Tuesday 2 April 2013

అవి బలిదానాలు కావు .... రోగాలొచ్చి చనిపోయారు..


- వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు
- జాతీయ మీడియాతో పిచ్చాపాటిలో రేణుక 
- కరెంటు చార్జీల పెంపు సరైనదే
- వర్షాలు లేకే కరెంటు కష్టాలు
- వర్షాలొస్తే చార్జీలు తగ్గుతాయి
- విలేకరుల సమావేశంలో ఎంపీ వ్యాఖ్యలు
     వారు టీబీ, పోలియో, క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి రోగాలతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు....... 
        తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ఆత్మబలిదానాలను రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి దారుణంగా అపహాస్యం చేశారు. అవి ఆత్మబలిదానాలు కావని తేల్చారు. వివిధ రోగాలతో చనిపోయారని చెప్పారు. వాటినే తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యాలయంలో ఏప్రిల్ 1న  జరిగిన విలేకరుల సమావేశం అనంతరం వేదిక కింద ఆమె జాతీయ మీడియాతో కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోరుతూ దాదాపు వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారట కదా? అని జాతీయ మీడియా విలేకరులు రేణుక వద్ద ప్రస్తావించగా ఆమె బదులిస్తూ ‘అదేం లేదు. వారు టీబీ, పోలియో, క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి రోగాలతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు’ అంటూ తనదైన నిర్లక్ష్యపూరిత శైలిలో కొట్టిపారేశారు. అంతకుముందే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ తెలుగు మీడియాతో మాట్లాడి.. జాతీయ మీడియాతో మాత్రం అవి రోగాలతో జరిగిన చావుల కింద రేణుక లెక్కగట్టడం సంచలనం రేపింది. అంతకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేణుక.. తెలంగాణలో ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదన్న కేసీఆర్ విమర్శలపై ఆమె ఎదురుదాడి చేశారు. దుకాణాలు పెట్టి డబ్బు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ ఏమైనా డబ్బులు ఇచ్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయం కేసీఆర్‌నే అడిగి తెలుసుకోవాలని రేణుక సమాధానమిచ్చారు. కేసీఆర్ నాలుకకు నరం లేదని, ఆయన ఎట్లాగైనా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని, తెలంగాణలో తిరిగి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment