Tuesday 21 May 2013

మల్లెల తీర్థం                                                
                             
          మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అరణ్యంలో ఉన్న అందమైన ప్రకృతి జలపాతం ‘మల్లెలతీర్థం’. శ్రీశైలం దేవాలయానికి 58 కి.మీ. దూరంలో ఇది ఉంది. అడవి నుంచి ప్రవహించే కృష్ణానది నుండి ఈ జలపాతం ఏర్పడింది. దీన్ని చేరుకోవాలంటే 350 మెట్లు దిగాల్సి ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఈ జలపాతం చూడడానికి బాగుంటుంది. అత్యంత ఎత్తైన కొండలపై నుంచి పడే నీటిని చూడడానికి రెండు కళ్లు చాలవు!
కబూతర్ ఖానా
                                   

పావురాలపై హైదరాబాదీల ప్రేమకు చిహ్నం కబూతర్ ఖానా. పావురాల నివాసం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ నివాసాలు కోఠిలోని హస్మత్‌గంజ్, హుస్సేనీ ఆలంలోనూ ఉన్నాయి. కోఠిలో 1941లో నిర్మిస్తే, హుస్సేనీ ఆలంలో 200 సంవత్సరాలకు పూర్వమే వీటిని నిర్మించారు. దీన్ని సిద్ది ఇబ్రహీం అనే వ్యక్తి కట్టించాడంటారు. ఇందులో సుమారు వెయ్యి పావురాలు నివాసం ఉండేందుకు వీలుగా 135 తొర్రలు ఉన్నయి. వందలాది పావురాలు ఇక్కడ నివసిస్తున్నయి.
ఏకశిల మహాగణపతి        

                     
పచ్చని పొలాల మధ్య కొలువుతీరిన 30 అడుగుల మహాగణపతి విగ్రహం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలోని ఆవంచ గ్రామంలో ఉంది. క్రీ.శ. 12 శతబ్దానికి చెందిన ఈ ఏకశిల గణపతి విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజు బాదామి విక్రమాదిత్యుని రెండో కుమారుడు తైలపుడు చెక్కించాడు. కొన్ని కారణాలతో విగ్రహ ప్రతిష్టాపన నిలిచిపోయిందట. ఎనిమిదిన్నర శతబ్దాల చరిత్ర కలిగిన ఈ విగ్రహనికి గుడి కట్టాలని స్థానికులు ప్రయత్నిస్తున్నరు.
కాళేశ్వరం యమకోణం                    
                                       

     కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో ఈ యమకోణం ఉంది. చాళుక్యులు నిర్మించినట్లు చెప్పే ఈ దేవాలయాన్ని కాకతీయులు పునఃవూపతిష్టించినట్లు తెలుస్తోంది. శివుడు, యముడు ఒకే పానపట్టం పై ఉండే ఈ దేవాలయం ప్రాంగణంలోని యమకోణం చాలా పురాతనమైంది. ఈ కోణంలో నుండి ఈగితే పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తరు.
జన్నాయిగూడెం దుర్గం                     
                                    
రంగాడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరరావిరాల సమీపంలో ఈ దుర్గం ఉంది. గోల్కొండ చివరి నవాబు తానిషా వద్ద సేనాధిపతులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నలు దీన్ని నిర్మించినట్లు చెబుతరు. ఈ దుర్గంలో రహస్యగదులు, సైనిక స్థావరాలు మంత్రముగ్ధులను చేస్తయి. మరాఠా వీరుడు శివాజీ శ్రీశైలం దర్శనానికి వెళ్తూ ఇక్కడి వచ్చినట్లు చెబుతరు. ఆయన రాక సందర్భంగా ఈ దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment