Monday, 15 April 2013

పుడమి తల్లి పరిరక్షణకు ఎర్త్ అవర్...

     

           ఈ విశ్వంలో ప్రాణికోటికి ఆవాసంగా ఉన్నది భూమి ఒక్కటే. ఆ ఒక్క భూమిపై కూడా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత విషమిస్తే మానవ మనుగడకు కూడా ప్రమాదమే. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో కర్భన వాయువుల కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన ఏర్పరచడానికి చేపట్టిన కార్యక్రమమే ‘ఎర్త్ అవర్’
- ఎర్త్ అవర్ కార్యక్రమం మొదటిసారిగా 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ ఎర్త్ అవర్ కార్య క్రమాన్ని ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహిస్తారు.
- 2013 మార్చి 23 రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు పాటించాయి.
- ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో గంటసేపు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటు అందించినట్లయింది. భారతదేశంలో ఎర్త్‌అవర్ కార్య్రక్రమాన్ని మొదటిసారిగా 2009లో పాటించారు.
- డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్ సీఈఓ ఆండీ రిడ్లే ప్రపంచ ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచడంలో విజయం సాధించారు. దీనికి ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్న దేశాలు, పెరుగుతున్న ప్రజల మద్దతే నిదర్శనం.
- హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి మెట్రోనగరాలతోపాటు చిన్న, మధ్యతరహా పట్టణాలను కూడా ఎర్త్ అవర్‌లో భాగస్వామ్యం పంచుకునేలా చేయగలిగారు.
-2011లో ఎర్త్‌అవర్‌లో 120 కోట్ల మంది పాల్గొనగా, 2012లో 180 కోట్ల మంది పాల్గొన్నారు. కాగా 2013లో ధరిత్రి పరి రక్షణకు సంఘీభావం ప్రకటించిన వారి సంఖ్య 200 కోట్లకు చేరుకుందని భావిస్తున్నారు.
-2013, మార్చి 23 ఎర్త్‌అవర్‌లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే ఆదా అయిన విద్యుత్ కొన్ని లక్షల యూనిట్లు ఉంటుందని అంచనా.
- ఈ సారి ఎర్త్‌అవర్‌లో పాలస్తీనా, ట్యునీసియా, సూరినాం, ఫ్రెంచ్ గయానా, సెయింట్ హలెనా, రువాండా దేశాలు తొలిసారిగా పాల్గొనడం విశేషం.
- అంతర్జాతీయంగా ఈ కార్యక్రమంలో కొన్ని కీలక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అవి గేట్ వే ఆఫ్ ఇండియా, సిడ్నీ ఒపెరా హౌస్, సిడ్నీ హర్డార్ బ్రిడ్జ్, కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్, ద టోక్యో టవర్, తైపీ 101, బీజింగ్‌లోని ప్రధాన ఒలింపిక్ స్టేడియం ద బర్డ్స్ నెస్ట్, బుర్జ్ ఖలీఫా, ఈఫిల్ టవర్, బకింగ్‌హామ్ ప్యాలెస్, అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, నయాగారా జలపాతం.
- ఇలా ప్రపంచవ్యాప్తంగా గంటపాటు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా పెరుగుతున్న ఉష్ణ్రోగతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యతను చాటుతారు. 2013, మార్చి 23న జరిగిన ఎర్త్ అవర్‌లో 150కిపైగా దేశాల్లో ఆరువేల నగరాల్లో పర్యావరణ ప్రేమికులు దీనిని పాటించారు.
- ఢిల్లీలోని ఇండియా గేట్, హుమాయూన్ టూంబ్, ఎర్రకోట, సెంట్రల్‌పార్క్‌వంటి ప్రముఖ ప్రాంతాలు ఎర్త్ అవర్‌ను పాటించాయి.
- వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధ్వర్యంలో సిడ్నీలో 2009లో 20 లక్షలమంది ప్రజలతో తొలిసారిగా మొదలయిన ఎర్త్ అవర్ కార్యక్రమం 2013 మార్చి 23 నాటికి 150 దేశాలకు పైగా విస్తరించింది.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
-‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ పర్యావరణ సంరక్షణ, పరిశోధనకు సంబంధించిన ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ.
- దీని పూర్వపు పేరు ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’.
- ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాలలో పనిచేస్తూ, 50 లక్షలకు పైగా మద్ధతుదారులతో 1,300 పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులకు మద్దతుగా నిలిచింది.
- ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పర్యావరణ వినాశనాన్ని ఆపి సంరక్షణ చేపట్టడం.
- ప్రస్తుతం ఈ సంస్థ జీవవైవిధ్యం అధికంగా ఉన్న అడవులు, మంచినీటి, మహాసముద్రాలు, తీర ప్రాంతాలలో జీవసంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతరించిపోతున్న జీవజాతులు, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి ఇతర అంశాలపై కూడా ఈ సంస్థ పనిచేస్తోంది.
- ఈ సంస్థను 1961 ఏప్రిల్ 29న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్లిట్జర్లాండ్‌లో ఉంది.
- ఈ సంస్థ మోటో ‘ఫర్ ఎ లివింగ్ ప్లానెట్’. 1986లో ఈ సంస్థ ‘వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్’ నుంచి ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’గా పేరు మార్చుకుంది.
- ఈ సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు యోలండ కోకబడ్సె. ఈ సంస్థ మస్కట్ ‘ఛిఛి’ అనే ఒక పండా.

Friday, 12 April 2013

‘1955- విశాలాంధ్ర తీర్మానం’ వెనుక..



-
జరిగింది చర్చ మాత్రమే..

- ఆమోదమూ లేదు.. ఓటింగూ జరగలేదు
- వాయిదాతో మంగళం పాడేశారు
- మద్దతు ప్రకటించిన వారిలో సింహభాగం తెలంగాణేతరులే
- గట్టిగా వ్యతిరేకించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- హైదరాబాద్ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టి.. ఫలితం తేలని..
   ఆమోదం పొందని ఏకైక తీర్మానం ఇదే
         
  
      1955నాటి విశాలాంధ్ర తీర్మానాన్ని మెజారిటీ ఓట్లతో హైదరాబాద్ అసెంబ్లీ ఆమోదించిందని ఆంధ్ర మేధావులు చెప్పే కథ.. శుద్ధ అబద్ధం. హైదరాబాద్ అసెంబ్లీ విశాలాంధ్ర అంశాన్ని చర్చించడం నిజం.. కానీ ఆ తీర్మానం ఆమోదం పొందలేదు.. ఓటింగు అంతకన్నా జరగలేదు. ఆ మాటకొస్తే ఆ చర్చ పూర్తికావడం కాదు కదా.. సభ కూడా అర్ధాంతరంగా వాయిదా పడింది. తర్వాత సమావేశాల్లో చర్చిద్దామని ప్రకటించినా.. ఆ తర్వాత అనేకసార్లు అసెంబ్లీ సమావేశమైనా.. ఆ తీర్మానం మాత్రం ఎటూ తేలని ఏకైక అనామక తీర్మానంగా చరిత్రలో నిలిచిపోయింది. కారణం ఏమిటి? అసలేం జరిగింది?
         దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు, ఆందోళనల నేపథ్యంలో 1953లో కేంద్రం ఫజల్ అలీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ(రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్.. మొదటి ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశమంతా పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి 1955లో కేంద్రానికి నివేదిక సమర్పించింది. దేశం మొత్తాన్ని పునర్నిర్మించే అంశమైనందున అభిప్రాయ సేకరణ కోసం అన్ని రాష్ట్రాలకు నాటి కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను పంపించింది. దీనిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల్లో శాసనసభలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి. కమిషన్ సిఫార్సులను కొన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయి.. కొన్ని వ్యతిరేకించాయి. మరికొన్ని తటస్తంగా ఉండిపోయాయి. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఈ నివేదికపై చర్చకోసం అటు ఆంధ్ర, ఇటు హైదరాబాద్ రెండు శాసనసభలు ఒకేరోజు అంటే 1955 నవంబర్ 25న సమావేశమయ్యాయి.
కర్నూలులో తహతహ
           కర్నూలులో సమావేశమైన ఆంధ్ర అసెంబ్లీ కమిషన్ సిఫార్సులు సమర్థిస్తూనే ఫజల్ అలీ చెప్పినట్టుగా 1961వరకు ఆగకుండా తక్షణం విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని తీర్మానించడమే కాకుండా తెలంగాణలో భిన్నాభిప్రాయాలు, భయాందోళనలు ఉన్నందున ఆ ప్రాంతానికి విశాలాంధ్రలో ప్రత్యేక రక్షణలు కల్పిస్తామని, తెలంగాణ అభివృద్ధిని ప్రత్యేక బాధ్యతగా తీసుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆంధ్ర ప్రాంతంలో విశాలాంధ్ర ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు లేకపోవడం, హైదరాబాద్‌లో కలిసిపోవాలనే తహ తహ ఉండడంతో కర్నూలు అసెంబ్లీలో చర్చ రెండు రోజుల్లో ముగిసింది. ఇందులో గమనార్హమైన విషయం ఏంటంటే ఇంత ముఖ్యమైన తీర్మానంపై చర్చ జరుగుతున్నా.. అసెంబ్లీలో సభ్యుల హాజరుసంఖ్య పలుచగా ఉంది. ఈ విషయాన్ని సభ్యుడొకరు స్పీకర్ దృష్టికి తెస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా. కానీ హైదరాబాద్ కథ భిన్నమైంది. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం విశాలాంధ్ర ఏర్పాటుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యవర్గం ‘విళాలాంధ్ర ఏర్పాటు జరుగుతుందని’ ప్రకటన చేస్తూనే, ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకతను దృష్టి ఉంచుకొని ‘అశ్వద్థామ హతః కుజరః’ అన్నచందంగా ‘ప్రజలు కోరుకుంటే...’ అనే పదాలు ఉపయోగించింది. ఫజల్ కమిటీ నివేదికపై చర్చకు శాసనసభ సమావేశమయ్యేనాటికే తెలంగాణ ఉద్రిక్తంగా మారింది. 
