేయలేదు. వాడు ‘నిన్నూ, నీ పిల్లల్ని ఎన్నటికైనా చంపుతాను’ అని బెదిరించడంతో ఉన్నపళంగా అక్కడి నుంచి డోర్నకల్ వచ్చాను. మా తమ్ముడిపెళ్లుంది. అయిపోయాక ఇక్కడి నుంచి కొంతమందిని తీస్కపోయి న్యాయం కోసం పోరాడుతా’ 

బస్సును తగలబెడతామన్నారు
ఆంధ్రా బస్సులు తెలంగాణలో యథేచ్ఛగా తిరగొచ్చు.. కానీ.. తెలంగాణ బస్సులు ఆంధ్రా ప్రాంతానికి వెళితే? తగలబెడతామంటారు. దిగితే చంపుతామని బెదిరిస్తారు. అందుకు నిదర్శనం.. మెదక్ నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సును సమైక్యాంధ్ర ఉద్యమకారులు శ్రీశైలానికి 8 కిలోమీటర్ల ముందు సున్నిపెంట వద్ద ఆపి.. హంగామా సృష్టించిన తీరు! వెనక్కు వెళ్లిపోవాలని ఆందోళనకారులు బెదిరించడంతో భయపడిన బస్సు డ్రైవరు, కండక్టరు..

బెంబేలెత్తిన ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ తిరిగొచ్చేశారు. తాము ఎదుర్కొన్న అనుభవాన్ని టీ మీడియాకు ఫోన్‌లో వివరించారు. సున్నిపెంట వద్ద ఆందోళన చేస్తున్న వారు సికింద్రాబాద్ డిపోకు చెందిన ఒక బస్సును ఆపి ఉంచారని, దాంతో తాను తన బస్సును కొంచెం దూరంగా నిలిపానని సంగారెడ్డికి చెందిన బస్సు డ్రైవర్ కిష్టయ్య తెలిపారు. కొత్త బస్సు కావడంతో ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేస్తారని భయపడిపోయానని చెప్పారు. ‘నన్ను, కండక్టర్‌ను బయటకు లాగి.. ‘సిగ్గు, శరం లేదా? పెళ్ళాం, పిల్లలు లేరా?’ అంటూ చెప్పడానికి వీలులేని బూతులు తిట్టారు. ఇటువైపు రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మీకు భయం లేదురా? అంటు కొట్టే ప్రయత్నం చేశారు. మొదటి సారి వచ్చాం. మమ్మల్ని కొట్టొద్దని కాళ్ళావేళ్ళా పడ్డా వినిపించుకోలేదు. బస్సు లోపల.. బయట కేసీఆర్‌ను తిడుతూ పిచ్చిరాతలు రాశారు. ‘బస్సును తగలబెడతాం. మిమ్మల్ని ఇక్కడే పాతిపెడతాం’ అని బెదిరించడంతో వణికిపోయాం. గంటసేపటికి మమ్మల్ని తిరిగి పంపించేశారు’ అని ఆయన చెప్పారు. తనను, బస్సును తగులబెడతామని బెదిరించారని కండక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ‘ఎస్‌ఆర్ బుక్కు లాక్కుని జై సమైక్యంధ్ర అని రాశారు. డ్రైవర్ వద్ద ఉన్న లాగ్‌షీట్ లాక్కుని దానిపైకూడా సమైక్యాంధ్ర అని రాశారు. ఇప్పటికైతే బతికిపోతున్నారు. మళ్ళీవస్తే ప్రాణాలతో వెళ్ళరు’ అంటూ కొట్టేప్రయత్నం చేశారు. ఎంత ఉద్యమం చేసినా ప్రాణాలు తీస్తామంటూ బెదిరించడం ఎంత వరకు న్యాయం? ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి’ అని వెంక అన్నారు. 

ప్రయాణికులని కూడా చూడలేదు
‘బస్సు తగలబెడతామంటూ సమైక్యవాదులు ఆందోళన చేయడంతో మా పిల్లలు భయంతో వణికిపోయారు. నేను కిందకి దిగి పిల్లలు భయపడిపోతున్నారని చెప్పినప్పటికీ నువ్వెవ్వడిరా చెప్పడానికి అంటూ బెదిరించారు’ అని సంగారెడ్డికి చెందిన ప్రయాణికుడు పీఎంఎం రావు చెప్పారు. ‘మీ ఊరేదిరా? ఇక్కడకు ఎందుకు వస్తున్నారురా? అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. కండక్టర్ల మీదకు వెళుతుంటే అడ్డుకోబోయాం. దానికి ‘వాడిని తన్నండిరా’ అంటూ తిట్టారు. సమైక్యాంధ్రవాదులు చేస్తున్న ఇటువంటి ఆందోళనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని ఆయన అన్నారు. బస్సు ఆపేయడంతో ఆటోలో శ్రీశైలం వెళ్లామని ఈ బస్సులో ప్రయాణించిన వాణిశ్రీ తెలిపారు. తన భర్త కిందికి దిగి.. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఆయనను కొట్టాలని చూశారని తెలిపారు. తాము తెలంగాణ యాస మాట్లాడుతుండటంతో ప్రైవేటు వాహనాల వాళ్లు కూడా తమను ఎక్కించుకోలేదని, ఇంత దారుణం ఎక్కడా చూడలేదని వాపోయారు.


సీమాంధ్ర ఉద్యమానికి తెలంగాణ కార్మికుల జీతాలు
- వ్యతిరేకించిన కార్మికులు.. బెదిరించిన యాజమాన్యం
బొల్లారం, ఆగస్టు 19 (టీ మీడియా): సీమాంధ్ర ఉద్యమానికి తెలంగాణ కార్మికుల అనుమతి లేకుండానే వారి జీతాన్ని విరాళంగా ఓ ప్రైవేటు కంపెనీ ఇచ్చింది. మా జీతాలు ఎందుకు ఇచ్చారని తెలంగాణ ఉద్యోగులు అడిగితే.. ఈ నెల జీతాలు రావు.. ఏం చేసుకుంటారో చేసుకొండి అంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగుతున్నది. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని హెచ్‌బీఎల్(హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్) ప్రైవేట్ కంపెనీలో యాజమాన్యం.. ఆది నుంచి తెలంగాణ ఉద్యోగులపై చులకన భావనతోనే వ్యవహరిస్తోంది. తమ కష్టార్జితాన్ని దోచుకోవడమేనా? సమైక్య ఉద్యమస్ఫూర్తి అని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment