Friday 12 April 2013

‘1955- విశాలాంధ్ర తీర్మానం’ వెనుక..



-
జరిగింది చర్చ మాత్రమే..

- ఆమోదమూ లేదు.. ఓటింగూ జరగలేదు
- వాయిదాతో మంగళం పాడేశారు
- మద్దతు ప్రకటించిన వారిలో సింహభాగం తెలంగాణేతరులే
- గట్టిగా వ్యతిరేకించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- హైదరాబాద్ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టి.. ఫలితం తేలని..
   ఆమోదం పొందని ఏకైక తీర్మానం ఇదే
         
  
      1955నాటి విశాలాంధ్ర తీర్మానాన్ని మెజారిటీ ఓట్లతో హైదరాబాద్ అసెంబ్లీ ఆమోదించిందని ఆంధ్ర మేధావులు చెప్పే కథ.. శుద్ధ అబద్ధం. హైదరాబాద్ అసెంబ్లీ విశాలాంధ్ర అంశాన్ని చర్చించడం నిజం.. కానీ ఆ తీర్మానం ఆమోదం పొందలేదు.. ఓటింగు అంతకన్నా జరగలేదు. ఆ మాటకొస్తే ఆ చర్చ పూర్తికావడం కాదు కదా.. సభ కూడా అర్ధాంతరంగా వాయిదా పడింది. తర్వాత సమావేశాల్లో చర్చిద్దామని ప్రకటించినా.. ఆ తర్వాత అనేకసార్లు అసెంబ్లీ సమావేశమైనా.. ఆ తీర్మానం మాత్రం ఎటూ తేలని ఏకైక అనామక తీర్మానంగా చరిత్రలో నిలిచిపోయింది. కారణం ఏమిటి? అసలేం జరిగింది?
         దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు, ఆందోళనల నేపథ్యంలో 1953లో కేంద్రం ఫజల్ అలీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ(రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్.. మొదటి ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశమంతా పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి 1955లో కేంద్రానికి నివేదిక సమర్పించింది. దేశం మొత్తాన్ని పునర్నిర్మించే అంశమైనందున అభిప్రాయ సేకరణ కోసం అన్ని రాష్ట్రాలకు నాటి కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను పంపించింది. దీనిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల్లో శాసనసభలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి. కమిషన్ సిఫార్సులను కొన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయి.. కొన్ని వ్యతిరేకించాయి. మరికొన్ని తటస్తంగా ఉండిపోయాయి. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఈ నివేదికపై చర్చకోసం అటు ఆంధ్ర, ఇటు హైదరాబాద్ రెండు శాసనసభలు ఒకేరోజు అంటే 1955 నవంబర్ 25న సమావేశమయ్యాయి.
కర్నూలులో తహతహ
           కర్నూలులో సమావేశమైన ఆంధ్ర అసెంబ్లీ కమిషన్ సిఫార్సులు సమర్థిస్తూనే ఫజల్ అలీ చెప్పినట్టుగా 1961వరకు ఆగకుండా తక్షణం విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని తీర్మానించడమే కాకుండా తెలంగాణలో భిన్నాభిప్రాయాలు, భయాందోళనలు ఉన్నందున ఆ ప్రాంతానికి విశాలాంధ్రలో ప్రత్యేక రక్షణలు కల్పిస్తామని, తెలంగాణ అభివృద్ధిని ప్రత్యేక బాధ్యతగా తీసుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆంధ్ర ప్రాంతంలో విశాలాంధ్ర ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు లేకపోవడం, హైదరాబాద్‌లో కలిసిపోవాలనే తహ తహ ఉండడంతో కర్నూలు అసెంబ్లీలో చర్చ రెండు రోజుల్లో ముగిసింది. ఇందులో గమనార్హమైన విషయం ఏంటంటే ఇంత ముఖ్యమైన తీర్మానంపై చర్చ జరుగుతున్నా.. అసెంబ్లీలో సభ్యుల హాజరుసంఖ్య పలుచగా ఉంది. ఈ విషయాన్ని సభ్యుడొకరు స్పీకర్ దృష్టికి తెస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా. కానీ హైదరాబాద్ కథ భిన్నమైంది. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం విశాలాంధ్ర ఏర్పాటుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యవర్గం ‘విళాలాంధ్ర ఏర్పాటు జరుగుతుందని’ ప్రకటన చేస్తూనే, ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకతను దృష్టి ఉంచుకొని ‘అశ్వద్థామ హతః కుజరః’ అన్నచందంగా ‘ప్రజలు కోరుకుంటే...’ అనే పదాలు ఉపయోగించింది. ఫజల్ కమిటీ నివేదికపై చర్చకు శాసనసభ సమావేశమయ్యేనాటికే తెలంగాణ ఉద్రిక్తంగా మారింది. 