                 వరంగల్‌లో జరిగిన విశాలాంధ్ర సమావేశం రచ్చరచ్చయింది. రాళ్లదాడులు వీధిపోరాటాలకు వేదికైంది. వందల మంది విద్యార్థులను అరెస్టు చేశారు. చర్చకు ముందురోజే రాష్ట్రమంతా తెలంగాణ దినోత్సవం చేసి హర్తాళ్లు జరిపారు. హైదరాబాద్‌లో పాన్‌షాపుల నుంచి మొదలుకొని అన్ని వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులు చురుగ్గా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నంతకాలం రాజధానిలో కర్ఫ్యూ విధించి ప్రదర్శనలు, ఆందోళనలు నిషేధించారు. విశాలాంవూధను గట్టిగా సమర్థించే పీడీఎఫ్ సభ్యుల ఇళ్లకు పోలీసులు రక్షణ కల్పించారు. ఈ పరిస్థితుల్లో శాసనసభ సమావేశమైంది. శాసనసభలో పూర్తిస్థాయిలో హాజరు ఉండడంతోపాటు ప్రేక్షకుల గ్యాలరీ కిక్కిరిసిపోయింది. తొలిరోజు సభలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ‘ఫజల్ కమిషన్ సిఫార్సులను పరిశీలించాలని’ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ ప్రారంభమైంది. మరాఠ, కన్నడ ప్రాంతాలు మహారాష్ట్ర, మైసూరు రాష్ట్రాల్లో చేరడానికి దాదాపు ఏకాభివూపాయం వ్యక్తం చేయగా తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయాలన్న విషయంపై కొందరు సభ్యులు అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు.
                  మూడురోజులపాటు కొనసాగిన చర్చల్లో తీవ్రాతితీవ్రమైన విభేదాలు పొడసూపాయి. అసెంబ్లీలో విశాలాంధ్రపై ఏకాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం కనిపించలేదు. దీంతో విశాలాంధ్ర ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్న అధిష్ఠానం ఒక ఎత్తుగడగా బూర్గులతో విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని కోరుతూ తీర్మానం పెట్టించింది. వాస్తవానికి రాష్ట్ర భవితవ్యం నిర్ణయించే అంశం కావడం వల్ల కమిటీ నివేదికపై మాట్లాడుతున్నప్పుడు సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం మధ్యవర్తి పాత్ర వహించాల్సి ఉంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ప్రభుత్వమే ఓ వైఖరి తీసుకుని విశాలాంవూధకు మద్దతుగా రంగంలోకి దిగింది. సహజంగానే ప్రభుత్వాన్నేలే పార్టీ ప్రవేశపెట్టే ఏ తీర్మానానికైనా శాసనసభలో మెజార్టీ లభిస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే మొదటి మూడు రోజులు విశాలాంధ్ర అనుకూల వ్యతిరేక వాదనలు పోటాపోటీగా వినిపించగా అక్కడి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. మొదట్లో స్వేచ్ఛగా అభివూపాయాలు చెప్పే అవకాశం ఉండగా హఠాత్తుగా సీఎం విశాలాంవూధకు అనుకూల తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీంతో సీఎం వర్గం గొంతు మారింది. 
                         ఇదిలా ఉంటే ఈ తీర్మానం రూపకల్పన కోసం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాల్లో గందరగోళం చెలరేగింది. ఈ విషయమై సీఎల్పీలో రెండు రోజుల్లో దాదాపు 12గంటలపాటు వాదోపవాదాలు జరిగాయి. విశాలాంధ్ర తీర్మానానికి అధిష్ఠానం ఆమోదం ఉందా అని కేవీ రంగాడ్డి, చెన్నాడ్డి, బూర్గులను నిలదీశారు. ఏకపక్షంగా విశాలాంధ్ర కోరుతూ తీర్మానం పెట్టడమేమిటని ప్రశ్నించారు. అయితే బూర్గుల మాత్రం అంతకు ముందు కాంగ్రెస్ కార్యవర్గం చేసిన ప్రకటన మేరకే ఈ తీర్మానం పెడుతున్నామని, అధిష్ఠానం ఆదేశం కూడా ఉందని చెప్పుకున్నారు. పంజాబ్, పెప్సూ రాష్ట్రాల్లో తీర్మానాలేవీ లేకుండా చర్చలు జరుగుతున్నాయని, మధ్యవూపదేశ్‌లో కాంగ్రెస్ కార్యవర్గ తీర్మానం యథాతథంగా ప్రవేశపెట్టారని