Tuesday 11 June 2013

ఆంధ్రపీఎస్సీ


- అక్షరాలా లక్ష కొలువులు
- సమైక్యాంధ్రలో ఇదీ.. మనం కోల్పోయింది!సమైక్యాంధ్రలో ఇదీ..మనం కోల్పోయింది!- సీమాంధ్రుల భర్తీకే ఏపీపీఎస్సీ- అమ్మేసుకుని.. నింపేసుకుని..
- సీమాంధ్ర అధికారుల పెత్తనం
- ఓపెన్ స్థానంలో నాన్‌లోకల్ కోటా .. స్టేట్ పోస్టులవుతున్న జోనల్ పోస్టులు- ఇష్టారాజ్యంగా ఏపీపీఎస్సీ నియామకాలు

       ఉద్యోగాల భర్తీలో ప్రతిసారీ 70%-80% ఉద్యోగాలు సీమాంధ్రులకే ఎందుకు దక్కుతాయి? 1991లో 120 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తే.. 90% సీమాంధ్ర అభ్యర్థులే ఎలా ఎంపికయ్యారు? ఒక్క కడప నుంచే 40 మందికి ఉద్యోగాలు రావడం వెనుక మతలబేంటి? గ్రూప్-1లో టాప్ ర్యాంకులు సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో పది పదిహేను మార్కులే ఎందుకు పడతాయి? జోనల్ పోస్టులను 60% లోకల్ కేటగిరీ కింద.. 40% ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి ఉండగా.. మధ్యలో నాన్‌లోకల్ కేటగిరీ పుట్టుకురావడం వెనుక మంత్రమేంటి? తెలంగాణలో దండిగా కనిపించే నాన్‌లోకల్స్.. సీమాంధ్ర జోన్లలో మచ్చుకైనా కనిపించందుకు? గ్రూప్-2 పోస్టులు.. స్టేట్‌లెవల్ పోస్టులుగా అవతరించడం వెనుక పాత్ర ఎవరిది? పెన్సిల్‌తో రాసిన సీమాంధ్రుల జవాబు పత్రాల్లో తెరచాటు దిద్దుబాటుకు తెలంగాణ చెల్లించుకున్న మూల్యం ఎంత? సమైక్య రాష్ట్ర ఆవిర్భావం అనంతరం.. తెలంగాణకు చెందాల్సిన లక్ష ఉద్యోగాలు ఈ ప్రాంతానికి ఎందుకు రాకుండా పోయాయి? ఎందుకంటే.. రాష్ట్రం మొత్తానికీ న్యాయం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సీమాంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా రూపాంతరం చెందడం వల్లే! ఇష్టారాజ్యంగా మాస్ కాపీయింగ్‌లు.. పరీక్ష ముగిశాక దొంగచాటు దిద్దుళ్లు.. తెలంగాణవారికి మార్కులు వేసే దగ్గర కరడుగట్టిన వివక్ష.. అడ్డగోలు నియామకాలు! ఏపీపీఎస్సీ పోస్టులను నడిబజార్లో అమ్మకానికి పెట్టి.. బ్రోకర్ ఇంట్లో కాలక్షేపానికి పేకాడుకుంటూ బుక్కయిన ప్రబుద్ధులే సాక్ష్యం! నిదర్శనాలు కావాలా? 

(యార నవీన్‌కుమార్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా సీమాంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారిపోయింది. కొలువులన్నీ సీమాంధ్రకు తరలిపోతున్నాయి. తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని నెత్తి నోరు కొట్టుకున్నా అరణ్యరోదనే అవుతోంది. అరకొర ఉద్యోగాలు మినహా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదు. సాక్షాత్తూ ప్రధాన కార్యాలయంలోనే తెలంగాణకు న్యాయమైన వాటా రాని పరిస్థితి ఉంది. అన్యాయాలపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా, రాష్ట్రపతి ఆదేశాలను సైతం ఇక్కడ తుంగలో తొక్కేశారు. పాలకుల వైఖరీ కమిషన్‌కు వత్తాసు పలికే విధంగానే ఉంటోంది. ‘కడుపు నిండాలి... కడప పండాలి...’ అన్నట్లు ఒక నేత వ్యవహరిస్తే.. ఏపీపీఎస్సీ అక్రమాలపై కమిటీ వేసి నివేదిక వచ్చినా దాన్ని తుంగలో తొక్కిన ఘనత మరో సీమాంధ్ర సీఎంది. తాజాగా మరో సీమాంధ్ర సభ్యుడు ఉద్యోగాలు అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రవేటు టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడడంతో నేపథ్యంలో ఏపీపీఎస్సీ బాగోతాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇంత బహిరంగంగా అక్రమాలు బయటపడ్డా ఇంకా మసిపూసి మారేడుకాయ చేసే యత్నాలు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడు స్టింగ్ ఆపరేషన్ జరిగిన రోజు బోర్డులోనే ఉన్నట్లు బోర్డు చైర్మన్ వత్తాసు పలకడం దీనికి పరాకాష్ట.
ఉద్యోగాల భర్తీలో జరిగిన అన్యాయాల పరంపర 
       1975 నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షకు పైగా తెలంగాణ ఉద్యోగాలు సీమాంధ్రులు తన్నుకుపోయినట్టు అంచనా. ఏపీపీఎస్సీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న చైర్మన్లు, సభ్యులు ఎక్కువ శాతం సీమాంవూధులే కావడంతో పాలకుల అండదండలతో వారు తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్నది తెలంగాణ యువత ప్రధాన ఆరోపణ. దీనికి తగ్గట్టుగా ఉద్యోగాలు భర్తీ చేసేన ప్రతి సారి 70 నుంచి 80 శాతం ఉద్యోగాలు సీమాంధ్రకే దక్కాయి. ఇందుకు గత కారణాలు పరిశీలిస్తే...
1) పేపర్ ఆవుట్ చేసి సన్నిహితులకు ఇవ్వటం... 
2) ఏపీపీఎస్సీ సిబ్బందితో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం.. 
3) రాత పరీక్షలో ఎంపికైన సీమాంధ్ర అభ్యర్థులకు ఇంటర్వ్యూలోఎక్కువ మార్కులు వేయటం. 
        ఈ విధానాల వల్ల తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని కోచింగ్ సెంటర్లల్లో వేలకు వేలు కుమ్మరించి గంటలు తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర అధికారులు, సభ్యుల ప్రాంతీయపిచ్చి, కులపిచ్చి కారణంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతవాసి నియామకమైనా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సమయంలో సీమాంవూధలో మాస్‌కాపీయింగ్‌ను చూడనట్టు వదిలేసి,తెలంగాణలో మాత్రం తనిఖీలపేరిట హడలగొడతారనే వాదన బలంగా ఉంది.

1991లో సుమారు 120 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసింది. ఇందులో 90శాతం మంది సీమాంధ్ర అభ్యర్థులే. సీమాంధ్ర పరీక్ష కేంద్రాలు గుంటూరు, తిరుపతి, కడప కేంద్రాల నుంచే 90 మంది ఎంపికయ్యారు. ఒక్క కడప నుంచే 40 మంది ఎంపికయ్యారంటే పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. ఈ అంశంపై పత్రికలు, తెలంగాణ యువకులు గగ్గోలు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే కడప జిల్లాకు చెందిన ఒక ప్రముఖ దివంగత నేత విచారణ అధికారులను బెదిరించటంతో ఆ ఎంక్వైరీ మూలకుపడింది. గ్రూప్-1, గ్రూప్-2 వంటి ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాలలో ఇంటర్యూ విధానం సీమాంవూధులకు అయాచిత వరంగా మారిందని ఇక్కడి యువత ఆరోపిస్తున్నది.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల పేర్లు, జిల్లా వివరాలతో కూడిన లిస్టు బోర్డు సభ్యుల చేతుల్లో ఉండడంతో సీమాంధ్ర అభ్యర్థుల గుర్తింపు సులభమై, సీమాంధ్ర సభ్యులంతా కూడబలుక్కుని వారికి దండిగా మార్కులు వేసి ఎంపిక చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన 2007 గ్రూప్-1 ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారు. 90 మార్కుల ఇంటర్వ్యూ నకు సీమాంధ్రులకు 70 నుంచి 80 మార్కులు, తెలంగాణ అభ్యర్థులకు 15 మార్కులు వేశారు. దీంతో ఆంధ్రావారికి భారీగా ఉద్యోగాలు దక్కాయి.

నాన్‌లోకల్ కేటగిరీ సృష్టి
     1975లో రాష్ట్ర పతి ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ఆ ఉత్తర్వులను ఏపీపీఎస్సీ తుంగలో తొక్కింది. జోనల్ గెజిటెడ్ పోస్టుల నియామకంలో 60 శాతం లోకల్ కేటగిరి, 40 శాతం ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేయాలి. అయితే తెలంగాణ వారి అమాయకత్వం ఆసరా చేసుకుని సీమాంధ్ర అధికారులు నాన్‌లోకల్ కేటగిరీని సృష్టించారు. ఈ 40 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులను నాన్‌లోకల్ కేటగిరీ కింద సీమాంవూదులతో భర్తీ చేశారు. తెలంగాణ జోన్లలో దండిగా కనిపించే నాన్‌లోకల్స్ సీమాంధ్ర జోన్లలో మాత్రం మచ్చుకైనా కనిపించరు. ఒక వేళ ఒకటీ ఆరా నియామకమైనా సీమాంధ్రులు తరిమివేసిన దాఖలాలూ ఉన్నాయి. 

జోనల్ నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 70 శాతం లోకల్ , 30 శాతం ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయాలి. కానీ ఈ 30 శాతం పోస్టులు నాన్‌లోకల్ అభ్యర్థులతో భర్తీ చేశారు. ఇప్పటికీ ఇదే తంతు నడుస్తోంది. జీవో నెంబర్ 124 ప్రకారం గెజిటెడ్ ఉద్యోగాల్లో 40శాతం, నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 30 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయాలి. కానీ రెండూ నాన్‌లోకల్ కోటాగా మార్చి సీమాంధ్రులకు తెలంగాణలో రెడ్‌క్పాట్ పరిచేశారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పంపే వివిధ శాఖల ఖాళీల జాబితా అందగానే ఏ పోస్టులు స్టేట్, జోనల్, జిల్లా పోస్టుల కేటగిరీలోకి వస్తాయో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించాలి. కానీ ఈ పద్దతి పాటించిన దాఖలాలు లేవు. 

జోనల్ పోస్టులుస్టేట్ వైడ్ పోస్టులుగా మారిన వైనం
     డిగ్రీ లెక్చరర్, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ సర్జన్, అసిస్టెంట్ సర్జన్, ఇవన్ని జోనల్ పోస్టులు. కానీ వీటన్నింటినీ స్టేట్ లెవల్‌పోస్టులుగా మార్చి రిక్రూట్‌మెంట్ చేపట్టారు. దీనితో తెలంగాణ ఉద్యోగులుకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గ్రూప్-2 పోస్టులు సైతం స్టేట్ లెవల్‌పోస్టులుగా మార్చి భర్తీ చేసిన ఘనత ఏపీపీఎస్సీదే. ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎక్సైజ్ అఫీసర్స్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, లే సెక్రటరీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్, స్టేట్ వైడ్ రిక్రూట్‌మెంట్ చేపట్టటం వల్ల లోకల్ అభర్థులకు అన్యాయం జరుగుతోంది. 
ఒక్క పెన్సిల్ బోలెడు ఉద్యోగాలు..
         ఒక పెన్సిల్ గీత తెలంగాణ అభ్యర్థుల ఉద్యోగాలు కొల్లగొడుతోంది. కేవలం రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేసే ఉద్యోగాల భర్తీని ఈ పెన్సిల్లే నిర్దారిస్తున్నాయి. రాత పరీక్షలో జవాబు పత్రం(ఓఎమ్మార్‌షీట్ల)లో అభ్యర్థులు పెన్సిల్‌తో జవాబులను గుర్తిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న సీమాంధ్ర పైరవీకారులు ఏపీపీఎస్సీ సిబ్బందితో కుమ్మక్కై జవాబు పత్రాలను దిద్దించుకుని ఎక్కువ మార్కులు వేయించుకుని కొలువులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంటర్వ్యూలో సైతం మార్కులు వేయడానికి పెన్సిల్ ఉపయోగించే పద్దతి అమలు వల్ల వాటిని దిద్ది తమకు కావలిసిన వారికి తర్వాత మార్కులు కలుపుకునే పద్దతి అమలైందన్న ఆరోపణలున్నాయి. 