                 వరంగల్‌లో జరిగిన విశాలాంధ్ర సమావేశం రచ్చరచ్చయింది. రాళ్లదాడులు వీధిపోరాటాలకు వేదికైంది. వందల మంది విద్యార్థులను అరెస్టు చేశారు. చర్చకు ముందురోజే రాష్ట్రమంతా తెలంగాణ దినోత్సవం చేసి హర్తాళ్లు జరిపారు. హైదరాబాద్‌లో పాన్‌షాపుల నుంచి మొదలుకొని అన్ని వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులు చురుగ్గా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నంతకాలం రాజధానిలో కర్ఫ్యూ విధించి ప్రదర్శనలు, ఆందోళనలు నిషేధించారు. విశాలాంవూధను గట్టిగా సమర్థించే పీడీఎఫ్ సభ్యుల ఇళ్లకు పోలీసులు రక్షణ కల్పించారు. ఈ పరిస్థితుల్లో శాసనసభ సమావేశమైంది. శాసనసభలో పూర్తిస్థాయిలో హాజరు ఉండడంతోపాటు ప్రేక్షకుల గ్యాలరీ కిక్కిరిసిపోయింది. తొలిరోజు సభలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ‘ఫజల్ కమిషన్ సిఫార్సులను పరిశీలించాలని’ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ ప్రారంభమైంది. మరాఠ, కన్నడ ప్రాంతాలు మహారాష్ట్ర, మైసూరు రాష్ట్రాల్లో చేరడానికి దాదాపు ఏకాభివూపాయం వ్యక్తం చేయగా తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయాలన్న విషయంపై కొందరు సభ్యులు అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు.
                  మూడురోజులపాటు కొనసాగిన చర్చల్లో తీవ్రాతితీవ్రమైన విభేదాలు పొడసూపాయి. అసెంబ్లీలో విశాలాంధ్రపై ఏకాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం కనిపించలేదు. దీంతో విశాలాంధ్ర ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్న అధిష్ఠానం ఒక ఎత్తుగడగా బూర్గులతో విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని కోరుతూ తీర్మానం పెట్టించింది. వాస్తవానికి రాష్ట్ర భవితవ్యం నిర్ణయించే అంశం కావడం వల్ల కమిటీ నివేదికపై మాట్లాడుతున్నప్పుడు సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం మధ్యవర్తి పాత్ర వహించాల్సి ఉంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ప్రభుత్వమే ఓ వైఖరి తీసుకుని విశాలాంవూధకు మద్దతుగా రంగంలోకి దిగింది. సహజంగానే ప్రభుత్వాన్నేలే పార్టీ ప్రవేశపెట్టే ఏ తీర్మానానికైనా శాసనసభలో మెజార్టీ లభిస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే మొదటి మూడు రోజులు విశాలాంధ్ర అనుకూల వ్యతిరేక వాదనలు పోటాపోటీగా వినిపించగా అక్కడి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. మొదట్లో స్వేచ్ఛగా అభివూపాయాలు చెప్పే అవకాశం ఉండగా హఠాత్తుగా సీఎం విశాలాంవూధకు అనుకూల తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీంతో సీఎం వర్గం గొంతు మారింది. 
                         ఇదిలా ఉంటే ఈ తీర్మానం రూపకల్పన కోసం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాల్లో గందరగోళం చెలరేగింది. ఈ విషయమై సీఎల్పీలో రెండు రోజుల్లో దాదాపు 12గంటలపాటు వాదోపవాదాలు జరిగాయి. విశాలాంధ్ర తీర్మానానికి అధిష్ఠానం ఆమోదం ఉందా అని కేవీ రంగాడ్డి, చెన్నాడ్డి, బూర్గులను నిలదీశారు. ఏకపక్షంగా విశాలాంధ్ర కోరుతూ తీర్మానం పెట్టడమేమిటని ప్రశ్నించారు. అయితే బూర్గుల మాత్రం అంతకు ముందు కాంగ్రెస్ కార్యవర్గం చేసిన ప్రకటన మేరకే ఈ తీర్మానం పెడుతున్నామని, అధిష్ఠానం ఆదేశం కూడా ఉందని చెప్పుకున్నారు. పంజాబ్, పెప్సూ రాష్ట్రాల్లో తీర్మానాలేవీ లేకుండా చర్చలు జరుగుతున్నాయని, మధ్యవూపదేశ్‌లో కాంగ్రెస్ కార్యవర్గ తీర్మానం యథాతథంగా ప్రవేశపెట్టారని గుర్తుచేస్తూ.. అదే