గుర్తుచేస్తూ.. అదే దారిలో అధిష్ఠానం ప్రకటన మేరకు ‘ప్రజలు కోరుకుంటే’ అనే పదాలను కూడా ఈ తీర్మానంలో చేర్చాలని చెన్నాడ్డి పట్టుబట్టారు. అయితే ఈ విషయం అధిష్ఠానంతో చెప్పిస్తేనే ఆ పదాలు చేర్చుతామని బూర్గుల భీష్మించారు. ఈ విషయమై చర్చించేందుకు కేవీ రంగాడ్డి, నిజామాబాద్ ఎంపీ హరిశ్చంద్ర హెడా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ చర్చల ఫలితం కూడా తేలకముందే మరుసటి రోజు బూర్గుల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. నిజానికి అప్పటికి తెలంగాణలోని సగానికిపైగా కాంగ్రెస్ సభ్యులు తెలంగాణ కావాలని కోరుతున్నారు. విశాలాంధ్ర తీర్మానం మీద కేవలం తెలంగాణ సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని, మరాఠ, కన్నడ ప్రాంతాల అభివూపాయం వద్దని పట్టుబడుతున్నారు. అప్పటికే అధిష్ఠానం కనుసన్నల్లో పనిచేస్తున్న బూర్గుల తన పంతం నెగ్గించుకునే క్రమంలో సభలో పెద్ద సంఖ్యలో ఉన్న కమ్యూనిస్టుల మద్దతుకుతోడు మరాఠ, కన్నడ సభ్యుల సహాయంతో తీర్మానం నెగ్గించుకునే ఎత్తుగడను అమలుచేశాడు. దాంతో సభలో విశాలాంధ్ర వాదనకు మద్దతు పెరుగుతూ వచ్చింది.
                   ఇదే సమయంలో ఢిల్లీలో కేవీ అధిష్ఠానాన్ని కలిశారు. బలవంతపు విశాలాంధ్ర తీర్మానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి తిరిగి వచ్చేశారు. అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తానని ప్రకటిస్తూనే మరోవైపు తెలంగాణ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. ఈ సమయంలో కేవీ తెలంగాణ కోసం ఉద్యమం లేవదీయనున్నారనే వదంతులు దావానలంలా వ్యాపించాయి. ఎత్తుగడలు ఎదురుతిరగడంతో పరిస్థితి చేజారుతుందని భావించిన అధిష్ఠానం పరిస్థితిని సమీక్షించి ‘తీర్మానం మీద ఎట్టి పరిస్థితిలోనూ ఓటింగు జరపరాదు’ అని బూర్గులకు సందేశం పంపిందనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎనిమిదో రోజు సభలో చర్చ అసంపూర్ణంగా ముగియగానే ‘రాష్ట్రంలో సౌదీ రాజు పర్యటన, నాగార్జునసాగర్ శంకుస్థాపన కోసం ప్రధాని నెహ్రూ పర్యటనలు ఉన్నందువల్ల’ చర్చను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిసెంబర్ 3న స్పీకర్ ప్రకటించారు. నిజానికి ఈ రెండు పర్యటనలుంటాయని సర్కారుకు ముందే తెలుసు. అయినా సభలు సమావేశపరిచి చర్చను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే ఈ లోపల విశాలాంధ్ర వాదులు సభలో జరిగిన చర్చలో సభ్యుల వాదనలను బట్టి విశాలాంధ్ర ఇంతమంది మద్దతు.. తెలంగాణకు ఇంతమంది అంటూ లెక్కలుగట్టి ప్రకటించుకున్నారు.
తీర్మానం కథ కంచికే..
       ఇక వాయిదా పడ్డ శాసనసభ మరుసటి సంవత్సరం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అయితే విశాలాంధ్ర తీర్మానం జోలికిపోలేదు. తొలిరోజు సమావేశంలోనే విశాలాంధ్ర చర్చను అనివార్య కారణాల వల్ల మార్చి 12కు వాయిదా వేస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఆ 12వ తేదీకి ముందే నెహ్రూ నిజామాబాద్ పర్యటనకు రావడం, అక్కడే విశాలాంధ్ర ఏర్పాటు ప్రకటన చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత మార్చి 12న జరిగిన శాసనసభ సమావేశంలోనూ ఈ తీర్మానం చర్చకు నోచుకోలేదు. కేంద్రం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపొందిస్తున్నదని, ఏప్రిల్ నెలలో ఆ బిల్లుతోపాటు విశాలాంవూధపై కూడా చర్చిద్దామంటూ తీర్మానంపై చర్చను ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. ఏప్రిల్‌నాటికి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటే ఖాయం కావడం వల్ల ఇక ఈ తీర్మానం మీద చర్చ జరగలేదు.. ఓటింగు అంతకన్నా జరగలేదు.. అదీ విశాలాంధ్ర తీర్మానం సంగతి!! 
- సవాల్‌డ్డి