రాష్ట్ర స్థాయి మెరిట్‌లిస్ట్టు ఆధారంగా నియామకాలు
         ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలను స్టేట్ మెరిట్ లిస్ట్టు ఆధారంగా ఏపీపీఎస్సీ భర్తీ చేస్తోంది. ఈ లిస్టు అడ్డం పెట్టుకుని తెలంగాణలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో సీమాంవూధులను నింపేందుకు కుట్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1017 డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు ఏపీపీఎస్సీ 2009-2010లో విడుదల చేసిన నోటిఫికేషనే దీనికి ఉదాహరణ. ఈ నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీ పోస్టుల ఎంపిక స్టేట్ లెవల్ మెరిట్ లిస్టు ఆధారంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. లోకల్ రిజర్వేషన్ వర్తించదు. పోస్టింగులు మాత్రం జోన్ల వారీగా చేస్తారు. పదోన్నతులు, బదిలీలు జోన్ల వారీగా ఇస్తూ రిక్రూట్‌మెంట్ మాత్రం స్టేట్ మెరిట్ లిస్టు ఆధారంగా చేయటం సీమాంవూధులను ఆక్రమంగా తెలంగాణలో నియమించేందుకేననేది నగ్నసత్యం. గత 45 సంవత్సరాలుగా ఈ ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది.
    1976 వరకు ఈ పోస్టులు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ లెక్చరర్ క్యాడర్‌లో జరిగేవి. తర్వాత ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా మార్చింది. ఇక్కడ నుండే అసలు మోసం ప్రారంభమైంది. గెజిటెడ్ పోస్టులకు లోకల్ రిజర్వేషన్లు వర్తించవు. గెజిటెడ్‌గా మార్చి స్టేట్ లెవల్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయటం సులువైంది. స్టేట్ లెవల్ మెరిట్ ద్వారా ఎంపిక చేసి జోన్ల వారిగా పోస్టింగులు ఇవ్వటం అంటే తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొట్టడమే. ఈ అన్యాయాన్ని తెలంగాణ అభ్యర్థులు ప్రతిఘటించినా ఫలితం లేదు. 1983 నుండి ఇప్పటి వరకూ కామర్స్ విభాగంలో నియామకాలు పరిశీలిస్తే హైదరాబాద్ సిటీ క్యాడర్‌లో కేవలం ముగ్గురు తెలంగాణ వారు నియమించబడ్డారు. లోకల్ మెరిట్ ఆధారంగా నియమించి ఉంటే హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికేదక్కేవి. 

సీమాంధ్రలో రాసుకో రాజా..
         2010 డిగ్రీ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో ఆంధ్ర ప్రాంతంలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణలో మాత్రం అధికారులు దాడుల మీద దాడులు జరిపి పర్యవేక్షించారు. మాస్ కాపీ పర్యవసానంగా వరస హాల్‌టికెట్ నెంబర్లు ఉన్న ఆంధ్రప్రాంతం వారు పెద్ద సంఖ్యలో ఇంటర్యూకు ఎంపికయ్యారు. పరీక్షా పత్రం ఎంపిక కమిటీ సభ్యుడైన ఆంధ్రా వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ దీనిలో చక్రం తిప్పారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు చేరాయి. డిగ్రీ లెక్చరర్ పోస్టులు స్టేట్ లెవల్ కావటంతో తెలంగాణ వారికి ఈ పోస్టులు దక్కకుండాచేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి నియామకాల్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఓపెన్ కేటగిరీలో 14 పోస్టులుండగా తెలంగాణ వారికి ఒకే పోస్టు దక్కడం దీన్నే ధృవపరిచింది. నాటి పరీక్షల్లో గతంలో ఏపిపిఎస్సీ చరిత్రలో ఎన్నడూని విధంగా 500 మార్కులకు 399 గరిష్ట మార్కులు వచ్చాయి. ఇంటర్యూకు విశాఖ పట్నం కేంద్రంలో పరీక్ష రాసిన 28 మంది అభ్యర్థులు ఎంపిక కావటం, వరస హాల్ టికెట్ల నెంబర్లు కావడంతో విషయం బయటపడగా, ఈ అంశంపై విచారణ జరిపినా చివరికి అంతా తూచ్ అని ఏపీపీఎస్సీ అధికారులు తేల్చేశారు. 