దారిలో అధిష్ఠానం ప్రకటన మేరకు ‘ప్రజలు కోరుకుంటే’ అనే పదాలను కూడా ఈ తీర్మానంలో చేర్చాలని చెన్నాడ్డి పట్టుబట్టారు. అయితే ఈ విషయం అధిష్ఠానంతో చెప్పిస్తేనే ఆ పదాలు చేర్చుతామని బూర్గుల భీష్మించారు. ఈ విషయమై చర్చించేందుకు కేవీ రంగాడ్డి, నిజామాబాద్ ఎంపీ హరిశ్చంద్ర హెడా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ చర్చల ఫలితం కూడా తేలకముందే మరుసటి రోజు బూర్గుల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. నిజానికి అప్పటికి తెలంగాణలోని సగానికిపైగా కాంగ్రెస్ సభ్యులు తెలంగాణ కావాలని కోరుతున్నారు. విశాలాంధ్ర తీర్మానం మీద కేవలం తెలంగాణ సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని, మరాఠ, కన్నడ ప్రాంతాల అభివూపాయం వద్దని పట్టుబడుతున్నారు. అప్పటికే అధిష్ఠానం కనుసన్నల్లో పనిచేస్తున్న బూర్గుల తన పంతం నెగ్గించుకునే క్రమంలో సభలో పెద్ద సంఖ్యలో ఉన్న కమ్యూనిస్టుల మద్దతుకుతోడు మరాఠ, కన్నడ సభ్యుల సహాయంతో తీర్మానం నెగ్గించుకునే ఎత్తుగడను అమలుచేశాడు. దాంతో సభలో విశాలాంధ్ర వాదనకు మద్దతు పెరుగుతూ వచ్చింది.
                   ఇదే సమయంలో ఢిల్లీలో కేవీ అధిష్ఠానాన్ని కలిశారు. బలవంతపు విశాలాంధ్ర తీర్మానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి తిరిగి వచ్చేశారు. అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తానని ప్రకటిస్తూనే మరోవైపు తెలంగాణ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. ఈ సమయంలో కేవీ తెలంగాణ కోసం ఉద్యమం లేవదీయనున్నారనే వదంతులు దావానలంలా వ్యాపించాయి. ఎత్తుగడలు ఎదురుతిరగడంతో పరిస్థితి చేజారుతుందని భావించిన అధిష్ఠానం పరిస్థితిని సమీక్షించి ‘తీర్మానం మీద ఎట్టి పరిస్థితిలోనూ ఓటింగు జరపరాదు’ అని బూర్గులకు సందేశం పంపిందనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎనిమిదో రోజు సభలో చర్చ అసంపూర్ణంగా ముగియగానే ‘రాష్ట్రంలో సౌదీ రాజు పర్యటన, నాగార్జునసాగర్ శంకుస్థాపన కోసం ప్రధాని నెహ్రూ పర్యటనలు ఉన్నందువల్ల’ చర్చను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిసెంబర్ 3న స్పీకర్ ప్రకటించారు. నిజానికి ఈ రెండు పర్యటనలుంటాయని సర్కారుకు ముందే తెలుసు. అయినా సభలు సమావేశపరిచి చర్చను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే ఈ లోపల విశాలాంధ్ర వాదులు సభలో జరిగిన చర్చలో సభ్యుల వాదనలను బట్టి విశాలాంధ్ర ఇంతమంది మద్దతు.. తెలంగాణకు ఇంతమంది అంటూ లెక్కలుగట్టి ప్రకటించుకున్నారు.
తీర్మానం కథ కంచికే..
       ఇక వాయిదా పడ్డ శాసనసభ మరుసటి సంవత్సరం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అయితే విశాలాంధ్ర తీర్మానం జోలికిపోలేదు. తొలిరోజు సమావేశంలోనే విశాలాంధ్ర చర్చను అనివార్య కారణాల వల్ల మార్చి 12కు వాయిదా వేస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఆ 12వ తేదీకి ముందే నెహ్రూ నిజామాబాద్ పర్యటనకు రావడం, అక్కడే విశాలాంధ్ర ఏర్పాటు ప్రకటన చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత మార్చి 12న జరిగిన శాసనసభ సమావేశంలోనూ ఈ తీర్మానం చర్చకు నోచుకోలేదు. కేంద్రం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపొందిస్తున్నదని, ఏప్రిల్ నెలలో ఆ బిల్లుతోపాటు విశాలాంవూధపై కూడా చర్చిద్దామంటూ తీర్మానంపై చర్చను ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. ఏప్రిల్‌నాటికి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటే ఖాయం కావడం వల్ల ఇక ఈ తీర్మానం మీద చర్చ జరగలేదు.. ఓటింగు అంతకన్నా జరగలేదు.. అదీ విశాలాంధ్ర తీర్మానం సంగతి!! 
- సవాల్‌డ్డి

No comments:

Post a Comment