Tuesday, 9 April 2013

ఆ మూడు పార్టీలను ఓడిస్తేనే తెలంగాణ..


- రాష్ట్రం రాకుంటే కట్టుబానిసలుగా బతకాల్సిందే 
- తెలంగాణ నేతలకు ఎన్నాళ్లీ డిప్యూటీ బతుకులు?
- జనగామలో నెల్లుట్ల రవీందర్‌రావు పదవీ విరమణ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

జనగామ: టీఆర్‌ఎస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీని గడగడలాడించాం, వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో ఆంధ్రోళ్లను అడుగుపెట్టనిస్తామా? 2009 డిసెంబర్ 7న తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన టీడీపీ, 9న అనుకూల ప్రకటన రాగానే 10న మాట తప్పింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ వద్దంటూ పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నడు, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి మోసం చేస్తూ ప్రజలను గోసపెడుతోంది. ఈ మూడు పార్టీలను ఓడిస్తేనే తెలంగాణ వస్తుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా జనగామలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నెల్లుట్ల రవీందర్‌రావు పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత రెండు ఎన్నికల్లో తెలంగాణ ఓడిపోయింది. పుష్కర కాలంగా ఉద్యమం చేస్తున్నాం. ఈసారి ఓడితే తెలంగాణ ఎప్పటికీ రాకపోగా ఆంధ్రోళ్ల పెత్తనంలో కట్టుబానిసలుగా బతకాల్సివస్తది. తెగతెంపుల సంకీర్ణాలు నడుస్తున్నాయి. ఉద్యమంతోపాటు ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగి శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. ఆంధ్ర పార్టీల్లో తెలంగాణవాళ్లు ఎప్పటికీ పార్టీ అధ్యక్షులు కారు, ముఖ్యమంత్రులు, శాసనసభ పక్షనాయకులు, కనీసం అసెంబ్లీ స్పీకర్లుగా కూడా కారు. ఎన్నాళ్లు డిప్యూటీలుగా బతకాలి. కొంత మంది సన్నాసులు, వెన్నెముకలేనోళ్లు ఆంధ్రోళ్ల తొత్తులుగా ఉన్నరు. పొన్నాల ఇంటి వెనకాల పొలం ఎండిపోతున్నా, ఆయన మాత్రం అంతా బాగా ఉందని హైదరాబాద్‌లో ప్రకటనలు చేస్తూ ఆంధ్రోళ్లకు తొత్తుగా మారాడు. ఇలాంటి వాళ్లను తిగిరి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారా? 
            విద్యావ్యవస్థ గురించి తెలియని ఐఏఎస్‌లు ఏసీ గదుల్లో కూర్చొని దిక్కుమాలిన పాలసీలతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. ఈ విధానాల ఫలితంగా 1200 పాఠశాలలు మాయమైనయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటది. కులాలవారీగా హస్టళ్లు ఉండవు. హాస్టల్స్ స్థానంలో రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి కుల,మత,జాతులనే తేడాలేకుండా ఒకే డ్రెస్ కోడ్, సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెడ్తం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాం. ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అవసరమైతే నెల్లుట్ల రవీందర్‌రావు వంటివారిని ఎమ్మెల్సీగా బరిలోకి దింపుతాం. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లుట్ల రవీందర్‌రావు దంపతులను కేసీఆర్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మొలుగూరి భిక్షపతి, పొలిట్‌బ్యూరో సభ్యులు కెప్టెన్ లక్షీకాంతరావు, రామగళ్ల పరమేశ్వర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎన్ సుధాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు బక్క నాగరాజు, టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.

