Monday 26 January 2015

ఘ‌నంగా గ‌ణ‌తంత్ర వేడుక‌లు.. ఆక‌ర్షణీయంగా తెలంగాణ శ‌కటం

                                      తెలంగాణ శకటం                              
స్తినలోని రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు రాజ్‌పథ్‌కు ఒబామా దంపతులు చేరుకున్నారు. ఒబామా దంపతులకు ప్రధాని మోడీ, హమీద్ అన్సారీ ఘన స్వాగతం పలికారు. ఒబామా వచ్చిన అనంతరం రాజ్‌పథ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేరుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ పాటు పలువురు కేంద్ర మంత్రులు రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, మిషెల్లి ఒబామా, ప్రధాని మోడీ, హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, షీలాదీక్షిత్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
అమర్ జవాన్ జ్యోతి వద్ద మోడీ నివాళి
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. 
వరదరాజన్, నీరజ్‌కుమార్ సింగ్‌కు ‘అశోక చక్ర’
ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన జవాన్లు మేజర్ ముకుంద్ వరదరాజన్, నీరజ్‌కుమార్ సింగ్‌కు అశోక చక్ర పురస్కారాలు వరించాయి. ఈ పురస్కారాలను 66వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. షోపియాన్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వరదరాజన్ అమరుడయ్యాడు. జమ్మూకశ్మీర్ కుప్వారాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నీరజ్‌కుమార్ అమరుడయ్యాడు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను నీరజ్‌కుమార్ హతమార్చాడు.
ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ శకటం
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ర్టాలు శకటాలను ప్రదర్శించాయి. తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. బోనాల ఇతివృత్తంతో తెలంగాణ శకటం ముందుకు సాగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శకటాన్ని ప్రదర్శించారు. పోతు రాజుల విన్యాసాలు, బోనాలు ఆకట్టుకున్నాయి. శకటంపై జమ్మి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ శకటాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. ఢిల్లీలోని తెలంగాణవాసులు తెలంగాణ శకటాన్ని చూసి చప్పట్లతో స్వాగతం పలికారు.

No comments:

Post a Comment