సీమాంధ్రుల అక్రమాలు ధృవీకరించిన జె.సత్యనారాయణ నివేదిక
       ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వెంకట్‌రామ్‌డ్డి ఉన్న సమయంలో గ్రూప్-1,2 కేటగిరీ ఉద్యోగాలకులకు సంబంధించి అక్రమాలు జరిగాయిని బాధితులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. దానితో ప్రభుత్వం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను విచారణ అధికారిగా నియమిస్తూ 2010లో 3459 జీవోను జారీ చేసింది. ఆయన సంబందించిన అక్రమాలపై నివేదిక ఇచ్చారు. దాదాపు రెండేళ్లు దాటినా చర్యలు మాత్రం లేవు. 2006 గ్రూప్-1,2 నియామకాలకు సంబంధించి రిక్రూట్ క్యాంపు అధికారులుగా అప్పటి ఏపీపీఎస్సీ అధనపు కార్యదర్శి సఫీఉల్‌హక్ రిక్రూట్‌మెంట్ క్యాంపు అధికారి వ్యవహరించగా, అసిస్టెంట్ క్యాంపు అధికారిగా ఏఎస్‌ఒ పాండురంగారావు ఉన్నారు. సఫీఉల్‌హక్ మాజీ చైర్మన్ వెంకటరామ్‌డ్డి సొంతజిల్లా అనంతపూర్‌కు, పాండురంగారావు కృష్ణా జిల్లాకు చెందినవారు కావడంతో గ్రూప్ - 1,2 నియామకాల్లో తెలంగాణవారికి అన్యాయం జరిగిందని అభ్యర్థులు రాష్ట్రపతికి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెద్దసార్లు ఆంద్రోళ్లు... చప్రాసీలు తెలంగాణ వారు
     నియామకాల సంగతి ఇలా ఉంటే అసలు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కూడా దీనికి భిన్నమైన పరిస్థితి లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన ఈ కార్యాలయంలో కీలక స్థానాల్లో సీమాంధ్ర సిబ్బంది తిష్ట వేశారు. అటెండర్, వాచ్‌మెన్లు, గేటు కీపర్ల వంటి ఉద్యోగాల్లో తెలంగాణ వారిని నియమించారు. ప్రశ్నిస్తే ఏపీపీఎస్సీ స్వయంప్రతిపత్తి సంస్థ కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో వర్తించదనే జవాబు వస్తోంది. ఏపీపీఎస్సీ బోర్డులో టైపిస్టు నుంచి డిప్యూటీ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం పోస్టుల సంఖ్య 380. ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య 207 మంది కాగా 173 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేసే 207 మందిలో 128 మంది సీమాంధ్రులు, 79 మంది తెలంగాణ ఉద్యోగులున్నారు. ఈ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ శాతం టైపిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్లు. చైర్మన్ తర్వాత స్థానం కార్యదర్శిది.

ఐఏఎస్ అధికారినే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్యిగా నియమిస్తుంది. కార్యదర్శి సెలవులో ఉన్న, ఖాళీగా ఉన్న సమయాల్లో ఇంచార్జిగా వ్యవహరించేది అడిషనల్ కార్యదర్శి. ఉన్న ఈ ఒక్క పోస్టులో సీమాంవూధులే ఉన్నారు. ఉప కార్యదర్శి పోస్టులు నాలుగింటిలో మూడింట ఆంధ్రావారే ఉన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు 25 ఉండగా 16 మంది సీమాంధ్రులు,  9 మంది తెలంగాణ వారున్నారు. ఒక అకౌంట్ ఆఫీసర్ పోస్టు ఉంటే అదీ ఆంధ్రా ప్రాంతవాసికే అప్పగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 65 మందిఉండగా 36 మంది ఆంధ్రావారే. ఇక నాలుగవ తరగతి ఉద్యోగాలు 72 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న 46 మందీ తెలంగాణ వారే. ఉన్న తెలంగాణ ఉద్యోగుల సంఖ్య తక్కువ కాగా వారికీ సరైన ప్రాధాన్యత లేదు. అడ్మినిస్ట్రేషన్ విభాగం పూర్తిగా ఆంధ్రుల చేతుల్లోనే ఉంది.

No comments:

Post a Comment