Saturday, 6 April 2013

తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదు..

* ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ

హైదరాబాద్: తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. అది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుందని అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయని, ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కట్జూ అభిప్రాయపడ్డారు. ఆర్థిక అసమానతలు తగ్గాయని చెప్పారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను భారత్‌లో కలపాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Tuesday, 2 April 2013

అవి బలిదానాలు కావు .... రోగాలొచ్చి చనిపోయారు..


- వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు
- జాతీయ మీడియాతో పిచ్చాపాటిలో రేణుక 
- కరెంటు చార్జీల పెంపు సరైనదే
- వర్షాలు లేకే కరెంటు కష్టాలు
- వర్షాలొస్తే చార్జీలు తగ్గుతాయి
- విలేకరుల సమావేశంలో ఎంపీ వ్యాఖ్యలు
     వారు టీబీ, పోలియో, క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి రోగాలతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు....... 
        తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ఆత్మబలిదానాలను రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి దారుణంగా అపహాస్యం చేశారు. అవి ఆత్మబలిదానాలు కావని తేల్చారు. వివిధ రోగాలతో చనిపోయారని చెప్పారు. వాటినే తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యాలయంలో ఏప్రిల్ 1న  జరిగిన విలేకరుల సమావేశం అనంతరం వేదిక కింద ఆమె జాతీయ మీడియాతో కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోరుతూ దాదాపు వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారట కదా? అని జాతీయ మీడియా విలేకరులు రేణుక వద్ద ప్రస్తావించగా ఆమె బదులిస్తూ ‘అదేం లేదు. వారు టీబీ, పోలియో, క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి రోగాలతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు’ అంటూ తనదైన నిర్లక్ష్యపూరిత శైలిలో కొట్టిపారేశారు. అంతకుముందే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ తెలుగు మీడియాతో మాట్లాడి.. జాతీయ మీడియాతో మాత్రం అవి రోగాలతో జరిగిన చావుల కింద రేణుక లెక్కగట్టడం సంచలనం రేపింది. అంతకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేణుక.. తెలంగాణలో ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదన్న కేసీఆర్ విమర్శలపై ఆమె ఎదురుదాడి చేశారు. దుకాణాలు పెట్టి డబ్బు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ ఏమైనా డబ్బులు ఇచ్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయం కేసీఆర్‌నే అడిగి తెలుసుకోవాలని రేణుక సమాధానమిచ్చారు. కేసీఆర్ నాలుకకు నరం లేదని, ఆయన ఎట్లాగైనా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని, తెలంగాణలో తిరిగి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.